‘పెళ్ళి సందడి’ అనే సబ్ స్టాండర్డ్ మూవీతో తెలుగులోకి అడుగుపెట్టింది తెలుగు మూలాలున్న కన్నడ అమ్మాయి.. శ్రీ లీల. తన తొలి సినిమా కంటెంట్ చాలా వీక్ అయినప్పటికీ.. తన అందచందాలు, డ్యాన్స్తో అదరగొట్టి తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది. రెండో చిత్రం ‘ధమాకా’ హిట్ కావడంతో ఆమెకు తిరుగులేకపోయింది. కొన్నేళ్ల వ్యవధిలోనే ఆమె సినిమాల సంఖ్య డబుల్ డిజిట్కు చేరిపోయింది. తెలుగుకే పరమితం కాకుండా బహుభాషలకు ఆమె ప్రభ విస్తరిస్తోంది. ఆల్రెడీ తమిళంలో శివకార్తికేయన్ సరసన ‘పరాశక్తి’లో నటిస్తున్న శ్రీలీలకు హిందీలో ‘ఆషికి-3’ లాంటి క్రేజీ మూవీలో అవకాశం దక్కిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు బాలీవుడ్లో ఆమెకు మరో పెద్ద ఆఫర్ దక్కినట్లు సమాచారం. బాలీవుడ్లో శ్రీలీల నటించబోయే రెండో చిత్రం కూడా సీక్వెలే కావడం విశేషం. కరణ్ జోహార్ సంస్థ ‘ధర్మ ప్రొడక్షన్స్’ నిర్మించబోయే ఆ చిత్రమే.. దోస్తానా-2. జాన్ అబ్రహాం, అభిషేక్ బచ్చన్ నటించిన ‘దోస్తానా’ పెద్ద హిట్టే అయింది.
దీనికి కొనసాగింపుగా కార్తీక్ ఆర్యన్, ‘కిల్’ ఫేమ్ లక్ష్య, జాన్వి కపూర్లతో ‘దోస్తానా-2’ చేయాలనుకున్నారు. కానీ అది ముందుకు కదల్లేదు. కానీ ఇప్పుడు కార్తీక్ స్థానంలో విక్రాంత్ మాసే, జాన్వి స్థానంలో శ్రీలీలను ఎంపిక చేసి సినిమాను పట్టాలెక్కిస్తున్నారని సమాచారం. ఆమిర్ ఖాన్తో ‘లాల్ సింగ్ చడ్డా’ లాంటి డిజాస్టర్ తీసిన అద్వైత్ చౌహాన్ ‘దోస్తానా-2’ను డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాకపోవచ్చని.. నేరుగా అమేజాన్ ప్రైమ్లో రిలీజయ్యేలా డీల్ చేసుకుని ఈ చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నాడట కరణ్ జోహార్.
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…
తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై…
మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…
ఏపీలో విగ్రహాల ధ్వంసం వ్యవహారం విపక్ష వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పాలి. నంద్యాలలో ఆదివారం ఉదయం వైఎస్ విగ్రహం ధ్వంసం ఘటనలో…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన బలోపేతం దిశగా…
తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…