Movie News

ట్రంప్ దెబ్బ : ఆందోళనలో ప్యాన్ ఇండియా సినిమాలు

అమెరికాలో విడుదల కాబోయే విదేశీ సినిమాలకు ఇకపై వంద శాతం టారిఫ్ విధిస్తున్నట్టు ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ప్రకటించడం ఒక్కసారిగా ఇండస్ట్రీ వర్గాలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఉదాహరణకు ఇకపై అక్కడి డిస్ట్రిబ్యూటర్ మన సినిమాని కోటి రూపాయలకు కొంటే పన్ను రూపంలో అంతే మొత్తాన్ని యుఎస్ ప్రభుత్వానికి చెల్లించాలి. దీని వల్ల ఆ భారం నేరుగా ప్రేక్షకుడి మీద పడి టికెట్ ధరలు పెరుగుతాయి. 14 డాలర్లకే వసూళ్లు అంతంత మాత్రంగా వస్తున్న టైంలో ఇప్పుడీ సొమ్ముని రెట్టింపు చేస్తే తెలుగు ఎన్ఆర్ఐలు థియేటర్లకు రావడం తగ్గిపోతుంది. ఇది తీవ్రమైన పరిణామాలకు దారి తీయొచ్చు.

యుఎస్ లో ఎక్కువ బిజినెస్ చేసుకుంటున్నది తెలుగు, హిందీ, తమిళ సినిమాలే. కన్నడ, మలయాళంకు పరిమిత మార్కెట్ ఉంది. టాలీవుడ్ అయినా టయర్ 1, 2 స్టార్లకు ఉన్నంత ఆదరణ మధ్యస్థ హీరోలకు లేదు. కంటెంట్ బాగుందని టాక్ వస్తే తప్ప జనాలు కదలడం లేదు. ఒకవేళ ప్యాన్ ఇండియా మూవీకి డిజాస్టర్ టాక్ వస్తే మిలియన్ దాటడమే గగనం అయిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ వేసిన బాంబు డిస్ట్రిబ్యూషన్ వర్గాలను కుదేలు చేయడం ఖాయం. గత ఏడాది కాలంలో ఏడెనిమిది సినిమాలు మినహాయించి  అమెరికాలో చాలా మటుకు పబ్లిసిటీ ఖర్చులు కూడా పూర్తి తేలేని డిజాస్టర్లు ఎన్నో ఉన్నాయి.

రాబోయే రోజుల్లో చాలా ప్యాన్ ఇండియా మూవీస్ క్యూలో ఉన్నాయి. హరిహర వీరమల్లు, కుబేర, కన్నప్ప, ది రాజా సాబ్, విశ్వంభర, స్వయంభు, మిరాయ్, వార్ 2, కూలి ఇలా చెప్పుకుంటూ పోతే 2025దే పెద్ద లిస్టు ఉంది. ఇవన్నీ ఓవర్సీస్ వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ లు పెరిగినా నిశ్చింతగా ఉన్నవి. ఇప్పుడీ వంద శాతం టారిఫ్ వల్ల అమ్మకాల్లో తేడాలు వస్తాయి. ఓటిటిలు ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఇకపై 1 మిలియన్, 10 మిలియన్ అంటూ వేగంగా పడే పోస్టర్ల నెంబర్లకు బ్రేకులు పడొచ్చు. ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పూర్తి విధి విధానాలు ఇంకా వెలువడాల్సి ఉంది.

This post was last modified on May 5, 2025 9:56 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

2 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

5 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

1 hour ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

1 hour ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

5 hours ago