రంగస్థలం చిత్రం మొదలు కాక ముందు సమంత పెళ్లి కాలేదు కానీ చైతన్యతో పెళ్లనేది నిశ్చయమైపోయింది. పెళ్లి తర్వాత సమంత నటించిన ఆ చిత్రం బ్లాక్బస్టర్ అయింది. అయినా కానీ పెళ్లయిన హీరోయిన్కి పెద్ద సినిమాల్లో చోటు దక్కడం కష్టం కనుక సమంతకి ఆ తర్వాత అలాంటి పెద్ద అవకాశాలేమీ రాలేదు. ఇప్పుడు అచ్చంగా ఇలాంటిదే కాజల్ విషయంలో రిపీట్ అయింది.
ఆచార్య మొదలు కాక ముందు కుమారి అయిన కాజల్ ఇప్పుడు శ్రీమతిగా మారింది. శ్రీమతి కాజల్ హోదాలో త్వరలోనే ఆచార్య సెట్లోకి కాజల్ అడుగు పెట్టబోతోంది. ముందుగా ఇందులో హీరోయిన్ త్రిష అనుకున్నారు కానీ ఆమె ఏవో కారణాల చేత తప్పుకుంది. దాంతో ఖైదీ నంబర్ 150లో చిరంజీవికి జోడీగా నటించిన కాజల్నే ఖరారు చేసుకున్నారు. హీరోయిన్గా తన ప్రైమ్ టైమ్ దాటిపోయినా కానీ ఇన్నాళ్లూ కాజల్ ఏదో ఒక అవకాశం దక్కించుకుంటూనే వచ్చింది.
సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకని సిట్యువేషన్ని కూడా బాగానే క్యాష్ చేసుకుంది. అయితే ఆచార్య తర్వాత కాజల్కి ఇక ఇలాంటి పెద్ద సినిమాల్లో ఆఫర్స్ వస్తాయనేది అనుమానమే. బహుశా తనకు ఇక పెద్దగా అవకాశాలు వచ్చేది లేదని తెలుసుకున్న తర్వాతే కాజల్ పెళ్లి చేసుకుందేమో కానీ అనుష్క, సమంత మాదిరిగా తెలుగు సినిమాపై తను కూడా మంచి ఇంపాక్ట్ వేయగలిగింది.
This post was last modified on November 6, 2020 11:03 am
లోకనాయకుడు కమల్ హాసన్ పనైపోయిందనుకున్న సమయంలో ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చిన సినిమా.. విక్రమ్. ఆ సినిమాతోనే సౌత్…
తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…
గుజరాత్లో చాందిపుర వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…
సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం తెలుగు రాష్ట్రాలకు…
మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…