మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కబోయే సినిమా షూటింగ్ ఈ నెల మూడో వారంలో ప్రారంభం కానుంది. పూజా కార్యక్రమాలు, ఓపెనింగ్ అయిపోయింది కాబట్టి నేరుగా సెట్స్ లోకి వెళ్ళిపోతారు. ఫైనల్ వెర్షన్ లాక్ చేసేసిన రావిపూడి క్యాస్టింగ్ ని దాదాపు కొలిక్కి తెచ్చేశాడు. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు మెయిన్ హీరోయిన్ నయనతారనే. అధికారికంగా ఇప్పుడప్పుడే ప్రకటన చేయకపోవచ్చు. భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినప్పటికీ పాత్ర ప్రాధాన్యం దృష్ట్యా నిర్మాణ సంస్థ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ఇక రెండో కథానాయికగా క్యాథరిన్ త్రెస్సా ఓకే అయ్యింది.
అయితే ఇక్కడో చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోవాలి. చిరంజీవి సరసన నటించే అవకాశం క్యాథరిన్ కు 2017లోనే వచ్చింది. మెగా కంబ్యాక్ ఖైదీ నెంబర్ 150 కోసం వివి వినాయక్ తొలుత ఆమెనే అనుకున్నారు. కానీ సుష్మితతో వచ్చిన విబేధాల కారణంగా క్యాథరిన్ ని తప్పించి కాజల్ అగర్వాల్ ని తీసుకున్నారనే ప్రచారం మీడియాలో జరిగింది. అయితే దీన్ని సమర్ధిస్తూ లేదా ఖండిస్తూ ఎవరూ ఎలాంటి స్టేట్ మెంట్ ఇవ్వలేదు. సో నిజమే అనుకున్నారందరూ. కట్ చేస్తే తొమ్మిది సంవత్సరాల తర్వాత క్యాథరిన్ తిరిగి ఛాన్స్ దక్కించుకోవడం విశేషమే. పేరుకి సెకండ్ హీరోయినే అయినా చిరుతో ఒకటి రెండు పాటలు ఉండొచ్చని అంటున్నారు.
కథకు సంబంధించి లీక్స్ లేకపోవడంతో అభిమానుల్లో ఇది ఎలాంటి కథ అయ్యుంటుందనే ఆసక్తి విపరీతంగా ఉంది. గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు స్థాయి వినోదాన్ని అనిల్ రావిపూడి పండించబోతున్నాడని ఇప్పటికే యూనిట్ సభ్యులు తెగ ఊరిస్తున్నారు. వెంకటేష్ ఉన్నది కన్ఫర్మ్ అయినా దాన్ని అఫీషియల్ చేయకుండా గుట్టుగా దాస్తున్నారు. అప్డేట్స్ ఒక క్రమపద్ధతిలో ప్రమోషన్ల రూపంలో రివీల్ చేయాలనుకుంటున్న రావిపూడికి ఏదో ఒక రూపంలో బయటికి వస్తున్న లీక్స్ తలనెప్పిగా మారాయి. 2026 సంక్రాంతి పండగ లక్ష్యంగా పక్కా ప్లానింగ్ తో షూట్ చేయబోతున్నారు.
This post was last modified on May 6, 2025 11:57 am
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఎదురుచూస్తున్న కాగ్నిజెంట్ ఉద్యోగులకు మరో సమస్య ఎదురైంది. అమెరికా కార్మిక శాఖ కాగ్నిజెంట్ నుంచి వచ్చే…
ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన కొత్త మ్యాప్ వివాదాస్పదంగా మారింది. భారత దేశంలో భాగమైన అరుణాచల్ ప్రదేశ్ ని స్వతంత్ర…
కరోనా సమయంలో ‘‘భలే మంచి ఓటీటీ బేరము’’ అని పాడుకున్నాయి టాలీవుడ్ నిర్మాణ సంస్థలు. మిగతా భాషల చిత్రాలకు కూడా…
రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయింది. అయితే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ అధికారం ఎవరికి దక్కుతుంది? అనే…
ఏపీ విపక్షం(ప్రధాన కాదు) వైసీపీలో అంతర్గత పోరు ఎక్కువగా సాగుతోంది. దీనికి తోడు.. వైసీపీ అధినేత జగన్కు అత్యంత సన్నిహితంగా…
ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా వేలు.. లక్షల్లోనే ఉద్యోగాలకు ప్రతిష్టాత్మక సంస్థలు మంగళం పాడుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత ఫోక్స్…