Movie News

యుద్ధం ఆగింది – పరిశ్రమకు ఊపొచ్చింది

నిన్న అమెరికా చొరవ వల్ల కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించడం పట్ల పలు రకాల స్పందనలు వస్తున్నప్పటికీ ఇలాంటి పరిస్థితుల్లో ఇదొక్కటే పరిష్కారమని విశ్లేషకులు భావిస్తున్నారు. తమతో పోరాటం ఎంత ప్రమాదమో భారతదేశం చాలా స్పష్టంగా పాకిస్థాన్ కు దాడుల రూపంలో తెలియజేసిందని, ఇకపై ఎలాంటి రెచ్చగొట్టే పనులు పాక్ చేయలేదని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా యుద్ధ మేఘాలు తీవ్ర స్థాయిలో కమ్ముకుంటే థియేటర్ ప్రదర్శనలు ఆగిపోయి పరిశ్రమ మనుగడే ప్రమాదంలో పడుతుందని భావించిన నిర్మాతలు ఇప్పుడు హమ్మయ్య అనుకుంటున్నారు. టెన్షన్ తగ్గినందుకు సంతోషపడుతున్నారు.

నిజంగానే ఒక వేళ యుద్ధం తీవ్రమయ్యుంటే దాని ప్రభావం నేరుగా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా అందరి మీదా పడేది. ప్యాన్ ఇండియా రిలీజులు ఆపాల్సి వచ్చేది. జనాలు వస్తారో రారోననే భయంతో పెద్ద నిర్మాతలు సినిమాలు విడుదలలు పోస్ట్ పోన్ చేసేవాళ్ళు. కింగ్ డమ్, హరిహర వీరమల్లు, కన్నప్ప లాంటివి రిస్క్ లో పడేవి. కానీ ఇప్పుడా భయం లేదు. ఐపీఎల్ వారం పాటు వాయిదా పడటంతో మెల్లగా ఈ ప్రభావం మనకు సానుకూలంగా మారుతోంది. జనాలు క్రికెట్ లేదు కాబట్టి ఎంటర్ టైన్మెంట్ కోసం థియేటర్లకు వస్తున్నారు. సింగిల్ ఫుల్  స్వింగ్ లో ఉండగా, హిట్ 3 ది థర్డ్ కేస్, రైడ్ లు మళ్ళీ ఊపందుకుని ట్రెండింగ్ లోకి వచ్చేశాయి.

ఏదైతేనేం కరోనా నాటి పీడకలలు మళ్ళీ పరిశ్రమకు రాకుండా యుద్ధం ఆగిపోయింది. పాకిస్థాన్ మనల్ని ఏదో చేసేంత సీన్ లేకపోయినా ఒక్కసారి వార్ మొదలైతే దాని ఎఫెక్ట్ ఏదో ఒక రూపంలో పడుతుంది. అంతెందుకు ఉత్తరాది రాష్ట్రాల్లో పలు చోట్ల సూపర్ మార్కెట్లలో స్టాక్ మొత్తం మొన్నే అయిపోయిందట. కారణం ఏంటయ్యా అంటే జనాలు ముందు జాగ్రత్తలు సరుకులన్నీ ఎక్కువ కాలం నిల్వ ఉంచుకునేలా కొనేసుకుని వెళ్లారట. పుకారుగా వచ్చిన అనుమానమే ఇలాంటి పరిణామాలకు దారి తీస్తే ఇక యుద్ధం వస్తే ఎలా ఉంటుందో వేరే చెప్పాలా. పెహల్గామ్ దుర్ఘటనకు గట్టి గుణపాఠమే చెప్పిన ఇండియా ఇకపై మరింత కఠినం కానుంది.

This post was last modified on May 11, 2025 11:49 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

4 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

6 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

6 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

7 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

8 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

10 hours ago