విశ్వక్ సేన్ కొత్త సినిమా కల్ట్ ఓపెనింగ్ ఈ రోజు జరిగింది. దర్శకుడిగా ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత ఇది మూడో ప్రయత్నం. చాలా మంది కొత్త నటీనటులను దీని ద్వారా పరిచయం చేయబోతున్నాడు. ఆడిషన్లకే ఎక్కువ సమయం పట్టింది. సంగీత దర్శకుడిగా రవి బస్రూర్ ని తీసుకోవడం దగ్గరి నుంచి తరుణ్ భాస్కర్ ని డైలాగులు రాయడానికి ఒప్పించడం వరకు విశ్వక్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ముందు డైరెక్షన్ మాత్రమే చేద్దామనుకున్నాడు. కానీ ఒక ముఖ్యమైన పాత్రకు ఇమేజ్ ఉన్న నటుడు దొరక్కపోవడంతో ఆ బాధ్యతా తనే తీసుకున్నాడు. నలభైకి పైగా కొత్త మొహాలను టాలీవుడ్ ఈ కల్ట్ లో చూడబోతోంది.
చూస్తుంటే తన గత సినిమాల్లో టెక్నికల్ గా జరిగిన లోపాలను విశ్వక్ సేన్ గుర్తించి దానికి అనుగుణంగానే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. లైలా విషయంలో ఎంత దారుణమైన తప్పు జరిగిందంటే ఏకంగా ప్రేక్షకులకు సారీ చెప్పాల్సి వచ్చింది. అంతకు ముందు గామి, గ్యాంగ్స్ అఫ్ గోదావరి, దాస్ కా ధమ్కీ మొదలైనవి వినడానికి బాగున్న కంటెంట్లే. కానీ దర్శకుల ఎగ్జిక్యూషన్ లో జరిగిన తప్పుల వల్ల ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయాయి. అందుకే ఈసారి సాలిడ్ గా సపోర్ట్ తీసుకుని రంగంలోకి దిగుతున్నాడు విశ్వక్. ప్రయోగం చేస్తూనే కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా స్క్రిప్ట్ రాసుకున్నాడట.
విశ్వక్ సేన్ చేసిన మరో మంచి పని మలయాళం, తమిళ, కన్నడ డబ్బింగుల జోలికి వెళ్ళకపోవడం. ఊరికే ఖర్చు తప్ప ఆ భాషల అనువాదాలు వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని గుర్తించి తెలివిగా జాపనీస్, స్పానిష్, ఇంగ్లీష్ కు పరిమితం చేయడం మంచి ఆలోచన. కల్ట్ అనేది యూత్ లో రెగ్యులర్ గా వినిపించే ట్రెండీ పదం. దాన్ని వాడుకోవడం మార్కెటింగ్ ఎత్తుగడగా పనికొస్తుంది. దీనికన్నా ముందు అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ నటించిన ఫంకీ ఇదే ఏడాదిలో విడుదల కానుంది. కల్ట్ బహుశా 2026కి వెళ్ళిపోవచ్చు. బడ్జెట్ కూడా కాస్త ఎక్కువే అవుతుందట. సబ్జెక్టుని నమ్మినప్పుడు పెట్టాలి మరి.
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మరోసారి ఆసుపత్రిలో చేరారు. 40 రోజుల కిందట ఆయన…