అసలే ఒకపక్క థియేటర్, ఓటిటి మధ్య గ్యాప్ తగ్గిపోతోంది ఏదో ఒకటి చేయమని అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు చెబుతుంటే ఇంకోపక్క ఆందోళన కలిగించే పరిణామాలు బాలీవుడ్ లో చోటు చేసుకుంటున్నాయి. రేపు రాజ్ కుమార్ రావు హీరోగా నటించిన భూల్ ఛుక్ మాఫ్ విడుదల కావాలి. అడ్వాన్స్ బుకింగ్స్ కొద్దిరోజుల క్రితమే మొదలైపోయింది. బుక్ మై షోలో రోజుకు ఆరేడు వేల టికెట్లు అమ్ముడుపోతూ ట్రెండ్ సూచిస్తున్నాయి. స్త్రీ 2, చావా లాంటి బ్లాక్ బస్టర్లు తీసిన మాడాక్ ఫిలింస్ నిర్మాణం కావడంతో బయ్యర్ వర్గాల నుంచి మంచి మద్దతు దక్కింది. ఇక్కడిదాకా అంతా సవ్యంగానే నడిచింది
ఇంకో ఇరవై నాలుగు గంటల్లో షోలు ప్రారంభం కావాల్సి ఉండగా టీమ్ షాక్ ఇచ్చింది. భూల్ ఛుక్ మాఫ్ థియేటర్ విడుదల రద్దు చేసి వచ్చే వారం మే 16న నేరుగా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తామని నిర్మాణ సంస్థ ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా డిస్ట్రిబ్యూషన్ వర్గాల ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎందుకంటే థియేటర్ కేటాయింపులు, అగ్రిమెంట్లు, ముందస్తు టికెట్ల అమ్మకాలు, షోల షెడ్యూలింగ్ అంతా అయిపోయాక ఇలా హఠాత్తుగా బాంబు వేస్తే ఎలా తట్టుకుంటారు. అందులోనూ డల్లుగా ఉన్న బాక్సాఫీస్ కు రాజ్ కుమార్ రావు ఊపు తెస్తాడనే నమ్మకంతో వాళ్లంతా ఎదురు చూస్తున్న టైంలో ట్విస్ట్ ఇచ్చారు.
దేశంలో నెలకొన్న సున్నిత పరిస్థితులను కారణంగా చెప్పారు కానీ ఇప్పుడు అసలు కంటెంట్ మీద డౌట్ వస్తోంది. పాకిస్థాన్ మీద దాడుల నేపథ్యంలో కొంత ఆందోళన ఉన్న మాట వాస్తవమే కానీ మరీ దేశంలో ఏదో అలజడి రేగే స్థాయిలో అయితే కాదు. అందులోనూ ప్రభుత్వాలు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుని సిద్ధంగా ఉన్నాయి. జనం ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. థియేటర్లు నిక్షేపంగా నడుస్తున్నాయి. ఇప్పుడీ నిర్ణయం పట్ల ఎగ్జిబిటర్లు భగ్గుమంటున్నారు. భవిష్యత్తులో మాడాక్ సంస్థ నుంచి వచ్చే సినిమాలను బ్యాన్ చేసే దిశగా ఆలోచన చేస్తున్నారని ముంబై టాక్. టికెట్ల సొమ్ము రీఫండ్ చేసే ప్రక్రియ మొదలైపోయింది.
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…
భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…