ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న ఒక వార్త ఫ్యాన్స్ లో పెద్ద చర్చకు దారి తీస్తోంది. వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందబోయే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని వేగంగా పూర్తి చేసి 2026 సంక్రాంతి బరిలో దింపాలని హారికా హాసిని ప్రొడ్యూసర్లు నిర్ణయించుకున్నట్టు దాని సారాంశం. ఇంకా షూటింగ్ మొదలుకాలేదు. అసలు అధికారిక ప్రకటనే రాలేదు. అయినా సరే ఇంత పెద్ద ఊహాగానం రావడం చిన్న విషయం కాదు. అసలు ఏడు నెలల్లో అనౌన్స్ మెంట్ నుంచి ఫస్ట్ కాపీ సిద్ధం చేయడం దాకా త్రివిక్రమ్ అంత వేగంగా డీల్ చేయగలరా అనేది పెద్ద ప్రశ్న. ఇక్కడ మిస్ చేయకూడని లాజిక్ మరొకటి ఉంది.
సంక్రాంతికే ఫిక్సయిన చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమాలో వెంకటేష్ ఒక ప్రత్యేక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అఫీషియల్ గా చెప్పలేదు కానీ విశ్వసనీయ సమాచారం మేరకు ఈ కాంబో ఉంది. ఏదో ఆషామాషీ గెస్టు కాకుండా ఎక్కువ సేపు ఉండే క్యారెక్టరట. ఇది నిజమయ్యే పక్షంలో వెంకటేష్ తన సినిమాతోనే తాను పోటీ పడేందుకు అస్సలు ఒప్పుకోడు. పైగా ముందు అనౌన్స్ చేసింది మెగా అనిల్ టీమ్. ఒకరు చెప్పాక ఇంకొకరు రాకూడదనే రూలేం లేదు కానీ ఒకే హీరో రెండు సినిమాలు అలా క్లాష్ అవ్వడం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదు. పైగా చిరు వెంకీ మొదటిసారి నటిస్తున్న టైంలో ఇలాంటివి ప్రోత్సహించరు.
సో వెంకీ త్రివిక్రమ్ రిలీజ్ ప్లాన్ గురించి జరుగుతున్న ప్రచారం ఊహాగానం తప్ప మరొకటి కాదు. అల్లు అర్హున్ 23 మొదలుపెట్టడానికి ఎక్కువ టైం పట్టేలా ఉండటంతో అప్పటిదాకా ఖాళీగా ఉండటం ఇష్టం లేని త్రివిక్రమ్ ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న వెంకటేష్ సినిమాని ఇప్పుడు చేయాలనే దిశగా అడుగులు వేస్తున్నట్టు ఫిలిం నగర్ టాక్. ప్రస్తుతం వెంకటేష్ అందుబాటులో లేరు. రాగానే దీనికి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశముంది. ఒకవేళ నిజంగా కార్యరూపం దాల్చినా 2026 వేసవిని టార్గెట్ చేసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఎప్పటి నుంచో ఏళ్ళ తరబడి అభిమానులు డిమాండ్ చేస్తున్న డ్రీం కాంబినేషన్ ఇది.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…