చేసిన సినిమాలు తక్కువే అయినా.. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే గ్రేటెస్ట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు రాజ్ కుమార్ హిరాని. కెరీర్ ఆరంభంలోనే ఆయనకు గొప్ప పేరు తెచ్చిన చిత్రాలు.. మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగేరహో మున్నాభాయ్. ఆ తర్వాత 3 ఇడియట్స్, పీకే, సంజు లాంటి క్లాసిక్స్ అందించాడు. ఆయన చివరి చిత్రం ‘డంకీ’ ఓ మోస్తరు ఫలితాన్నందుకుంది. మళ్లీ తన మార్కు చూపించడానికి ‘మున్నాభాయ్’ ఫ్రాంఛైజీ మీద హిరాని దృష్టిసారించినట్లు వార్తలు వచ్చాయి. హిరాని సైతం తాను ‘మున్నాభాయ్-3’ స్క్రిప్టు మీద పని చేస్తున్నట్లు చెప్పాడు.
ఈ సీక్వెల్ గురించి చాలా ఏళ్ల కిందటే వార్తలు వచ్చాయి. ‘మున్నాభాయ్ ఛలే అమెరికా’ పేరుతో సినిమా అనుకున్నారు. కానీ అది ముందుకు కదల్లేదు. ఐతే ఇటీవల ‘మున్నాభాయ్-3’ మీద హిరాని సీరియస్గా కనిపించడంతో ఆ సినిమా పట్టాలెక్కుతుందనే అనుకున్నారు. కానీ స్క్రిప్టు అనుకున్నంత బాగా రాలేదా.. లేక వేరేదైనా కారణాలున్నాయా తెలియదు కానీ.. హిరానీ ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేశాడని అంటున్నారు.
ప్రస్తుతం ఆయన విక్రాంత్ మాసే, విక్కీ కౌశల్తో కలిసి ఒక వెబ్ సిరీస్ తీసే పనిలో పడ్డారు. ఇది పూర్తయ్యాక ఆమిర్ ఖాన్తో హిరాని జట్టు కట్టబోతున్నారట. 3 ఇడియట్స్, పీకే తర్వాత హ్యాట్రిక్ మూవీ మీద వీళ్లిద్దరూ పని చేయబోతున్నారట. తమ శైలికి తగ్గట్లే లైట్ హార్టెడ్ కామెడీ, ఎమోషనల్ టచ్ ఉన్న సబ్జెక్టుతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారట. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లొచ్చని సమాచారం. దీంతో ‘మున్నాభాయ్-3’కి మరోసారి బ్రేక్ పడినట్లే అని.. ఇక ఆ సినిమా తెరకెక్కడం అనుమానమే అని బాలీవుడ్ వర్గాల సమాచారం.
This post was last modified on May 14, 2025 7:44 pm
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…