హిట్టు ఫ్లాపు కాసేపు పక్కనపెడితే సూర్య మీద అభిమానులకే కాదు సగటు జనాల్లోనూ చక్కని అభిప్రాయం ఉంది. సినిమాల పరంగానే కాకుండా బయట చూపించే ప్రవర్తన, అగరం ఫౌండేషన్ ద్వారా పిల్లల చదువులు, సామజిక కార్యక్రమాలు ఎన్నో తనకు మంచి బ్రాండ్ తీసుకొచ్చాయి. అయితే గత కొన్నేళ్లుగా డిజాస్టర్ల పర్వంలో మునిగి తేలుతున్న సూర్యకు బ్లాక్ బస్టర్ రావాలని ప్రతి మూవీ లవర్ కోరుకున్నాడు. కంగువ కోసం ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే. విలువైన సమయం వృథా అవుతున్నా సరే ఒళ్ళు హూనం చేసుకుని దాని కోసం చాలా త్యాగం చేశాడు. దర్శకుడు సిరుతై శివని నమ్మితే కంగువ దారుణంగా పోయింది.
తాజాగా రెట్రో వచ్చింది. సూర్య మళ్ళీ డైరెక్టర్ నే నమ్మాడు. కార్తీక్ సుబ్బరాజ్ ఇచ్చిన నెరేషన్ కన్నా అతని మేకింగ్ స్టైల్ మీద కాన్ఫిడెన్స్ తో ఎస్ చెప్పాడు. చాలా వేగంగా షూటింగ్ చేస్తుంటే సంతోష పడ్డాడు. కట్ చేస్తే రెట్రోకి నిన్న వచ్చిన టాక్ ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. బాషా, యుగానికి ఒక్కడు, దళపతి ఇలా పాత హిట్లన్నీ మిక్సీలో వేసి కొట్టి తనదైన ల్యాగ్ స్క్రీన్ ప్లేతో కథనాన్ని నడిపించిన కార్తీక్ సుబ్బరాజ్ చివరి దాకా థియేటర్లో కూర్చుకోవడం కష్టమనించేలా చేశాడు. జయరాం, జీజు జార్జ్, నాజర్ లాంటి సీనియర్ మోస్ట్ క్యాస్టింగ్ ఉన్నా వాళ్ళను కనీస స్థాయిలో వాడుకోలేకపోవడం క్షమించరాని తప్పు.
ఓవర్ రేటెడ్ డైరెక్టరని పేరున్న కార్తీక్ సుబ్బరాజ్ దాన్ని సార్థకం చేసుకోవడం కోసమే రెట్రో తీశాడేమో అనిపిస్తోంది. సూర్య ఈ ఫలితాన్ని ఎలా జీర్ణించుకుంటాడో కానీ ఫ్యాన్స్ మాత్రం తెగ ఫీలవుతున్నారు. నెక్స్ట్ ఆర్ జె బాలాజీ తీస్తున్న సూర్య 45 ముగింపుకు దగ్గరలో ఉంది. దీని మీద ఆశల సంగతేమో కానీ అభిమానుల ఎదురు చూపులు మన వెంకీ అట్లూరి మీద ఉన్నాయి. లక్కీ భాస్కర్, సార్ లాంటి సబ్జెక్టులు సూర్యకు పడితే చెలరేగిపోతాడు. దానికి తగ్గట్టే వెంకీ అట్లూరి మంచి వింటేజ్ డ్రామా రాసుకున్నాడట. ఈ రెండు సినిమాలు క్లిక్ అయితే సూర్య బ్యాక్ టు ట్రాక్ అనొచ్చు. తగ్గిపోతున్న మార్కెట్ ని తిరిగి నిలబెట్టుకోవచ్చు.
This post was last modified on May 2, 2025 12:45 pm
సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి తోడు చరణ్కు…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. ఈ కల్తీ వ్యవహారంపై విచారణ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పార్టీ వర్గాలతో చర్చలు జరిపిన ఆయన..…
మెగాస్టార్ చిరంజీవి ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న, ఎంతగానో కోరుకున్న సందర్భం రానే వచ్చింది. ఆయనకు మనవడు పుట్టాడు. చిరంజీవి కుటుంబంలో…
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
+ దేశ సరిహద్దులను కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? నిస్సందేహంగా కేంద్ర ప్రభుత్వానిదే. + దేశ సరిహద్దుల నుంచి పెరుగుతున్న చొరబాట్లను…