తమిళంలో యాక్షన్ సినిమాలకు పేరుపడ్డ విశాల్.. గతంలో చాలా ఫిట్గా కనిపించేవాడు. తమిళంలో ముందుగా సిక్స్ ప్యాక్ చేసిన హీరోల్లో అతనొకడు. తన సినిమాల శైలికి తగ్గట్లే అతనపుడు చాలా దృఢంగా కనిపించేవాడు. ఐతే ఎలాంటి హీరోకైనా వయసు పెరిగేకొద్దీ ఫిట్నెస్ తగ్గడం మామూలే. విశాల్ కూడా అందుకు మినహాయింపు కాలేకపోయాడు. గత కొన్నేళ్లలో వచ్చిన సినిమాల్లో తన లుక్ దెబ్బ తింది. ఐతే అంత వరకు ఓకే కానీ.. ఇటీవల విశాల్ తీవ్ర అనారోగ్యం దెబ్బ తిన్నట్లు వార్తలు రావడంతో అభిమానులు కంగారు పడ్డారు.
తన లాంగ్ డిలేయ్డ్ మూవీ ‘మదగజ రాజా’ సంక్రాంతి టైంలో రిలీజైనపుడు విశాల్ చాలా ఇబ్బందికరంగా కనిపించడం, మైక్ పట్టుకుని మాట్లాడుతుంటే తన చేతులు వణకడం, ముఖంలో మార్పు రావడం చర్చనీయాంశం అయింది. కొన్ని రోజులకు అతను కోలుకున్నట్లే కనిపించాడు. అంతటితో కథ సుఖాంతం అయిందనుకుంటే.. తాజాగా విశాల్ ఒక కార్యక్రమం సందర్భంగా స్టేజ్ మీద కళ్లు తిరిగి పడిపోవడం, అతణ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాల్సిన పరిస్థితి రావడంతో మళ్లీ అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. విశాల్కు ఏదైనా తీవ్ర అనారోగ్య సమస్య ఉందా అన్న చర్చ జరుగుతోంది. ఐతే లేటెస్ట్ ఇన్సిడెంట్ గురించి విశాల్ మేనేజర్ మీడియాకు క్లారిటీ ఇచ్చాడు.
విశాల్ ఆహారం తీసుకోకపోవడం వల్ల కళ్లు తిరిగి పడిపోయాడని.. అంతకుమించి ఏమీ లేదని.. చికిత్స అనంతరం కోలుకున్నాడని చెప్పాడు. కానీ ఇదే అసలైన కారణమా అని మీడియా వాళ్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘మదగజ రాజా’ టైంలో హై ఫీవర్ వల్లే విశాల్ చేతులు వణికాయన్నారు. కానీ ఆ మాత్రానికే అలా అవుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఫుడ్ తీసుకోకపోవడం వల్లే విశాల్ అలా పడిపోయాడన్నా కూడా నమ్మకం కలగట్లేదు. విశాల్ సమస్య ఏదైనప్పటికీ అతను దాన్నుంచి పూర్తిగా కోలుకుని మళ్లీ ఫిట్గా తయారవ్వాలని, ఒకప్పట్లాగే హుషారుగా సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
This post was last modified on May 12, 2025 3:33 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…