విశ్వంభర తర్వాత చిరంజీవి కమిట్ మెంట్ ఇచ్చింది అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెలకే. వీళ్ళు ఇద్దరూ కాకుండా అఫీషియల్ గా ఎవరికీ ఎస్ చెప్పలేదనేది నిన్నటి దాకా వినిపించిన టాక్. ఫైనల్ గా దానికో క్లారిటీ వచ్చేసింది. కొద్దివారాల క్రితం లీకైనట్టు వాల్తేరు వీరయ్య కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ మెగాస్టార్ మరోసారి దర్శకుడు బాబీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇటీవలే ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన రచయిత కోన వెంకట్ ఈ విషయాన్ని పంచుకోవడంతో పాటు స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నానని చెప్పడంతో సందేహాలు తీరిపోయాయి. అనిల్ రావిపూడి తర్వాత ఈ సినిమానే ఉంటుందని చూచాయగా చెప్పేశారు.
దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం మరొకటి ఉంది. అనిల్ రావిపూడి సినిమా అయ్యాక చిరంజీవికి గ్యాప్ వస్తుంది. శ్రీకాంత్ ఓదెల నాని ప్యారడైజ్ పూర్తి చేసుకుని, రిలీజ్ చూసుకుని వచ్చేలోపు 2026 మార్చ్ వచ్చేస్తుంది. ఆ తర్వాతే మెగా స్క్రిప్ట్ మీద పని మొదలుపెట్టాలి. అటుపై ఇంకో ఆరు నెలలు పట్టే అవకాశాన్ని కొట్టి పారేయలేం. ఈలోగా చిరు బాబీది సులభంగా ఫినిష్ చేయొచ్చు. బాషా ఫార్ములాలో రెగ్యులర్ గా కాకుండా కొత్త పాయింట్ ట్రై చేస్తున్నామని, అలాని ఫ్యాన్స్ నిరాశపరచకుండా, ప్రేక్షకులు చిరంజీవి నుంచి ఏమేం కోరుకుంటారో అవన్నీ ఉంటాయని కోన వెంకట్ కుండ బద్దలు కొట్టేశారు.
సో వాల్తేరు వీరయ్యని మించి హిట్ ఇవ్వాల్సిన బాధ్యత బాబీ మీద ఉంది. బాలకృష్ణ డాకు మహారాజ్ హిట్టయినప్పటికీ దాన్ని పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచేలా హ్యాండిల్ చేయలేదనే కామెంట్స్ బాబీ మీద వచ్చాయి. ముఖ్యంగా సెకండాఫ్, క్లైమాక్స్ గురించి ఎక్కువ విశ్లేషణలు జరిగాయి. అందుకే సంక్రాంతికి వస్తున్నాం పోటీని తట్టుకోలేక డాకు మహారాజ్ డీసెంట్ హిట్ గా రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈసారి బాబీ అలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చూసుకోవాలి. టాక్సిక్, జన నాయగన్ నిర్మిస్తున్న కెవిఎన్ ప్రొడక్షన్స్ లో ఈ సినిమా రూపొందవచ్చని తెలిసింది.
This post was last modified on May 16, 2025 8:16 pm
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…