సాధారణంగా యూట్యూబ్ వీడియోల ప్రారంభంలో మధ్యలో యాడ్స్ రావడం చూస్తున్నదే. ఉచితంగా చూడాలంటే దీన్ని భరించక తప్పదు. ఒకవేళ వద్దనుకుంటే నెలకింత చొప్పున సొమ్ములు కట్టి వాటి నుంచి తప్పించుకోవచ్చు. దీనికి ఏడాదికి పదిహేను వందలకు పైగా ఖర్చవుతుంది కాబట్టి చాలా మంది ప్రకటనలను భరిస్తూనే ఫ్రీగా సినిమాలు, ఛానల్స్ చూస్తుంటారు. కానీ పెయిడ్ రూపంలో చందాలు తీసుకునే ఓటిటిలలో ఇలా ఉండేది కాదు. కట్టిన సొమ్ముకు న్యాయం చేకూరేలా ఎలాంటి ఆటంకాలు లేని సీమ్ లెస్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడంతో కొత్త చిత్రాలు, వెబ్ సిరీస్ ల కోసం ఆడియన్స్ ఖర్చు పెట్టేవాళ్ళు.
ఇప్పుడీ ట్రెండ్స్ మారుతున్నాయి. జూన్ 17 నుంచి అమెజాన్ ప్రైమ్ లో యాడ్స్ రాబోతున్నాయి. మాకొద్దు అనుకుంటే ఇప్పటికే కడుతున్న చందాతో పాటు అదనంగా 699 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే ప్రకటనల ప్రహసనం భరించాలి. దీనికి సంబంధించిన సమాచారంతో ఇప్పటికే సబ్స్క్రైబర్స్ కు మెయిల్స్ వస్తున్నాయి. ఆహా ఈ మోడల్ ని గత ఏడాది నుంచే ఫాలో అవుతుండగా ఈ మధ్య ఈటీవీ విన్ లోనూ ప్రోగ్రాం ప్రారంభంలో యాడ్స్ వస్తున్నాయి. జియో హాట్ స్టార్ వాడేవాళ్ళకు ఇది ఎప్పటి నుంచో అనుభవమే. నెట్ ఫ్లిక్స్ ప్రీమియమ్ క్యాటగిరీ కాబట్టి ధరకు తగ్గట్టే ఇందులో ఎలాంటి సమస్య లేదు.
ఆదాయం కోణంలో చూసుకుంటే ఇది డిజిటల్ కంపెనీలకు లాభసాటి బేరమే కానీ క్రమంగా శాటిలైట్ ఛానల్స్ తరహాలో ఓటిటిలు కూడా యాడ్స్ మయంగా మారిపోతే ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోయే ప్రమాదం లేకపోలేదు. అప్పుడు పైరసీ లాంటి అడ్డదారులు వెతుక్కుంటారు. ఇంకో కోణంలో చూసుకుంటే ఇది థియేటర్ ఫుట్ ఫాల్స్ కు సానుకూలంగా మారే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఏది ఏమైనా ఈ ధోరణికి అలవాటు పడటం రాబోయే రోజుల్లో అవసరమే. కొత్త సినిమాలు త్వరగా ఓటిటిలో వస్తే చూడకుండా ఉండలేని సగటు సినీ ప్రేమికుల బలహీనత ఇలాంటి పెంపులు, మార్పులు ఎన్ని వచ్చినా స్వాగతిస్తుంది.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…