తెరమీద చూసే సినిమాల్లోనే కాదు కొన్నిసార్లు వాటి షూటింగుల్లో కూడా ఊహించని ట్విస్టులు ఎదురవుతూ ఉంటాయి. కెజిఎఫ్ తర్వాత మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా శాండల్ వుడ్ తో పాటు తెలుగు తమిళ పరిశ్రమలు ఎదురు చూస్తున్న కాంతార చాప్టర్ 1కు కష్టాల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా జరిగిన దుర్ఘటనలో కపిల్ అనే జూనియర్ ఆర్టిస్టు నీటమునిగి చనిపోవడం యూనిట్ లో విషాదం రేపింది. ప్రస్తుతం కేరళ సౌపర్ణిక నది వద్ద చిత్రీకరణ చేస్తున్న హీరో కం దర్శకుడు రిషబ్ శెట్టికి ఈ పరిణామాలు కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇది ఇప్పుడు మొదలయ్యింది కాదు. నెలలుగా జరుగుతున్నదే.
బెంగళూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో షూట్ చేస్తున్నప్పుడు ఏకంగా కర్ణాటక అటవీ శాఖా మంత్రి అభ్యంతరం వ్యక్తం చేసి పర్యావరాణాన్ని హాని చేస్తున్నారంటూ కేసు నమోదు చేయించడం గత ఏడాది సంచలనం రేపింది. దాని గురించి ఇంకా కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి. దీని తర్వాత ఒకసారి టీమ్ ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురై కొందరు జూనియర్ ఆర్టిస్టులు గాయపడటంతో బ్రేక్ వేయాల్సి వచ్చింది. విపరీతమైన గాలి తుఫాను వల్ల సెట్స్ కూలిపోయి తీవ్ర నష్టం కలగడం మరో సంఘటన. ఇలా ఒకటి రెండు కాదు ఎన్నో అవాంతరాలు కాంతారకు వస్తూనే ఉన్నాయి.
అక్టోబర్ 1 విడుదల చేయాలని అధికారిక ప్రకటన ఇచ్చిన రిషబ్ శెట్టి ఇప్పుడా లక్ష్యాన్ని చేరుకోవడం కష్టంగానే ఉంది. ఇది దైవం పెడుతున్న పరీక్షగా భావించి కఠినమైన సవాళ్లు ఎదురుకుంటున్నాడు. హోంబాలే ఫిలిమ్స్ దీని మీద భారీ బడ్జెట్ పెడుతోంది. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటిదాకా చూడనంత గొప్పగా ఈ డివోషనల్ థ్రిల్లర్ ఉంటుందని అందులో పని చేస్తున్న వాళ్ళు చెబుతున్న మాట. ఈ స్పీడ్ బ్రేకులను తట్టుకుని కాంతార చాప్టర్ 1 అనుకున్న సమయానికి వస్తుందా లేదానేది ప్రస్తుతానికి సస్పెన్సే. కాంతారకు ముందు ఏం జరిగిందనే పాయింట్ మీద రిషబ్ శెట్టి దీన్ని రూపొందిస్తుండటం విశేషం.
This post was last modified on May 8, 2025 12:09 pm
పశ్చిమ బెంగాల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గత మూడు సార్లుగా ఇక్కడ అధికారంలో ఉన్న దీదీ..…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…
కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…
'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…