హిట్టు ఫ్లాపు కాసేపు పక్కనపెడితే సూర్య మీద అభిమానులకే కాదు సగటు జనాల్లోనూ చక్కని అభిప్రాయం ఉంది. సినిమాల పరంగానే కాకుండా బయట చూపించే ప్రవర్తన, అగరం ఫౌండేషన్ ద్వారా పిల్లల చదువులు, సామజిక కార్యక్రమాలు ఎన్నో తనకు మంచి బ్రాండ్ తీసుకొచ్చాయి. అయితే గత కొన్నేళ్లుగా డిజాస్టర్ల పర్వంలో మునిగి తేలుతున్న సూర్యకు బ్లాక్ బస్టర్ రావాలని ప్రతి మూవీ లవర్ కోరుకున్నాడు. కంగువ కోసం ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే. విలువైన సమయం వృథా అవుతున్నా సరే ఒళ్ళు హూనం చేసుకుని దాని కోసం చాలా త్యాగం చేశాడు. దర్శకుడు సిరుతై శివని నమ్మితే కంగువ దారుణంగా పోయింది.
తాజాగా రెట్రో వచ్చింది. సూర్య మళ్ళీ డైరెక్టర్ నే నమ్మాడు. కార్తీక్ సుబ్బరాజ్ ఇచ్చిన నెరేషన్ కన్నా అతని మేకింగ్ స్టైల్ మీద కాన్ఫిడెన్స్ తో ఎస్ చెప్పాడు. చాలా వేగంగా షూటింగ్ చేస్తుంటే సంతోష పడ్డాడు. కట్ చేస్తే రెట్రోకి నిన్న వచ్చిన టాక్ ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. బాషా, యుగానికి ఒక్కడు, దళపతి ఇలా పాత హిట్లన్నీ మిక్సీలో వేసి కొట్టి తనదైన ల్యాగ్ స్క్రీన్ ప్లేతో కథనాన్ని నడిపించిన కార్తీక్ సుబ్బరాజ్ చివరి దాకా థియేటర్లో కూర్చుకోవడం కష్టమనించేలా చేశాడు. జయరాం, జీజు జార్జ్, నాజర్ లాంటి సీనియర్ మోస్ట్ క్యాస్టింగ్ ఉన్నా వాళ్ళను కనీస స్థాయిలో వాడుకోలేకపోవడం క్షమించరాని తప్పు.
ఓవర్ రేటెడ్ డైరెక్టరని పేరున్న కార్తీక్ సుబ్బరాజ్ దాన్ని సార్థకం చేసుకోవడం కోసమే రెట్రో తీశాడేమో అనిపిస్తోంది. సూర్య ఈ ఫలితాన్ని ఎలా జీర్ణించుకుంటాడో కానీ ఫ్యాన్స్ మాత్రం తెగ ఫీలవుతున్నారు. నెక్స్ట్ ఆర్ జె బాలాజీ తీస్తున్న సూర్య 45 ముగింపుకు దగ్గరలో ఉంది. దీని మీద ఆశల సంగతేమో కానీ అభిమానుల ఎదురు చూపులు మన వెంకీ అట్లూరి మీద ఉన్నాయి. లక్కీ భాస్కర్, సార్ లాంటి సబ్జెక్టులు సూర్యకు పడితే చెలరేగిపోతాడు. దానికి తగ్గట్టే వెంకీ అట్లూరి మంచి వింటేజ్ డ్రామా రాసుకున్నాడట. ఈ రెండు సినిమాలు క్లిక్ అయితే సూర్య బ్యాక్ టు ట్రాక్ అనొచ్చు. తగ్గిపోతున్న మార్కెట్ ని తిరిగి నిలబెట్టుకోవచ్చు.
This post was last modified on May 2, 2025 12:45 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…