టాలెంట్, రూపం రెండూ ఉన్నప్పటికీ రకరకాల కారణాల వల్ల కెరీర్ ని రెగ్యులర్ గా కొనసాగించలేకపోయిన సుమంత్ ‘మళ్ళీ రావా’ నుంచి మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేశాడు. తర్వాత హిట్లు పెద్దగా లేకపోయినప్పటికీ సార్, సీతా రామం లాంటి వాటిలో వేసిన పాత్రలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. థియేటర్ ఫుల్ లేకపోయినా సుమంత్ మీద ప్రేక్షకులకు సదాభిప్రాయమే ఉంది. అందుకే ఓటిటి వైపు అడుగులు వేస్తూ ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా వచ్చిందే అనగనగా. ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఎమోషనల్ మూవీకి మొన్న హైదరాబాద్ లో స్పెషల్ ప్రీమియర్లు వేశారు.
ఓటిటిలో ఈ సినిమాకు ప్రశంసలు వస్తున్నాయి. విమర్శకులు మెచ్చుకుంటున్నారు. సున్నితమైన విద్యా వ్యవస్థలోని లోపాలను నేపథ్యంగా ఎంచుకున్న దర్శకుడు సన్నీ సంజయ్ దాన్ని తెరకెక్కించిన తీరు భావోద్వేగాలతో నిండిపోయింది. తారే జమీన్ పర్, త్రీ ఇడియట్స్ తరహా బ్యాక్ డ్రాప్ అనిపించినప్పటికీ తెలుగు నేటివిటీని తీసుకుని ఇప్పటి కార్పొరేట్ స్కూళ్లలో జరుగుతున్న పిల్లల మానసిక వ్యాపారాన్ని సునిశితంగా ఎండగట్టిన తీరు ఆకట్టుకునేలా ఉంది. బట్టికొట్టే పాఠాల కంటే కథల ద్వారా ఎదుగుదల బాగుంటుందని నమ్మే పర్సనాలిటీ డెవలప్ మెంట్ టీచర్ పాత్రలో సుమంత్ జీవించారు.
బెస్ట్ క్లాసిక్ లాంటి పెద్ద సర్టిఫికెట్లు కాదు కానీ ఎలివేషన్లు, హీరోయిజంతో నిండిపోయిన టాలీవుడ్ తెరకు అనగనగా కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. నటీనటుల నుంచి రాబట్టుకున్న నటన కంటెంట్ ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. కథనం కొంచెం నెమ్మదిగా సాగినప్పటికీ ఓటిటి వాచ్ కోణంలో చూసుకుంటే ఇది పెద్ద లోపంగా అనిపించదు. ముఖ్యంగా పిల్లలను బళ్ళలో మార్కుల కోసం ఒత్తిడి చేసే తీరు, వాటి పర్యవసానాలు తల్లితండ్రులు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఈ తరహా ప్రయత్నాలు క్రమం తప్పకుండా ఓటిటిలో అయినా వస్తూనే ఉండాలి. హిందీ, మలయాళంలో వచ్చే ఇలాంటి కాన్సెప్ట్స్ ఇప్పుడు తెలుగులో రావడం ఆహ్వానించదగినదే.
This post was last modified on May 15, 2025 7:22 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…