రంగస్థలం చిత్రం మొదలు కాక ముందు సమంత పెళ్లి కాలేదు కానీ చైతన్యతో పెళ్లనేది నిశ్చయమైపోయింది. పెళ్లి తర్వాత సమంత నటించిన ఆ చిత్రం బ్లాక్బస్టర్ అయింది. అయినా కానీ పెళ్లయిన హీరోయిన్కి పెద్ద సినిమాల్లో చోటు దక్కడం కష్టం కనుక సమంతకి ఆ తర్వాత అలాంటి పెద్ద అవకాశాలేమీ రాలేదు. ఇప్పుడు అచ్చంగా ఇలాంటిదే కాజల్ విషయంలో రిపీట్ అయింది.
ఆచార్య మొదలు కాక ముందు కుమారి అయిన కాజల్ ఇప్పుడు శ్రీమతిగా మారింది. శ్రీమతి కాజల్ హోదాలో త్వరలోనే ఆచార్య సెట్లోకి కాజల్ అడుగు పెట్టబోతోంది. ముందుగా ఇందులో హీరోయిన్ త్రిష అనుకున్నారు కానీ ఆమె ఏవో కారణాల చేత తప్పుకుంది. దాంతో ఖైదీ నంబర్ 150లో చిరంజీవికి జోడీగా నటించిన కాజల్నే ఖరారు చేసుకున్నారు. హీరోయిన్గా తన ప్రైమ్ టైమ్ దాటిపోయినా కానీ ఇన్నాళ్లూ కాజల్ ఏదో ఒక అవకాశం దక్కించుకుంటూనే వచ్చింది.
సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకని సిట్యువేషన్ని కూడా బాగానే క్యాష్ చేసుకుంది. అయితే ఆచార్య తర్వాత కాజల్కి ఇక ఇలాంటి పెద్ద సినిమాల్లో ఆఫర్స్ వస్తాయనేది అనుమానమే. బహుశా తనకు ఇక పెద్దగా అవకాశాలు వచ్చేది లేదని తెలుసుకున్న తర్వాతే కాజల్ పెళ్లి చేసుకుందేమో కానీ అనుష్క, సమంత మాదిరిగా తెలుగు సినిమాపై తను కూడా మంచి ఇంపాక్ట్ వేయగలిగింది.
This post was last modified on November 6, 2020 11:03 am
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…