నిన్న లండన్ రాయల్ అల్బర్ట్ హాల్ లో జరిగిన ఆర్ఆర్ఆర్ లైవ్ కన్సర్ట్ బ్రహ్మాండంగా జరిగింది. వేలాదిగా తరలి వచ్చిన అభిమానులతో ప్రాంగణం మొత్తం హైదరాబాద్ వాతావరణాన్ని తలపించింది. ఇంత జన సందోహం చూసి నిర్వాహకులు ఆశ్చర్యపోయారు. చాలా నెలలుగా ఒకే స్టేజి మీద కనిపించే సందర్భం, అవసరం దొరకని జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కలుసుకోవడం ఫ్యాన్స్ ఆనందాన్ని రెట్టింపు చేసింది. ముఖ్యంగా ఇద్దరి మధ్య ఎంత దోస్తీ ఉందో మరోసారి బహిర్గతమయ్యింది. చేతిలో చేయి వేసుకుని ఇద్దరు స్టేజి దగ్గరకు రావడంతో మొదలై మాట్లాడిన ప్రతి మాటలోనూ అది స్పష్టంగా కనిపించింది.
మే 20 తారక్ పుట్టినరోజుని పురస్కరించుకుని అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే చెప్పిన చరణ్ అక్కడే కౌగలించుకుని ముద్దు పెట్టేసుకోవడం వీడియో రూపంలో బాగా వైరలయ్యింది. క్యూ అండ్ ఏ సెషన్ లో జూనియర్ మాట్లాడుతూ తనకు దొరికిన ఒక గొప్ప ఫ్రెండ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ లో నటించడం మర్చిపోలేని అనుభూతులను ఇచ్చిందని, ఆస్కార్ సాధించిన నాటు నాటు పాట తమ మార్గదర్శకులైన చిరంజీవి, బాలకృష్ణలు కలిసి డాన్స్ చేయడానికి సృష్టించిన చిన్న గ్లిమ్ప్స్ లా అనిపించిందని చెప్పడంతో ఆడిటోరియం చప్పట్లతో హోరెత్తిపోయింది. మాట్లాడుతున్నంత సేపూ జూనియర్ ఫ్యాన్స్ ఆనందం మాములుగా లేదు.
ఎన్నో సంవత్సరాల తర్వాత తారక్ నుంచి బాలయ్య బాబాయ్ ప్రస్తావన రావడం అన్నింటికన్నా హైలైట్. ఆర్ఆర్ఆర్ స్క్రీనింగ్ ఒకపక్క జరుగుతూనే ఇంకోవైపు కీరవాణి లైవ్ ఆర్కెస్ట్రాని ప్లే చేయించడం మంచి అనుభూతి ఇచ్చింది. లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో లేకపోయినా థియేటర్ కు వచ్చిన వేలాది ప్రేక్షకుల దగ్గర సెల్ ఫోన్లు ఉండటంతో వీడియోలు నిమిషాల వ్యవధిలో వైరలయ్యాయి. మహేష్ బాబు వస్తాడనే ప్రచారం జరిగింది కానీ చివరి నిమిషంలో ఏదో కారణం వల్ల క్యాన్సిల్ అయ్యిందట. కుదిరి ఉంటే ఒకే స్టేజి మీద తారక్, చరణ్, మహేష్ ని చూసే అరుదైన దృశ్యం చూసేవాళ్ళం. జస్ట్ మిస్.
This post was last modified on May 12, 2025 11:21 am
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…