Movie News

పౌరసన్మాన సభలో బాలయ్య జోరు హుషారు

కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రెసిడెంట్ చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారం అందుకున్న బాలకృష్ణకు పౌరసన్మాన సభ ఘనంగా జరిగింది. వేలాదిగా విచ్చేసిన అభిమానులు, నందమూరి కుటుంబసభ్యుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాలయ్య ఫ్యాన్స్, ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చేలా బోలెడు కబుర్లు పంచుకున్నారు. ప్రపంచంలో 50 సంవత్సరాలు హీరోగా కొనసాగిన హీరో నేనొక్కడినేనంటూ కరతాళ ధ్వనుల మధ్య గర్వంగా చెప్పారు. పద్మభూషణ్ ఇచ్చారు సంతోషమే కానీ నాన్న ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇస్తే వాళ్లకు వాళ్ళు గౌరవం ఇచ్చుకున్నట్టు అవుతుందని విన్నవించారు.

ఇకపై సెకండ్ ఇన్నింగ్స్ ని మరింత బలంగా చూస్తారని, బ్యాక్ టు బ్యాక్ నాలుగు హిట్లు ఇచ్చాక ఇకపై అంచనాలకు మించి మరింత చెలరేగుతానని ఒకవైపే చూడంటూ సింహాలోని డైలాగు చెప్పడం ద్వారా కొత్త జోష్ ఇచ్చారు. నటులందరూ ఎమ్మెల్యే కాలేదని, ఎందరో వచ్చి నామరూపాలు లేకుండా పోయారని, సేవలు చేశా కాబట్టి జనం నన్ను గెలిపించారని రాజకీయ ప్రస్థానం గురించి వివరించారు. ఇప్పుడే కాదు ఇక ముందు తరాలలో కూడా తన అభిమానులు పుడుతూనే ఉంటారని చెప్పిన బాలయ్య మైకు గాల్లో ఎగరేసి పట్టుకోవడం గురించి చమత్కరించడం, దానికి ఎంత టెన్షన్ పడుతుంటానో వివరించడం ఆకట్టుకుంది.

సినిమా, రాజకీయాలు రెండింటి ప్రస్తావన తెస్తూ మాట్లాడిన బాలకృష్ణ అంచనాలకు మించి మంచి కిక్ అయితే ఇచ్చారు. ప్రస్తుతం అఖండ 2 చేస్తున్న బాలయ్య ఆ సినిమా దసరా పండక్కు రిలీజ్ చేసే అవకాశాలు  తక్కువగా ఉన్నాయి కాబట్టి 2026 సంక్రాంతి వైపు చూస్తున్నారని ఆల్రెడీ టాక్ ఉంది. హీరో, ఎమ్మెల్యే, బసవతారకం ఆసుపత్రి ఛైర్మన్,  అన్ స్టాపబుల్ షో యాంకర్ ఇలా ఆరు పదుల వయసులోలోనూ బహుపాత్రలు పోషిస్తున్న బాలయ్యకు పద్మభూషణ్ తన ప్రతిభకు గవర్నమెంట్ ఇచ్చిన గౌరవం. ఇకపై మరింత దూకుడు చూపిస్తానంటున్న బాలయ్యని దర్శకుడిగా చూడాలనే ఫ్యాన్స్ కోరిక త్వరలోనే తీరొచ్చేమో.

This post was last modified on May 5, 2025 6:24 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మనసు మారిందా వీరభద్రుడా

బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత సూర్య సినిమాలు వరసగా రాబోతున్నాయి. వాటిలో మొదటిది వీరభద్రుడు. తమిళంలో కరుప్పుగా రూపొందిన…

17 minutes ago

తప్పు చేస్తే చంద్రబాబుకి ఎవరైనా ఒకటే

సొంత పార్టీ నాయ‌కుడు త‌ప్పు చేస్తే ఒక‌విధంగా.. ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత‌లు త‌ప్పులు చేస్తే మ‌రో విధంగా మారి పోయిన…

48 minutes ago

సింహాన్ని దాచకుండా మంచి పని చేశారు

మే 1 విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం మీద టీమ్ కన్నా ఎక్కువగా బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే…

2 hours ago

చరణ్ యష్ అనుకుంటే సత్యదేవ్ వస్తున్నాడు

వెనకటికి పాత కథ ఒకటుంది. ఒక రొట్టె కోసం రెండు పిల్లులు పోట్లాడుకుంటే తీర్పు చెప్పడానికి వచ్చిన కోతి దాన్ని…

3 hours ago

సాయిపల్లవికి ‘ఒక రోజు’ షాక్ ఇస్తుందా

చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసే సాయిపల్లవి కాంబోల కన్నా ఎక్కువగా కంటెంట్ కి ప్రాధాన్యం ఇవ్వడం అందరికీ తెలిసిన…

5 hours ago

టీడీపీ మహిళా ఎమ్మెల్యే పీఏగా ట్రాన్స్ జెండర్..

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ…

7 hours ago