ప్రియా ప్రకాశ్ వారియర్… ఒకే ఒక్క వీడియోతో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్, ఫాలోయింగ్ తెచ్చుకుందీ చిన్నది. ‘ఓరు ఆదార్ లవ్’ మూవీ టీజర్లో ప్రియా వారియర్ కన్ను కొట్టి, చేతితో ముద్దుల గన్ పేల్చిన స్టైల్కి యువతరం ఫిదా అయిపోయింది. అప్పట్లో ఈ వీడియో ఎంతటి సంచలనం క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ వెటరన్ యాక్టర్ రిషి కపూర్ కూడా ఈ వీడియో చూసి ప్రియా వారియర్కు పడిపోయారు..
‘ఈ పిల్ల నా టైమ్లో ఎందుకు పుట్టలేదబ్బా’ అంటూ రిషి సాబ్ వేసిన ట్వీట్పై, అప్పట్లో బీటౌన్లో పెద్ద డిస్కర్షనే జరిగింది. రిషి కపూర్ ఆకస్మిక మరణంతో ఆయన ట్వీట్ను మరోసారి గుర్తుచేసుకుంది ప్రియా వారియర్.
2018, ఫిబ్రవరి 16న రిషి కపూర్ చేసిన ట్వీట్ను పోస్ట్ చేసిన ప్రియా వారియర్… ‘ఈ వ్యాఖ్యలు నాకెంతో విలువైనవి. నాపై నాకు నమ్మకం పోయినప్పుడు నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. నా జీవితంలో ఎప్పటికీ ఆయన మాటలు మరిచిపోలేను. మీ టైమ్లో నేను పుట్టి, మరోసారి మిమ్మల్ని కలిసే అవకాశం రావాలని కోరుకుంటున్నా…’ అంటూ రిషి కపూర్కి ఘనమైన నివాళి అర్పించింది ప్రియా ప్రకాశ్ వారియర్.
ఇదిలా ఉంటే టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేయడంతో భారీ అంచనాలతో విడుదలైన ‘ఓరు ఆదార్ లవ్’… బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలై ఏడాదిన్నర కావస్తున్నా ప్రియా వారియర్ మరో మూవీ కమిట్ కాలేదు.
కమిట్ అయిన సినిమాలు రిలీజవ్వలేదు. అందుకే ‘ఓరు ఆదార్ లవ్’ తర్వాత తనను అందరూ మరిచిపోవడంతో రిషి కపూర్ ట్వీట్ను వాడుకుని, అటెన్షన్ పొందాలని ప్రయత్నిస్తోందంటూ ప్రియా వారియర్ను కామెంట్స్ చేస్తున్నారు కొందరు నెటిజన్స్.
This post was last modified on April 30, 2020 4:21 pm
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…