Movie News

యుద్ధం వద్దంటున్న తెలుగు హీరోయిన్

కొందరు సెలబ్రిటీలు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో కానీ ఒక్కోసారి చిన్న ట్వీట్లు, స్టేటస్ లే పెద్ద రాద్ధాంతానికి దారి తీస్తాయి. ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్లో భాగం పంచుకుని తెలుగులో మార్కెట్ పెంచుకున్న ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం ఇదే కోవలోకి వస్తోంది. సరిహద్దుల్లో శత్రుదేశం కవ్వింపులతో సైన్యం ఎంత వీరోచితంగా పోరాడుతోందో చూస్తున్నాం. భారతీయులైన ప్రతి ఒక్కరు పాకిస్థాన్ పీచమణచాల్సిందే అనే నినాదంతో ఆర్మీకి పూర్తి మద్దతు ఇస్తున్నారు. పెహల్గామ్ దుర్ఘటనకు ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం చూశాక ఎవరైనా సరే పాక్ మీద తెగబడటం కరెక్టనే అంటారు.

కానీ ఐశ్వర్య రాజేష్ వెర్షన్ వేరుగా ఉంది. ఇన్స్ టాలో ఒక సుదీర్ఘమైన మెసేజ్ పంచుకుంది. ముందు ఏమందో చూద్దాం. “యుద్ధం వద్దు. ఒక ప్రజాస్వామ్య పౌరురాలిగా ఇండియా, పాకిస్థాన్ ప్రభుత్వాలను ఒకటే కోరుతున్నాను. సంఘర్షణల కన్నా శాంతిని కోరుకుని ఆ దిశగా అడుగులు వేద్దాం. జాతీయతతో సంబంధం లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవడం కోసం కలిసి నడుద్దాం. ప్రతిభ కలిగిన వ్యక్తులు, సైనికులు, ప్రజలు ప్రాణాలు కోల్పోకూడదు. యుద్ధాన్ని నివారించడానికి ఎలాంటి చర్యలు అవసరమో ఆ దిశగా అడుగులు వేద్దాం. అందరికి ఈ సందేశం చేరవేద్దాం”. ఇదండీ సదరు హీరోయిన్ పెట్టిన జ్ఞానగుళిక.

ఇది చదివిన నెటిజెన్లు భగ్గుమంటున్నారు. ఇండియా కావాలనే కయ్యానికి కాలు దువ్వుతుందనే రీతిలో ఆమె మాటల్లో అర్థం ధ్వనిస్తోందని, నీతులు పాకిస్థాన్ కు చెప్పకుండా రెండు దేశాలు చర్చించుకోవాలని చెప్పడం చూస్తే బోర్డర్ లో జరిగిన దారుణాలు, పాక్ ఆపకుండా చేస్తున్న కుట్రలు ఐశ్యర్య రాజేష్ కు బహుశా తెలిసినట్టు లేవని విరుచుకుపడుతున్నారు. తప్పు పాక్ చేస్తే మనకు కలిపి హితబోధ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా భారతదేశ సహనాన్ని దశాబ్దాలుగా పరీక్షిస్తున్న పాకిస్థాన్ కు ఇంతకన్నా ఎలా బుద్ది చెప్పాలో ఆమె వివరిస్తే బాగుంటుందని అభిమానులే చురకలు వేస్తున్నారు.

This post was last modified on May 9, 2025 10:13 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

38 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago