జనాలు థియేటర్లకు రావడాన్ని తగ్గించడం వెనుక కారణం క్వాలిటీ కంటెంట్ లేకపోవడమే కావొచ్చు కానీ అంతకన్నా సీరియస్ గా చూడాల్సిన సమస్య మరొకటి ఉంది. అదే టికెట్ రేట్లు, స్నాక్స్ ధరలు. గత కొన్నేళ్లుగా థియేటర్ ఎక్స్ పీరియన్స్ చాలా ఖరీదుగా మారిపోయింది. ముఖ్యంగా మల్టీప్లెక్సులు వచ్చాక వీటి వ్యయం తట్టుకోలేక మధ్య తరగతి జనాలు ఓటిటి, పైరసీకి అలవాటు పడ్డారు. ఇది బాలీవుడ్ వ్యాపారాన్ని తీవ్రంగా పట్టి పీడిస్తోంది. అందుకే అప్పుడప్పుడు 99 రూపాయల టికెట్లు, వన్ ప్లస్ వన్ ఆఫర్లు ఇస్తూ ఉంటారు. అయినా సరే పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదు. దీనికి షారుఖ్ ఖాన్ ఒక సూపర్ ఐడియా ఇచ్చాడు.
తాజాగా జరుగుతున్న వేవ్స్ సమ్మిట్ 2025లో అతిథిగా పాల్గొన్న షారుఖ్ ఖాన్ ఒక ప్రతిపాదన తెచ్చాడు. ప్రతి ఊరిలో చీప్ థియేటర్లు ఉండాలని, వాటిలో భాషతో సంబంధం లేకుండా భారతీయ చిత్రాలు ప్రదర్శించాలని, టికెట్ రేట్లు అందుబాటులో ఉండేలా చూసుకుంటే ఫుట్ ఫాల్స్ పెరుగుతాయని వివరించాడు. షారుఖ్ అన్నదాంట్లో లాజిక్ ఉంది. సగటున 200 నుంచి 500 రూపాయల మధ్యలో మల్టీప్లెక్స్ టికెట్ రేట్లు ఉంటున్నాయి. పుష్ప, ఆర్ఆర్ఆర్, కల్కి లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ అయితే ఓకే కానీ మార్కెట్ తక్కువగా ఉండే కొందరు టయర్ 2 హీరోలకు సైతం ఈ పద్ధతినే ఫాలో అవుతున్నారు నిర్మాతలు.
దీని వల్ల కామన్ మ్యాన్ దూరమైపోయాడు. ఒకవేళ షారుఖ్ అన్నట్టు వంద లోపే టికెట్లు అమ్మేలా సాధారణ వసతులు ఉన్న సింగల్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తే హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా ఎక్కువ జనాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఐడియా అయితే చెప్పాడు కానీ మోనోపోలీ రాజ్యమేలే ఇండస్ట్రీలో ఇదంత సులభంగా అమలు చేయలేరు. పెట్టుబడి మొత్తం వారం పది రోజుల్లో వచ్చేయాలని కంకణం కట్టుకుంటున్న నిర్మాతలు ఈ చీప్ థియేటర్స్ కాన్సెప్ట్ ని అంత సులభంగా అంగీకరించరు. కనీసం ఆలోచన చేసి మంచి చెడ్డా విశ్లేషించుకుంటే భవిష్యత్తులో అయినా ఇలాంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది.
This post was last modified on May 1, 2025 8:52 pm
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…
ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…
పొట్లూరి వరప్రసాద్.. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించిన పేరు. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ ‘బలుపు’తో ఆయన…
టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాఠశాలలు, దేవాలయాల సమీపంలో…
రాత్రి వేళ గస్తీ కాసేందుకు దేశం కాని దేశం వస్తున్న నేపాలీలు ఇప్పుడు నేరాల్లో ఆరితేరిపోయారని చెప్పాలి. గుర్ఖాలుగా ఎంట్రీ…
చట్టం గెలిచిందనుకున్న ప్రతీసారి పైరసీ కొత్త అవతారం ఎత్తుతోంది. ఐబొమ్మ ఆపరేటర్ రవి అరెస్ట్, సైట్ క్లోజ్ అని పోలీసులు…