టాలీవుడ్లో ఒకప్పుడు టాప్-4 హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగిన హీరో.. అక్కినేని నాగార్జున. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్లతో పోటాపోటీగా సాగుతూ.. ఆయన భారీ విజయాలందుకున్నారు. ఐతే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి తర్వాతి తరం స్టార్ల హవా మొదలయ్యాక మిగతా సీనియర్ హీరోల్లాగే నాగ్ జోరు కూడా తగ్గింది. అయినా అడపాదడపా కొన్ని హిట్లు కొడుతూ ఒక దశ వరకు నాగ్ కెరీర్ బాగానే నడిచింది. కానీ ‘సోగ్గాడే చిన్నినాయనా’ తర్వాత మాత్రం నాగ్ పరిస్థితి ఇబ్బందికరంగా తయారైంది. పెద్ద హిట్ లేక చాలా ఏళ్లుగా సతమతం అవుతున్నాడు నాగ్. టాలీవుడ్ చరిత్రలోనే మోస్ట్ హ్యాండ్సమ్, స్టైలిష్ హీరోల్లో ఒకరైన నాగ్ను ఈ తరం దర్శకులు తెరపై సరిగా ప్రెజెంట్ చేయలేకపోతున్నారని.. ఆయనకు సరిపోయే కథలు రాసి సరిగ్గా సినిమాలు తీయలేకపోతున్నారనే అసంతృప్తి అభిమానుల్లో ఉంది.
ఓవైపు బాలయ్య, వెంకటేష్ సైతం మళ్లీ కెరీర్లో పీక్స్ను అందుకోగా.. నాగ్ మాత్రం వెనుకబడిపోతుండడం అభిమానులకు అస్సలు రుచించడం లేదు. ఇలాంటి టైంలో నాగ్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న తమిళ చిత్రం ‘కూలీ’ నుంచి నిన్న ఒక గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో హీరో రజినీకాంత్ అయినా.. గ్లింప్స్లో ఆయన్ని మించి హైలైట్ అయింది నాగ్ అని చెప్పాలి. ‘కూలీ’కి వంద రోజుల కౌంట్డౌన్ను పురస్కరించుకుని ఈ షార్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అందులో కనీసం నాగ్ ముఖం కూడా చూపించలేదు. కానీ వెనుక నుంచి జుట్టును సవరించుకుంటున్న చిన్న షాట్తో అక్కినేని అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చేశాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్.
ముఖం చూపించకపోయినా అది నాగ్ అని కనిపెట్టేశారు ఫ్యాన్స్. కనీసం ఫేస్ రివీల్ చేయకుండా ఇంత స్టైలిష్గా ఒక హీరోను ప్రెజెంట్ చేయడం, అది కూడా ఈ పని ఒక తమిళ దర్శకుడు చేయడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ఆల్రెడీ ఈ సినిమా నుంచి నాగ్ నటించిన ఒక సన్నివేశం లీక్ అయింది. అందులో నాగ్ చాలా స్టైలిష్గా కనిపించాడు. అప్పట్నుంచి ‘కూలీ’లో నాగ్ పాత్ర ఎలా ఉంటుందా అని క్యూరియస్గా చూస్తున్నారు ఫ్యాన్స్. లేటెస్ట్ గ్లింప్స్ చూశాక థియేటర్లలో అక్కినేని అభిమానుల సంబరాలు మామూలుగా ఉండవనిపిస్తోంది. నాగ్ను కెరీర్లో ఈ దశలో ఎలా చూపించాలో ఒక బెంచ్ మార్క్ సెట్ చేసేలా కనిపిస్తున్నాడు లోకేష్. కూలీ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on May 7, 2025 4:42 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…