కియారా అద్వానీ.. బాలీవుడ్, తెలుగు సినిమాల్లో ప్రముఖ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్న విషయం తెలిసిందే. ఫగ్లీ సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు ఎమ్ఎస్ ధోని: ది అన్టోల్డ్ స్టోరీ, కబీర్ సింగ్, గుడ్ న్యూస్ వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ గా తన రేంజ్ ను పెంచుకుంది. ఇక తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ సినిమాల్లో నటించింది.
కియారా నటనతో పాటు ఆమె అందం, స్టైల్తో అభిమానులను ఆకర్షిస్తుంది. మెట్ గాలా 2025లో కియారా తన బేబీ బంప్తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె బంగారు రంగు టాప్, నలుపు గౌన్, తెల్లని క్లాత్తో అద్భుతంగా కనిపించింది. ఈ డ్రెస్ను గౌరవ్ గుప్తా డిజైన్ చేశారు. కియారా ఈ ఈవెంట్లో తన ప్రెగ్నెన్సీ గ్లోతో మరింత అందంగా కనిపించింది. ఆమె చేతుల్లో రింగ్స్, సింపుల్ నెక్లెస్ ఆమె లుక్ను హైలెట్ చేశాయి.
కియారా 2023లో సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి ప్రేమ శేర్షా సినిమా సెట్లో మొదలైంది. 2025 ఫిబ్రవరిలో వీరు తమ మొదటి బిడ్డను ఆశిస్తున్నట్లు ప్రకటించారు. ఇక కియారా ఇప్పటికే పలు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంది. వార్ 2 లో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్తో కనిపించనుంది. అలాగే టాక్సిక్ అనే కన్నడ పాన్ ఇండియా సినిమాలో యష్తో నటిస్తోంది. మరి ఈ సినిమాలు అమ్మడికి ఏ స్థాయిలో విజయాలను అందిస్తాయో చూడాలి.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…