జనాలు థియేటర్లకు రావడాన్ని తగ్గించడం వెనుక కారణం క్వాలిటీ కంటెంట్ లేకపోవడమే కావొచ్చు కానీ అంతకన్నా సీరియస్ గా చూడాల్సిన సమస్య మరొకటి ఉంది. అదే టికెట్ రేట్లు, స్నాక్స్ ధరలు. గత కొన్నేళ్లుగా థియేటర్ ఎక్స్ పీరియన్స్ చాలా ఖరీదుగా మారిపోయింది. ముఖ్యంగా మల్టీప్లెక్సులు వచ్చాక వీటి వ్యయం తట్టుకోలేక మధ్య తరగతి జనాలు ఓటిటి, పైరసీకి అలవాటు పడ్డారు. ఇది బాలీవుడ్ వ్యాపారాన్ని తీవ్రంగా పట్టి పీడిస్తోంది. అందుకే అప్పుడప్పుడు 99 రూపాయల టికెట్లు, వన్ ప్లస్ వన్ ఆఫర్లు ఇస్తూ ఉంటారు. అయినా సరే పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదు. దీనికి షారుఖ్ ఖాన్ ఒక సూపర్ ఐడియా ఇచ్చాడు.
తాజాగా జరుగుతున్న వేవ్స్ సమ్మిట్ 2025లో అతిథిగా పాల్గొన్న షారుఖ్ ఖాన్ ఒక ప్రతిపాదన తెచ్చాడు. ప్రతి ఊరిలో చీప్ థియేటర్లు ఉండాలని, వాటిలో భాషతో సంబంధం లేకుండా భారతీయ చిత్రాలు ప్రదర్శించాలని, టికెట్ రేట్లు అందుబాటులో ఉండేలా చూసుకుంటే ఫుట్ ఫాల్స్ పెరుగుతాయని వివరించాడు. షారుఖ్ అన్నదాంట్లో లాజిక్ ఉంది. సగటున 200 నుంచి 500 రూపాయల మధ్యలో మల్టీప్లెక్స్ టికెట్ రేట్లు ఉంటున్నాయి. పుష్ప, ఆర్ఆర్ఆర్, కల్కి లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ అయితే ఓకే కానీ మార్కెట్ తక్కువగా ఉండే కొందరు టయర్ 2 హీరోలకు సైతం ఈ పద్ధతినే ఫాలో అవుతున్నారు నిర్మాతలు.
దీని వల్ల కామన్ మ్యాన్ దూరమైపోయాడు. ఒకవేళ షారుఖ్ అన్నట్టు వంద లోపే టికెట్లు అమ్మేలా సాధారణ వసతులు ఉన్న సింగల్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తే హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా ఎక్కువ జనాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఐడియా అయితే చెప్పాడు కానీ మోనోపోలీ రాజ్యమేలే ఇండస్ట్రీలో ఇదంత సులభంగా అమలు చేయలేరు. పెట్టుబడి మొత్తం వారం పది రోజుల్లో వచ్చేయాలని కంకణం కట్టుకుంటున్న నిర్మాతలు ఈ చీప్ థియేటర్స్ కాన్సెప్ట్ ని అంత సులభంగా అంగీకరించరు. కనీసం ఆలోచన చేసి మంచి చెడ్డా విశ్లేషించుకుంటే భవిష్యత్తులో అయినా ఇలాంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది.
This post was last modified on May 1, 2025 8:52 pm
టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…
ది ప్యారడైజ్.. దసరా లాంటి రా అండ్ రస్టిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు…
అదేంటో గానీ... ఉన్న రోగానికి మందేస్తే... ఆ రోగం సంగతేమో గానీ... కొత్త రోగం వచ్చి పడుతోంది. ఈ తరహా…