రంగస్థలం చిత్రం మొదలు కాక ముందు సమంత పెళ్లి కాలేదు కానీ చైతన్యతో పెళ్లనేది నిశ్చయమైపోయింది. పెళ్లి తర్వాత సమంత నటించిన ఆ చిత్రం బ్లాక్బస్టర్ అయింది. అయినా కానీ పెళ్లయిన హీరోయిన్కి పెద్ద సినిమాల్లో చోటు దక్కడం కష్టం కనుక సమంతకి ఆ తర్వాత అలాంటి పెద్ద అవకాశాలేమీ రాలేదు. ఇప్పుడు అచ్చంగా ఇలాంటిదే కాజల్ విషయంలో రిపీట్ అయింది.
ఆచార్య మొదలు కాక ముందు కుమారి అయిన కాజల్ ఇప్పుడు శ్రీమతిగా మారింది. శ్రీమతి కాజల్ హోదాలో త్వరలోనే ఆచార్య సెట్లోకి కాజల్ అడుగు పెట్టబోతోంది. ముందుగా ఇందులో హీరోయిన్ త్రిష అనుకున్నారు కానీ ఆమె ఏవో కారణాల చేత తప్పుకుంది. దాంతో ఖైదీ నంబర్ 150లో చిరంజీవికి జోడీగా నటించిన కాజల్నే ఖరారు చేసుకున్నారు. హీరోయిన్గా తన ప్రైమ్ టైమ్ దాటిపోయినా కానీ ఇన్నాళ్లూ కాజల్ ఏదో ఒక అవకాశం దక్కించుకుంటూనే వచ్చింది.
సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకని సిట్యువేషన్ని కూడా బాగానే క్యాష్ చేసుకుంది. అయితే ఆచార్య తర్వాత కాజల్కి ఇక ఇలాంటి పెద్ద సినిమాల్లో ఆఫర్స్ వస్తాయనేది అనుమానమే. బహుశా తనకు ఇక పెద్దగా అవకాశాలు వచ్చేది లేదని తెలుసుకున్న తర్వాతే కాజల్ పెళ్లి చేసుకుందేమో కానీ అనుష్క, సమంత మాదిరిగా తెలుగు సినిమాపై తను కూడా మంచి ఇంపాక్ట్ వేయగలిగింది.
This post was last modified on November 6, 2020 11:03 am
కెరీర్ మొదలుపెట్టి సంవత్సరాలు గడుతున్నా ఒక పెద్ద బ్రేక్ దక్కించుకుని టాప్ లీగ్ లోకి వెళ్లిపోవాలనే ప్లాన్ లో ఉన్న…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కావాల్సిన ప్రతినిధి 2కి కష్టాల పరంపర కొనసాగతూనే ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్. నారా…
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారమే సమయం ఉంది. ఈ ఎన్నికలు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్కు, అటు ప్రతిపక్ష…
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జగన్ ప్రబుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల…
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…