టాలీవుడ్లో ఒకప్పుడు టాప్-4 హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగిన హీరో.. అక్కినేని నాగార్జున. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్లతో పోటాపోటీగా సాగుతూ.. ఆయన భారీ విజయాలందుకున్నారు. ఐతే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి తర్వాతి తరం స్టార్ల హవా మొదలయ్యాక మిగతా సీనియర్ హీరోల్లాగే నాగ్ జోరు కూడా తగ్గింది. అయినా అడపాదడపా కొన్ని హిట్లు కొడుతూ ఒక దశ వరకు నాగ్ కెరీర్ బాగానే నడిచింది. కానీ ‘సోగ్గాడే చిన్నినాయనా’ తర్వాత మాత్రం నాగ్ పరిస్థితి ఇబ్బందికరంగా తయారైంది. పెద్ద హిట్ లేక చాలా ఏళ్లుగా సతమతం అవుతున్నాడు నాగ్. టాలీవుడ్ చరిత్రలోనే మోస్ట్ హ్యాండ్సమ్, స్టైలిష్ హీరోల్లో ఒకరైన నాగ్ను ఈ తరం దర్శకులు తెరపై సరిగా ప్రెజెంట్ చేయలేకపోతున్నారని.. ఆయనకు సరిపోయే కథలు రాసి సరిగ్గా సినిమాలు తీయలేకపోతున్నారనే అసంతృప్తి అభిమానుల్లో ఉంది.
ఓవైపు బాలయ్య, వెంకటేష్ సైతం మళ్లీ కెరీర్లో పీక్స్ను అందుకోగా.. నాగ్ మాత్రం వెనుకబడిపోతుండడం అభిమానులకు అస్సలు రుచించడం లేదు. ఇలాంటి టైంలో నాగ్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న తమిళ చిత్రం ‘కూలీ’ నుంచి నిన్న ఒక గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో హీరో రజినీకాంత్ అయినా.. గ్లింప్స్లో ఆయన్ని మించి హైలైట్ అయింది నాగ్ అని చెప్పాలి. ‘కూలీ’కి వంద రోజుల కౌంట్డౌన్ను పురస్కరించుకుని ఈ షార్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అందులో కనీసం నాగ్ ముఖం కూడా చూపించలేదు. కానీ వెనుక నుంచి జుట్టును సవరించుకుంటున్న చిన్న షాట్తో అక్కినేని అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చేశాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్.
ముఖం చూపించకపోయినా అది నాగ్ అని కనిపెట్టేశారు ఫ్యాన్స్. కనీసం ఫేస్ రివీల్ చేయకుండా ఇంత స్టైలిష్గా ఒక హీరోను ప్రెజెంట్ చేయడం, అది కూడా ఈ పని ఒక తమిళ దర్శకుడు చేయడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ఆల్రెడీ ఈ సినిమా నుంచి నాగ్ నటించిన ఒక సన్నివేశం లీక్ అయింది. అందులో నాగ్ చాలా స్టైలిష్గా కనిపించాడు. అప్పట్నుంచి ‘కూలీ’లో నాగ్ పాత్ర ఎలా ఉంటుందా అని క్యూరియస్గా చూస్తున్నారు ఫ్యాన్స్. లేటెస్ట్ గ్లింప్స్ చూశాక థియేటర్లలో అక్కినేని అభిమానుల సంబరాలు మామూలుగా ఉండవనిపిస్తోంది. నాగ్ను కెరీర్లో ఈ దశలో ఎలా చూపించాలో ఒక బెంచ్ మార్క్ సెట్ చేసేలా కనిపిస్తున్నాడు లోకేష్. కూలీ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on May 7, 2025 4:42 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…