గత కొన్నేళ్లలో భాషా భేదం లేకుండా దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శల పాలైన సినిమా అంటే ‘ఆదిపురుష్’ అనే చెప్పాలి. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో దీన్ని మించిన డిజాస్టర్లు చాలానే ఉన్నాయి కానీ.. ఇది హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ‘రామాయణం’ కథను దారుణంగా చెడగొట్టి పెట్టారనే భావన రావడం వల్ల ఈ సినిమాపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సామాన్య ప్రేక్షకుల సంగతి పక్కనపెడితే.. అనేక మంది సినీ ప్రముఖులే ఈ సినిమాను తప్పుబట్టారు. చిత్ర బృందంలోని వారు కూడా ఔట్ పుట్ విషయమై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఈ జాబితాలోకి సైఫ్ అలీఖాన్ కూడా వచ్చాడు.
తన కొడుకు తైమూర్కు ‘ఆదిపురుష్’ సినిమా చూపించానని.. అతడిలో ఏ స్పందనలూ లేకపోవడం చూసి తాను సారీ చెప్పానని సైఫ్ పేర్కొనడం చర్చనీయాంశం అయింది. ఆదిపురుష్ ఎంత డిజాస్టర్ అయినప్పటికీ.. తాను ముఖ్య పాత్ర పోషించిన సినిమా గురించి సైఫ్ ఇలాంటి కామెంట్ చేయడం ఆశ్చర్యపరిచింది. ఐతే ఈ కామెంట్లపై సైఫ్ ఇప్పుడు వివరణ ఇచ్చాడు.
ఆదిపురుష్ సినిమా బాలేదు కాబట్టి తన కొడుక్కి సారీ చెప్పలేదంటూ సైఫ్ యుటర్న్ తీసుకున్నాడు. తాను సారీ చెప్పింది వేరే విషయానికని వెల్లడించాడు. ‘‘నేను ఆదిపురుష్లో విలన్గా నటించాను. అందులో కేకలు వేస్తూ అందరిపై యుద్ధం చేస్తుంటాను. అది చూసి నా కొడుకు ఈసారి ఇలాంటి సినిమాలో హీరోగా చేయమని అడిగాడు. ఓకే చెప్పాను. ఇందులో విలన్గా చేసినందుకు సారీ చెప్పాను. నేను నటించిన అన్ని సినిమాలనూ గౌరవిస్తాను. ఆదిపురుష్ను కూడా అలాగే చూస్తాను. సినిమాలన్నింటికీ నా మద్దతు ఒకేలా ఉంటుంది’’ అని సైఫ్ పేర్కొన్నాడు. సైఫ్ ‘సారీ’ కామెంట్స్ తర్వాత నెటిజన్లు మరోసారి దర్శకుడు ఓం రౌత్ను టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలోనే సైఫ్ యుటర్న్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.
This post was last modified on May 5, 2025 4:07 pm
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…