Movie News

యుద్ధం వద్దంటున్న తెలుగు హీరోయిన్

కొందరు సెలబ్రిటీలు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో కానీ ఒక్కోసారి చిన్న ట్వీట్లు, స్టేటస్ లే పెద్ద రాద్ధాంతానికి దారి తీస్తాయి. ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్లో భాగం పంచుకుని తెలుగులో మార్కెట్ పెంచుకున్న ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం ఇదే కోవలోకి వస్తోంది. సరిహద్దుల్లో శత్రుదేశం కవ్వింపులతో సైన్యం ఎంత వీరోచితంగా పోరాడుతోందో చూస్తున్నాం. భారతీయులైన ప్రతి ఒక్కరు పాకిస్థాన్ పీచమణచాల్సిందే అనే నినాదంతో ఆర్మీకి పూర్తి మద్దతు ఇస్తున్నారు. పెహల్గామ్ దుర్ఘటనకు ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం చూశాక ఎవరైనా సరే పాక్ మీద తెగబడటం కరెక్టనే అంటారు.

కానీ ఐశ్వర్య రాజేష్ వెర్షన్ వేరుగా ఉంది. ఇన్స్ టాలో ఒక సుదీర్ఘమైన మెసేజ్ పంచుకుంది. ముందు ఏమందో చూద్దాం. “యుద్ధం వద్దు. ఒక ప్రజాస్వామ్య పౌరురాలిగా ఇండియా, పాకిస్థాన్ ప్రభుత్వాలను ఒకటే కోరుతున్నాను. సంఘర్షణల కన్నా శాంతిని కోరుకుని ఆ దిశగా అడుగులు వేద్దాం. జాతీయతతో సంబంధం లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవడం కోసం కలిసి నడుద్దాం. ప్రతిభ కలిగిన వ్యక్తులు, సైనికులు, ప్రజలు ప్రాణాలు కోల్పోకూడదు. యుద్ధాన్ని నివారించడానికి ఎలాంటి చర్యలు అవసరమో ఆ దిశగా అడుగులు వేద్దాం. అందరికి ఈ సందేశం చేరవేద్దాం”. ఇదండీ సదరు హీరోయిన్ పెట్టిన జ్ఞానగుళిక.

ఇది చదివిన నెటిజెన్లు భగ్గుమంటున్నారు. ఇండియా కావాలనే కయ్యానికి కాలు దువ్వుతుందనే రీతిలో ఆమె మాటల్లో అర్థం ధ్వనిస్తోందని, నీతులు పాకిస్థాన్ కు చెప్పకుండా రెండు దేశాలు చర్చించుకోవాలని చెప్పడం చూస్తే బోర్డర్ లో జరిగిన దారుణాలు, పాక్ ఆపకుండా చేస్తున్న కుట్రలు ఐశ్యర్య రాజేష్ కు బహుశా తెలిసినట్టు లేవని విరుచుకుపడుతున్నారు. తప్పు పాక్ చేస్తే మనకు కలిపి హితబోధ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా భారతదేశ సహనాన్ని దశాబ్దాలుగా పరీక్షిస్తున్న పాకిస్థాన్ కు ఇంతకన్నా ఎలా బుద్ది చెప్పాలో ఆమె వివరిస్తే బాగుంటుందని అభిమానులే చురకలు వేస్తున్నారు.

This post was last modified on May 9, 2025 10:13 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

5 minutes ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

34 minutes ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

2 hours ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

5 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

10 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

13 hours ago