జనాలు థియేటర్లకు రావడాన్ని తగ్గించడం వెనుక కారణం క్వాలిటీ కంటెంట్ లేకపోవడమే కావొచ్చు కానీ అంతకన్నా సీరియస్ గా చూడాల్సిన సమస్య మరొకటి ఉంది. అదే టికెట్ రేట్లు, స్నాక్స్ ధరలు. గత కొన్నేళ్లుగా థియేటర్ ఎక్స్ పీరియన్స్ చాలా ఖరీదుగా మారిపోయింది. ముఖ్యంగా మల్టీప్లెక్సులు వచ్చాక వీటి వ్యయం తట్టుకోలేక మధ్య తరగతి జనాలు ఓటిటి, పైరసీకి అలవాటు పడ్డారు. ఇది బాలీవుడ్ వ్యాపారాన్ని తీవ్రంగా పట్టి పీడిస్తోంది. అందుకే అప్పుడప్పుడు 99 రూపాయల టికెట్లు, వన్ ప్లస్ వన్ ఆఫర్లు ఇస్తూ ఉంటారు. అయినా సరే పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదు. దీనికి షారుఖ్ ఖాన్ ఒక సూపర్ ఐడియా ఇచ్చాడు.
తాజాగా జరుగుతున్న వేవ్స్ సమ్మిట్ 2025లో అతిథిగా పాల్గొన్న షారుఖ్ ఖాన్ ఒక ప్రతిపాదన తెచ్చాడు. ప్రతి ఊరిలో చీప్ థియేటర్లు ఉండాలని, వాటిలో భాషతో సంబంధం లేకుండా భారతీయ చిత్రాలు ప్రదర్శించాలని, టికెట్ రేట్లు అందుబాటులో ఉండేలా చూసుకుంటే ఫుట్ ఫాల్స్ పెరుగుతాయని వివరించాడు. షారుఖ్ అన్నదాంట్లో లాజిక్ ఉంది. సగటున 200 నుంచి 500 రూపాయల మధ్యలో మల్టీప్లెక్స్ టికెట్ రేట్లు ఉంటున్నాయి. పుష్ప, ఆర్ఆర్ఆర్, కల్కి లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ అయితే ఓకే కానీ మార్కెట్ తక్కువగా ఉండే కొందరు టయర్ 2 హీరోలకు సైతం ఈ పద్ధతినే ఫాలో అవుతున్నారు నిర్మాతలు.
దీని వల్ల కామన్ మ్యాన్ దూరమైపోయాడు. ఒకవేళ షారుఖ్ అన్నట్టు వంద లోపే టికెట్లు అమ్మేలా సాధారణ వసతులు ఉన్న సింగల్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తే హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా ఎక్కువ జనాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఐడియా అయితే చెప్పాడు కానీ మోనోపోలీ రాజ్యమేలే ఇండస్ట్రీలో ఇదంత సులభంగా అమలు చేయలేరు. పెట్టుబడి మొత్తం వారం పది రోజుల్లో వచ్చేయాలని కంకణం కట్టుకుంటున్న నిర్మాతలు ఈ చీప్ థియేటర్స్ కాన్సెప్ట్ ని అంత సులభంగా అంగీకరించరు. కనీసం ఆలోచన చేసి మంచి చెడ్డా విశ్లేషించుకుంటే భవిష్యత్తులో అయినా ఇలాంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది.
This post was last modified on May 1, 2025 8:52 pm
సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…
పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…
2029 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా సమయం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది (జమిలి…
ఒళ్ళు హూనం చేసుకుని సంవత్సరాలు ఖర్చు పెట్టి నిఖిల్ నటించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటిదాకా కొత్త రిలీజ్…
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేవి మైండ్ గేమ్స్, సస్పెన్స్ త్రిల్లర్స్. 'క్షణం',…
రాజకీయం రాజకీయమే. రాజకీయమనే తానులో ఉండే ఏ పార్టీ అయినా తీరు ఒక్కటే అన్న విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది.…