సినీ రంగంలోకి వచ్చే ప్రతి వారసుడూ క్లిక్ అయిపోతాడని గ్యారెంటీ ఏమీ లేదు. అయినా సరే సినీ కుటుంబాల్లో ఒక అబ్బాయి ఉన్నాడంటే అతను హీరో కావాల్సిందే అన్నట్లుగా ఉంటోంది కొన్నేళ్లుగా వ్యవహారం. ఇంతకుముందు పెద్ద హీరోల కొడుకులే హీరోలయ్యేవాళ్లు కానీ.. ఈ మధ్య వాళ్ల బంధుగణాల్లో అందరూ హీరోలైపోతున్నారు. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కూడా తమ కొడుకుల్ని హీరోలుగానే చేస్తున్నారు. ఐతే వాళ్లలో నిలదొక్కుకుంటున్న వాళ్లు చాలా తక్కువమంది.
టాలీవుడ్లో మంచి పలుకుబడి ఉన్న సీనియర్ నటుడు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా సైతం తన కొడుకు విజయ్ రాజాను హీరోగానే దించాడు. కానీ అతను ఇప్పటిదాకా నటించిన ఏ సినిమా కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయింది. ఇప్పుడతను ‘జెమ్’ అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా ఫస్ట్ లుక్ను శుక్రవారం సీనియర్ హీరో రవితేజ లాంచ్ చేశాడు. ఈ చిత్రం కోసం విజయ్ రాజా నగ్నావతారం ఎత్తడం విశేషం. అతను పూర్తి నగ్నంగా ఉండగా ఎర్రటి బట్ట అతణ్ని కప్పి ఉన్నట్లుగా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఒళ్లంతా గాయాలతో రక్తమోడుతూ కనిపిస్తున్నాడు విజయ్ రాజా. ఐతే సీరియస్ లుక్ కోసం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ మాత్రం పేలవంగా అనిపిస్తోంది.
సుశీల సుబ్రహ్మణ్యం అనే దర్శకుదు ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా.. కుమారస్వామి పత్తికొండ నిర్మిస్తున్నాడు. సునీల్ కశ్యప్ సంగీతం సమకూరుస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు లాంటి పేరున్న టెక్నీషియన్లు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. విజయ్ ఇది కాక ‘వేయి శుభములు కలుగుగాక’ అని మరో సినిమా కూడా చేస్తున్నాడు. ఐతే కొడుకు కోసం ఇప్పటిదాకా అయితే శివాజీ రాజా కాస్త పేరున్న కాంబినేషన్లు సెట్ చేయలేకపోయాడు. లుక్స్ పరంగా యావరేజ్ అనిపిస్తున్న విజయ్.. ఇలాంటి సినిమాలతో ఏమేర క్లిక్ అవుతాడో చూడాలి.
This post was last modified on November 7, 2020 12:06 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…