Movie News

చరణ్‍కి సమంత… చిరుకి కాజల్‍!

రంగస్థలం చిత్రం మొదలు కాక ముందు సమంత పెళ్లి కాలేదు కానీ చైతన్యతో పెళ్లనేది నిశ్చయమైపోయింది. పెళ్లి తర్వాత సమంత నటించిన ఆ చిత్రం బ్లాక్‍బస్టర్‍ అయింది. అయినా కానీ పెళ్లయిన హీరోయిన్‍కి పెద్ద సినిమాల్లో చోటు దక్కడం కష్టం కనుక సమంతకి ఆ తర్వాత అలాంటి పెద్ద అవకాశాలేమీ రాలేదు. ఇప్పుడు అచ్చంగా ఇలాంటిదే కాజల్‍ విషయంలో రిపీట్‍ అయింది.

ఆచార్య మొదలు కాక ముందు కుమారి అయిన కాజల్‍ ఇప్పుడు శ్రీమతిగా మారింది. శ్రీమతి కాజల్‍ హోదాలో త్వరలోనే ఆచార్య సెట్లోకి కాజల్‍ అడుగు పెట్టబోతోంది. ముందుగా ఇందులో హీరోయిన్‍ త్రిష అనుకున్నారు కానీ ఆమె ఏవో కారణాల చేత తప్పుకుంది. దాంతో ఖైదీ నంబర్‍ 150లో చిరంజీవికి జోడీగా నటించిన కాజల్‍నే ఖరారు చేసుకున్నారు. హీరోయిన్‍గా తన ప్రైమ్‍ టైమ్‍ దాటిపోయినా కానీ ఇన్నాళ్లూ కాజల్‍ ఏదో ఒక అవకాశం దక్కించుకుంటూనే వచ్చింది.

సీనియర్‍ హీరోలకు హీరోయిన్లు దొరకని సిట్యువేషన్‍ని కూడా బాగానే క్యాష్‍ చేసుకుంది. అయితే ఆచార్య తర్వాత కాజల్‍కి ఇక ఇలాంటి పెద్ద సినిమాల్లో ఆఫర్స్ వస్తాయనేది అనుమానమే. బహుశా తనకు ఇక పెద్దగా అవకాశాలు వచ్చేది లేదని తెలుసుకున్న తర్వాతే కాజల్‍ పెళ్లి చేసుకుందేమో కానీ అనుష్క, సమంత మాదిరిగా తెలుగు సినిమాపై తను కూడా మంచి ఇంపాక్ట్ వేయగలిగింది.

Satya

Recent Posts

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

30 minutes ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

38 minutes ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

3 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

5 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

11 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

14 hours ago