తెరమీద చూసే సినిమాల్లోనే కాదు కొన్నిసార్లు వాటి షూటింగుల్లో కూడా ఊహించని ట్విస్టులు ఎదురవుతూ ఉంటాయి. కెజిఎఫ్ తర్వాత మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా శాండల్ వుడ్ తో పాటు తెలుగు తమిళ పరిశ్రమలు ఎదురు చూస్తున్న కాంతార చాప్టర్ 1కు కష్టాల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా జరిగిన దుర్ఘటనలో కపిల్ అనే జూనియర్ ఆర్టిస్టు నీటమునిగి చనిపోవడం యూనిట్ లో విషాదం రేపింది. ప్రస్తుతం కేరళ సౌపర్ణిక నది వద్ద చిత్రీకరణ చేస్తున్న హీరో కం దర్శకుడు రిషబ్ శెట్టికి ఈ పరిణామాలు కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇది ఇప్పుడు మొదలయ్యింది కాదు. నెలలుగా జరుగుతున్నదే.
బెంగళూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో షూట్ చేస్తున్నప్పుడు ఏకంగా కర్ణాటక అటవీ శాఖా మంత్రి అభ్యంతరం వ్యక్తం చేసి పర్యావరాణాన్ని హాని చేస్తున్నారంటూ కేసు నమోదు చేయించడం గత ఏడాది సంచలనం రేపింది. దాని గురించి ఇంకా కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి. దీని తర్వాత ఒకసారి టీమ్ ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురై కొందరు జూనియర్ ఆర్టిస్టులు గాయపడటంతో బ్రేక్ వేయాల్సి వచ్చింది. విపరీతమైన గాలి తుఫాను వల్ల సెట్స్ కూలిపోయి తీవ్ర నష్టం కలగడం మరో సంఘటన. ఇలా ఒకటి రెండు కాదు ఎన్నో అవాంతరాలు కాంతారకు వస్తూనే ఉన్నాయి.
అక్టోబర్ 1 విడుదల చేయాలని అధికారిక ప్రకటన ఇచ్చిన రిషబ్ శెట్టి ఇప్పుడా లక్ష్యాన్ని చేరుకోవడం కష్టంగానే ఉంది. ఇది దైవం పెడుతున్న పరీక్షగా భావించి కఠినమైన సవాళ్లు ఎదురుకుంటున్నాడు. హోంబాలే ఫిలిమ్స్ దీని మీద భారీ బడ్జెట్ పెడుతోంది. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటిదాకా చూడనంత గొప్పగా ఈ డివోషనల్ థ్రిల్లర్ ఉంటుందని అందులో పని చేస్తున్న వాళ్ళు చెబుతున్న మాట. ఈ స్పీడ్ బ్రేకులను తట్టుకుని కాంతార చాప్టర్ 1 అనుకున్న సమయానికి వస్తుందా లేదానేది ప్రస్తుతానికి సస్పెన్సే. కాంతారకు ముందు ఏం జరిగిందనే పాయింట్ మీద రిషబ్ శెట్టి దీన్ని రూపొందిస్తుండటం విశేషం.
This post was last modified on May 8, 2025 12:09 pm
సెప్టెంబర్ 24 విడుదల కాబోతున్న ప్యారడైజ్ కోసం అభిమానుల ఎదురు చూపుల గురించి ఎంత చెప్పినా తక్కువే. నాని కెరీర్…
ఒకపక్క టాక్సిక్ పుణ్యమాని తెలుగు, కన్నడ మూవీ లవర్స్ సోషల్ మీడియా వేదికగా ఒకరిమీద మరొకరు కామెంట్లు, ట్రోల్స్ చేసుకోవడం…
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని, రెండు మూడు చిన్న సినిమాల అనుభవం ఉన్న హీరోను పెట్టి.. ఒక డెబ్యూ డైరెక్టర్ రూ.3-4…
అక్టోబర్ 2 నుంచి ఆదర్శ కుటుంబం ఏకె ఫార్టీ సెవెన్ తప్పుకున్నాక మళ్ళీ కొత్త డేట్ ప్రకటించలేదు. ఒకవేళ జైలర్…
ఏంటో జెన్ జీ ఆడియన్స్ మహా విచిత్రంగా ఉన్నారు. కొన్ని కొత్త సినిమాలను అస్సలు పట్టించుకోరు. కొన్ని రీ రిలీజులకేమో…
సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…