బుట్టబొమ్మ అని రామజోగయ్య శాస్త్రి గారు రాసినట్టు ఆ పదానికి న్యాయం చేకూర్చే అందంతో పూజా హెగ్డే కొన్నేళ్ల క్రితం వరకు వరస బ్లాక్ బస్టర్లతో బాగానే దూసుకెళ్లింది. ఆ తర్వాత ఫ్లాపులు ఒకదాని తర్వాత మరొకటి పలకరించడంతో అవకాశాలు తగ్గిపోయాయి. అయితే సూర్య రెట్రోలో ఛాన్స్ రావడం చూసి ఫ్యాన్స్ జాక్ పాట్ అనుకున్నారు. అందులోనూ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం అంటే పెర్ఫార్మన్స్ కి ఎంతో స్కోప్ ఉంటుంది. అయితే మేకప్ లేకుండా డార్క్ టోన్ లోకి మార్చి ఆమెను నల్లగా చూపించే ప్రయత్నం బెడిసి కొట్టిందని చెప్పాలి. ఏ మాత్రం నప్పని డీ గ్లామర్ వేషంలో పూజా నటన ఏమో కానీ లుక్స్ అయితే వద్దు ప్లీజ్ అనిపించాయి.
నిజానికి కార్తీక్ సుబ్బరాజ్ డిజైన్ చేసుకున్న రుక్మిణి క్యారెక్టర్ కు పూజా హెగ్డేలాంటి తెల్లతోలు భామలు సూటవ్వరు. తమిళంలోనే తుషార విజయన్, ఐశ్వర్య రాజేష్ లాంటి వాళ్ళను తీసుకుంటే సహజత్వం పెరిగి సూర్యతో కెమిస్ట్రీ మరింత బాగా పండేది. పూజా తన శాయశక్తులా నిలబెట్టే ప్రయత్నం చేసింది. భారీ ఎమోషనల్ సీన్స్ లో సూర్యతో పోటీ పడింది. కానీ చాలా చోట్ల కృతకంగా అనిపించడం ఆమె తప్పు కాదు. అలా చూపించాలనుకున్న కార్తీక్ సుబ్బురాజ్ ది. ఇది కనక బ్లాక్ బస్టర్ అయితే మళ్ళీ బిజీ అయిపోవచ్చని భావిస్తున్న పూజా హెగ్డేకు తమిళంలో ఏమో కానీ తెలుగులో ఆ కోరిక తీరడం కష్టమే అనిపిస్తోంది.
ఇక కంటెంట్ విషయానికి వస్తే భార్య కోసం పాత గ్యాంగ్ స్టర్ జీవితాన్ని వదిలేయాలనుకున్న ఒక యువకుడి జీవితంలో చెలరేగిన అలజడులనే కార్తీక్ సుబ్బురాజ్ రెట్రోలో రాసుకున్నాడు. అతన్ని చిన్నప్పటి నుంచి మార్చే రుక్మిణిగా పూజా హెగ్డే కనిపిస్తుంది. జిగర్ తండా డబుల్ ఎక్సే తెలుగులో ఆడలేదు. మరి టాక్ పరంగా అభిమానులను టెన్షన్ పెడుతున్న రెట్రో ఏదైనా మేజిక్ చేయడం అనుమానమే. మొదట్లో వచ్చే పదిహేను నిమిషాల సింగల్ షాట్ కల్యాణ మండపం ఎపిసోడ్ తప్ప కార్తీక్ సుబ్బురాజ్ పెద్దగా మెప్పించింది లేదు. సూర్యకే కాదు పూజా హెగ్డేకు కూడా సక్సెస్ ఇంకా అందని ద్రాక్షే అవుతుందేమో.
This post was last modified on May 2, 2025 7:17 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…