కొన్ని సినీ సిత్రాలు విచిత్రంగా ఉంటాయి. అవి సదరు హీరోలు దర్శకులు చెప్పినప్పుడే బయటికి వస్తాయి. అలాంటిదే ఇది. ఎల్లుండి విడుదల కాబోతున్న సింగిల్ ప్రమోషన్లలో భాగంగా శ్రీవిష్ణు మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన విషయం బయట పడింది. 2021లో రిలీజైన అర్జున ఫాల్గుణ ఎంత పెద్ద డిజాస్టరో తెలిసిందే. ఫన్ ప్లస్ క్రైమ్ థ్రిల్లర్ గా దీని మీద రిలీజ్ కు ముందు మంచి అంచనాలు ఉండేవి. కానీ వాటిని అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర తుస్సుమంది. అయితే దీనికి ముందు అనుకున్న ఇంట్రో, క్లైమాక్స్ ఎపిసోడ్స్ వేరు. వాటిని మార్చుకున్నారు. తీరా చూస్తే అవే పెద్ద మైనస్ అయ్యాయి.
కట్ చేస్తే తొమ్మిది నెలల తర్వాత ఒక బ్లాక్ బస్టర్ వచ్చింది. ఊహించని విధంగా అర్జున ఫాల్గుణ కోసం ఏదైతే క్లైమాక్స్ అనుకున్నారో దాంట్లో అచ్చంగా అదే ఉంది. ఆ సినిమా సక్సెస్ లో అది చాలా కీలక పాత్ర పోషించింది. దీంతో శ్రీవిష్ణు టీమ్ షాక్ అయ్యింది. అంత క్వాలిటీగా, రిచ్ గా తాము తీయకపోయినా ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ తో తాము తీసింది చాలా బాగా వచ్చిందని, కానీ తర్వాత మార్చుకోవడం దెబ్బ కొట్టిందని వివరించాడు. ఒకవేళ ఒరిజినల్ గా అనుకున్న దానికే కట్టుబడి ఉంటే ఫలితం మారేదేమో అని చెప్పుకొచ్చాడు. పేరు చెప్పలేదు కానీ శ్రీవిష్ణు చెప్పిన క్లూస్ ని బట్టి చూస్తే అది కాంతార అయ్యుండొచ్చు.
రెండు కథలు ఒకటే కాకపోయినా హీరో సరైన బాధ్యత లేకుండా బలాదూర్ గా తిరగడమనే పాయింట్ కొంచెం దగ్గరగా ఉంది. బహుశా అర్జున్ ఫాల్గుణకు తొలుత అనుకున్న ట్రీట్ మెంట్ కి ఫాంటసీ టచ్ ఉందేమో. అయినా క్లైమాక్స్ సంగతి పక్కనపెడితే ఈ సినిమాలో మిగిలిన అంశాలు కూడా ఏమంత ప్లస్ కాలేకపోయాయి. అలాంటప్పుడు ఆ చివరి ఘట్టం అలాగే ఉంచినంత మాత్రాన రిజల్ట్ మారేది కాదేమో. దీన్ని పక్కనపెడితే సింగిల్ మీద శ్రీవిష్ణు మాములు కాన్ఫిడెంట్ గా లేడు. తనదైన కామెడీ టైమింగ్ తో ఇప్పటికే యూత్ లో అంచనాలు తెచ్చేసుకున్నాడు. టాక్ కూడా పాజిటివ్ గా వస్తే మరో హిట్టు ఖాతాలో పడ్డట్టే.
మా ఇంటి బంగారం సినిమా విజయంతో సంబరాల్లో ఉన్న సమంత అభిమానులకు మరో శుభవార్త అందింది. సినిమా సక్సెస్ మీట్…
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్లో ఊహించని పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. శుక్రవారం ఐర్లాండ్తో జరిగే టీ20 మ్యాచ్తో…
విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…
రీసెంట్ గా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో జరిగిన ఒక చిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే…
మహారాష్ట్రలోని పుణే సమీపంలో జరిగిన యువ వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి కేసులో కళ్లు చెదిరే నిజాలు బయటపడ్డాయి. జూన్ 18వ…
అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డ్.. అత్యంత కీలకం. దీనిని సాధించడమే మహా యజ్ఞం చేసినంత పనిగా…