Movie News

యుద్ధం వద్దంటున్న తెలుగు హీరోయిన్

కొందరు సెలబ్రిటీలు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో కానీ ఒక్కోసారి చిన్న ట్వీట్లు, స్టేటస్ లే పెద్ద రాద్ధాంతానికి దారి తీస్తాయి. ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్లో భాగం పంచుకుని తెలుగులో మార్కెట్ పెంచుకున్న ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం ఇదే కోవలోకి వస్తోంది. సరిహద్దుల్లో శత్రుదేశం కవ్వింపులతో సైన్యం ఎంత వీరోచితంగా పోరాడుతోందో చూస్తున్నాం. భారతీయులైన ప్రతి ఒక్కరు పాకిస్థాన్ పీచమణచాల్సిందే అనే నినాదంతో ఆర్మీకి పూర్తి మద్దతు ఇస్తున్నారు. పెహల్గామ్ దుర్ఘటనకు ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం చూశాక ఎవరైనా సరే పాక్ మీద తెగబడటం కరెక్టనే అంటారు.

కానీ ఐశ్వర్య రాజేష్ వెర్షన్ వేరుగా ఉంది. ఇన్స్ టాలో ఒక సుదీర్ఘమైన మెసేజ్ పంచుకుంది. ముందు ఏమందో చూద్దాం. “యుద్ధం వద్దు. ఒక ప్రజాస్వామ్య పౌరురాలిగా ఇండియా, పాకిస్థాన్ ప్రభుత్వాలను ఒకటే కోరుతున్నాను. సంఘర్షణల కన్నా శాంతిని కోరుకుని ఆ దిశగా అడుగులు వేద్దాం. జాతీయతతో సంబంధం లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవడం కోసం కలిసి నడుద్దాం. ప్రతిభ కలిగిన వ్యక్తులు, సైనికులు, ప్రజలు ప్రాణాలు కోల్పోకూడదు. యుద్ధాన్ని నివారించడానికి ఎలాంటి చర్యలు అవసరమో ఆ దిశగా అడుగులు వేద్దాం. అందరికి ఈ సందేశం చేరవేద్దాం”. ఇదండీ సదరు హీరోయిన్ పెట్టిన జ్ఞానగుళిక.

ఇది చదివిన నెటిజెన్లు భగ్గుమంటున్నారు. ఇండియా కావాలనే కయ్యానికి కాలు దువ్వుతుందనే రీతిలో ఆమె మాటల్లో అర్థం ధ్వనిస్తోందని, నీతులు పాకిస్థాన్ కు చెప్పకుండా రెండు దేశాలు చర్చించుకోవాలని చెప్పడం చూస్తే బోర్డర్ లో జరిగిన దారుణాలు, పాక్ ఆపకుండా చేస్తున్న కుట్రలు ఐశ్యర్య రాజేష్ కు బహుశా తెలిసినట్టు లేవని విరుచుకుపడుతున్నారు. తప్పు పాక్ చేస్తే మనకు కలిపి హితబోధ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా భారతదేశ సహనాన్ని దశాబ్దాలుగా పరీక్షిస్తున్న పాకిస్థాన్ కు ఇంతకన్నా ఎలా బుద్ది చెప్పాలో ఆమె వివరిస్తే బాగుంటుందని అభిమానులే చురకలు వేస్తున్నారు.

This post was last modified on May 9, 2025 10:13 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

20 minutes ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

43 minutes ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

53 minutes ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

1 hour ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

2 hours ago

మాజీ సీబీఐ డైరెక్టర్ సతీమణి సైబర్ వలలో పడడమా…

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…

2 hours ago