దెయ్యాలు భూతాలు లేకుండా కేవలం చావు ఎలిమెంట్ తో ఒళ్ళు గగుర్పొడిచేలా సినిమా తీయొచ్చని నిరూపించిన మూవీ ఫైనల్ డెస్టినేషన్. 2000 సంవత్సరంలో మొదలైన ఈ పరంపరలో ఇప్పటిదాకా అయిదు భాగాలు వచ్చాయి. చివరిది 2011లో రిలీజయ్యింది. పద్నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు చివరి పార్ట్ బ్లడ్ లైన్స్ పేరుతో తీసుకొచ్చారు. ఇండియాలో ముందు రోజు అర్ధరాత్రే ప్రీమియర్లు వేయడం ద్వారా మన ఆడియన్స్ మీద నిర్మాతలకు ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఇంత టెర్రిఫిక్ కంటెంట్ తో వచ్చిన బ్లడ్ లైన్స్ నిజంగా బ్లడ్ బాయిలయ్యేలా ఉందో లేదో చిన్న లుక్ వేద్దాం పదండి.
1968లో స్కై వ్యూ అనే వందల అంతస్థుల పైనున్న హోటల్ ప్రారంభోత్సవంలో ప్రమాదం జరిగి ప్రతిఒక్కరు చనిపోతారని ముందే కలగన్న ఐరిస్ (గాబ్రియేల్ రోస్) అందరిని కాపాడుతుంది. అయితే తర్వాతి రోజుల్లో ఒక్కొక్కరుగా విచిత్ర పరిస్థితుల్లో దారుణంగా ప్రాణాలు కోల్పోతారు. ఆమె మాత్రం బ్రతుకుతుంది. కట్ చేస్తే వర్తమానంలో ఐరిస్ మనవరాలికి అచ్చం అదే కల మళ్ళీ వచ్చి తన ఫ్యామిలీ సైతం అదే రీతిలో బలవుతుందని గుర్తించి అమ్మమ్మ దగ్గరికి వెళ్తుంది. చావు నుంచి ఎలా తప్పించుకోవాలో చెప్పే పుస్తకం తీసుకుని వెనక్కు వస్తుంది. ఎన్ని విశ్వప్రయత్నాలు చేసినా లాభం ఉండదు. అదే అసలు స్టోరీ.
కేవలం గంటా యాభై నిముషాలు మాత్రమే ఉన్న బ్లడ్ లైన్స్ లో హత్యలు చాలా భయానకంగా చూపించారు దర్శకులు జాచ్ లిపోవ్స్కి, ఆడమ్ స్టెయిన్. ప్రారంభంలో వచ్చే స్కై వ్యూ ఎపిసోడ్, హాస్పిటల్ లో ఎంఆర్ఐ మెషీన్ చేసే మర్డర్, మునిసిపాలిటి వ్యాన్ లో అమ్మాయి చనిపోయే సీన్ కన్నార్పకుండా చూడటం కష్టం. ముందు భాగాలంత గ్రిప్పింగ్ గా అనిపించకపోయినా ఈ సిరీస్ లవర్స్ నిరాశ చెందరు. కాకపోతే రక్తాన్ని చూసి తట్టుకునే ధైర్యం ఉండాలి. చాలా చోట్ల మనకు తెలియకుండా కళ్ళు మూసుకుంటాం. అంత జుగుప్సాకర హింస ఉంటుంది. క్లైమాక్స్ జస్ట్ ఓకే. ముగింపని చెప్పారు కానీ డాక్టర్ పాత్ర ద్వారా లీడ్ అయితే వదిలారు.
This post was last modified on May 16, 2025 10:14 pm
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…