మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కబోయే సినిమా షూటింగ్ ఈ నెల మూడో వారంలో ప్రారంభం కానుంది. పూజా కార్యక్రమాలు, ఓపెనింగ్ అయిపోయింది కాబట్టి నేరుగా సెట్స్ లోకి వెళ్ళిపోతారు. ఫైనల్ వెర్షన్ లాక్ చేసేసిన రావిపూడి క్యాస్టింగ్ ని దాదాపు కొలిక్కి తెచ్చేశాడు. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు మెయిన్ హీరోయిన్ నయనతారనే. అధికారికంగా ఇప్పుడప్పుడే ప్రకటన చేయకపోవచ్చు. భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినప్పటికీ పాత్ర ప్రాధాన్యం దృష్ట్యా నిర్మాణ సంస్థ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ఇక రెండో కథానాయికగా క్యాథరిన్ త్రెస్సా ఓకే అయ్యింది.
అయితే ఇక్కడో చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోవాలి. చిరంజీవి సరసన నటించే అవకాశం క్యాథరిన్ కు 2017లోనే వచ్చింది. మెగా కంబ్యాక్ ఖైదీ నెంబర్ 150 కోసం వివి వినాయక్ తొలుత ఆమెనే అనుకున్నారు. కానీ సుష్మితతో వచ్చిన విబేధాల కారణంగా క్యాథరిన్ ని తప్పించి కాజల్ అగర్వాల్ ని తీసుకున్నారనే ప్రచారం మీడియాలో జరిగింది. అయితే దీన్ని సమర్ధిస్తూ లేదా ఖండిస్తూ ఎవరూ ఎలాంటి స్టేట్ మెంట్ ఇవ్వలేదు. సో నిజమే అనుకున్నారందరూ. కట్ చేస్తే తొమ్మిది సంవత్సరాల తర్వాత క్యాథరిన్ తిరిగి ఛాన్స్ దక్కించుకోవడం విశేషమే. పేరుకి సెకండ్ హీరోయినే అయినా చిరుతో ఒకటి రెండు పాటలు ఉండొచ్చని అంటున్నారు.
కథకు సంబంధించి లీక్స్ లేకపోవడంతో అభిమానుల్లో ఇది ఎలాంటి కథ అయ్యుంటుందనే ఆసక్తి విపరీతంగా ఉంది. గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు స్థాయి వినోదాన్ని అనిల్ రావిపూడి పండించబోతున్నాడని ఇప్పటికే యూనిట్ సభ్యులు తెగ ఊరిస్తున్నారు. వెంకటేష్ ఉన్నది కన్ఫర్మ్ అయినా దాన్ని అఫీషియల్ చేయకుండా గుట్టుగా దాస్తున్నారు. అప్డేట్స్ ఒక క్రమపద్ధతిలో ప్రమోషన్ల రూపంలో రివీల్ చేయాలనుకుంటున్న రావిపూడికి ఏదో ఒక రూపంలో బయటికి వస్తున్న లీక్స్ తలనెప్పిగా మారాయి. 2026 సంక్రాంతి పండగ లక్ష్యంగా పక్కా ప్లానింగ్ తో షూట్ చేయబోతున్నారు.
This post was last modified on May 6, 2025 11:57 am
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…