హిట్టు ఫ్లాపు కాసేపు పక్కనపెడితే సూర్య మీద అభిమానులకే కాదు సగటు జనాల్లోనూ చక్కని అభిప్రాయం ఉంది. సినిమాల పరంగానే కాకుండా బయట చూపించే ప్రవర్తన, అగరం ఫౌండేషన్ ద్వారా పిల్లల చదువులు, సామజిక కార్యక్రమాలు ఎన్నో తనకు మంచి బ్రాండ్ తీసుకొచ్చాయి. అయితే గత కొన్నేళ్లుగా డిజాస్టర్ల పర్వంలో మునిగి తేలుతున్న సూర్యకు బ్లాక్ బస్టర్ రావాలని ప్రతి మూవీ లవర్ కోరుకున్నాడు. కంగువ కోసం ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే. విలువైన సమయం వృథా అవుతున్నా సరే ఒళ్ళు హూనం చేసుకుని దాని కోసం చాలా త్యాగం చేశాడు. దర్శకుడు సిరుతై శివని నమ్మితే కంగువ దారుణంగా పోయింది.
తాజాగా రెట్రో వచ్చింది. సూర్య మళ్ళీ డైరెక్టర్ నే నమ్మాడు. కార్తీక్ సుబ్బరాజ్ ఇచ్చిన నెరేషన్ కన్నా అతని మేకింగ్ స్టైల్ మీద కాన్ఫిడెన్స్ తో ఎస్ చెప్పాడు. చాలా వేగంగా షూటింగ్ చేస్తుంటే సంతోష పడ్డాడు. కట్ చేస్తే రెట్రోకి నిన్న వచ్చిన టాక్ ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. బాషా, యుగానికి ఒక్కడు, దళపతి ఇలా పాత హిట్లన్నీ మిక్సీలో వేసి కొట్టి తనదైన ల్యాగ్ స్క్రీన్ ప్లేతో కథనాన్ని నడిపించిన కార్తీక్ సుబ్బరాజ్ చివరి దాకా థియేటర్లో కూర్చుకోవడం కష్టమనించేలా చేశాడు. జయరాం, జీజు జార్జ్, నాజర్ లాంటి సీనియర్ మోస్ట్ క్యాస్టింగ్ ఉన్నా వాళ్ళను కనీస స్థాయిలో వాడుకోలేకపోవడం క్షమించరాని తప్పు.
ఓవర్ రేటెడ్ డైరెక్టరని పేరున్న కార్తీక్ సుబ్బరాజ్ దాన్ని సార్థకం చేసుకోవడం కోసమే రెట్రో తీశాడేమో అనిపిస్తోంది. సూర్య ఈ ఫలితాన్ని ఎలా జీర్ణించుకుంటాడో కానీ ఫ్యాన్స్ మాత్రం తెగ ఫీలవుతున్నారు. నెక్స్ట్ ఆర్ జె బాలాజీ తీస్తున్న సూర్య 45 ముగింపుకు దగ్గరలో ఉంది. దీని మీద ఆశల సంగతేమో కానీ అభిమానుల ఎదురు చూపులు మన వెంకీ అట్లూరి మీద ఉన్నాయి. లక్కీ భాస్కర్, సార్ లాంటి సబ్జెక్టులు సూర్యకు పడితే చెలరేగిపోతాడు. దానికి తగ్గట్టే వెంకీ అట్లూరి మంచి వింటేజ్ డ్రామా రాసుకున్నాడట. ఈ రెండు సినిమాలు క్లిక్ అయితే సూర్య బ్యాక్ టు ట్రాక్ అనొచ్చు. తగ్గిపోతున్న మార్కెట్ ని తిరిగి నిలబెట్టుకోవచ్చు.
This post was last modified on May 2, 2025 12:45 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…