చెప్పుకోదగ్గ క్యాస్టింగ్ ఉంది. విడుదల తేదీ ప్రకటిస్తే బిజినెస్ జరిగిపోతుంది. కానీ భైరవం టీమ్ మీనమేషాలు లెక్కబెడుతున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ – మంచు మనోజ్ – నారా రోహిత్ కలయికలో రూపొందిన ఈ విలేజ్ డ్రామాని మరీ ఆర్ఆర్ఆర్ రేంజ్ లో మల్టీస్టారర్ అనలేం కానీ మినీ స్టారరని చెప్పొచ్చు. ఆల్రెడీ ఒక పాట చార్ట్ బస్టర్ అయ్యింది. పోస్టర్లు, టీజర్ జనంలో ఆసక్తిని పెంచాయి. తమిళ సూపర్ హిట్ గరుడన్ రీమేక్ గా రూపొందిన భైరవంకు నాంది ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. శంకర్ కూతురు అదితి శంకర్ టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమవుతోంది.
అన్నీ బాగానే ఉన్నా ఎలాంటి చప్పుడు చేయకుండా భైరవం ఇంత మౌనంగా ఎందుకు ఉందనే సందేహం రావడం సహజం. మంచు విష్ణుతో ఉన్న విభేదాల దృష్ట్యా కన్నప్పకు పోటీగా ఈ సినిమాని రిలీజ్ చేయాలని మనోజ్ పట్టుబడుతున్నట్టుగా ఒక వెర్షన్ ఉంది. అదే నిజమైతే జూన్ 27 అని ప్రకటించేయాలి. కానీ అలా జరగలేదు. వాస్తవమేంటో టీమ్ కే తెలుసు. ఇంకో వైపు ఓటిటి డీల్ ఎంతకీ తెగకపోవడం వల్లే నిర్మాత డేట్ వేయలేకపోతున్నారని ఇన్ సైడ్ టాక్. ఆశించిన దానికన్నా తక్కువ మొత్తం ఆఫర్ చేయడం వల్ల వేచి చూసే ధోరణిలో ఉన్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే డిలే వల్ల బజ్ తగ్గడం మొదలయ్యింది.
చూస్తుంటే మేలో రావడం దాదాపు అసాధ్యమే. వచ్చే వారం స్లాట్ ఖాళీగా ఉన్నా భైరవం యూనిట్ నుంచి ఎలాంటి సౌండ్ లేదు. నెలాఖరులో 30న విజయ్ దేవరకొండ కింగ్ డమ్ ఉంది. ప్రస్తుతానికి వీళ్ళు అదే తేదీకి కట్టుబడ్డారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు వస్తే వాయిదా పడొచ్చు. అది కూడా ఇంకా తేలలేదు. జూన్ 20 కుబేర, సితారే జమీన్ పర్ ఉన్నాయి. ఆపై వారం 27 కన్నప్ప దిగుతాడు. అటుపై జూలైలో ఇంకా కష్టం. ఇంత స్పష్టంగా సమీకరణాలు కనిపిస్తుంటే భైరవం ఇంకా విడుదల తేదీ దోబూచులాడటం గమనార్షం. ఎక్కువ ఆలస్యం చేసినా ఉన్న బజ్ తగ్గిపోయే ప్రమాదముంది.
This post was last modified on May 9, 2025 5:16 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…