ఈ మధ్య కాలంలో ఓటీటీల్లో బాగా ట్రెండ్ అయిన సినిమా.. పెరుసు. లెజెండరీ తెలుగు డైరెక్టర్ కోదండరామిరెడ్డి తనయులు వైభవ్ రెడ్డి, సునీల్ రెడ్డి ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. ప్లాట్ పాయింట్ అడల్ట్ టచ్ ఉన్నదే అయినా.. హద్దులు దాటని కామెడీతో ఈ సినిమాను భలేగా నడిపించి మెప్పించింది చిత్ర బృందం. తమిళంతో పాటు వేరే భాషల వాళ్లూ ఈ సినిమాను బాగా చూశారు. ఈ చిత్రంలో వైభవ్కు జోడీగా నటించి మెప్పించిన అమ్మాయి నిహారిక ఎన్ఎం. సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి ఈ అమ్మాయి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
ఇన్స్టాలో ఏకంగా 35 మిలియన్ల ఫాలోవర్లున్నారు ఆ అమ్మాయికి. గతంలో మహేష్ బాబు సైతం ఈ అమ్మాయితో కలిసి తన ప్రొడక్షన్లో వచ్చిన ‘మేజర్’ మూవీని ప్రమోట్ చేయడం విశేషం. ఇప్పుడు నిహారిక ఒక పాన్ ఇండియా మూవీలో అవకాశం దక్కించుకుంది. ఆ సినిమాను డైరెక్ట్ చేయబోయేది పూరి జగన్నాథ్ కావడం విశేషం.
విజయ్ సేతుపతి హీరోగా పూరి ఇటీవలే ఓ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో టబు, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో సేతుపతికి జోడీగా అనేక పేర్లను పరిశీలించిన చిత్ర బృందం.. చివరికి నిహారికను ఎంపిక చేసినట్లు సమాచారం. ‘పెరుసు’ సినిమాలో నిహారిక పెర్ఫామెన్స్ నచ్చి ఆమెను పిలిచి ఆడిషన్ చేసింది చిత్ర బృందం. అందులో ఇంప్రెస్ చేయడంతో ఆమెనే ఫైనలైజ్ చేశారట. ఇందులో అన్నీ పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్సే ఉంటాయని.. నిహారికది కూడా అలాంటి పాత్రే అని సమాచారం. తన కెరీర్ను మలుపు తిప్పే సినిమాగా ఇది నిలవడం ఖాయం అంటున్నారు. ఇక ఈ చిత్రంలో రాధికా ఆప్టే నటిస్తోందనే వార్తలు నిజం కాదని తెలిసింది. వచ్చే నెలలో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుంది.
This post was last modified on May 12, 2025 3:50 pm
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…