రేపు విడుదల కాబోతున్న రెండు పెద్ద సినిమాల మధ్య పోటీని హీరోల పరంగా కాకుండా దర్శకుల కోణం నుంచి చూస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు అర్థమవుతాయి. అవేంటో విశ్లేషించుకుంటే హిట్ 3కే బజ్ ఎందుకు ఎక్కువగా ఉందనేది అర్థమవుతుంది. రెట్రో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కు ఇంటెలిజెంట్ ఫిలిం మేకర్ గా పేరుంది. క్లిష్టంగా అనిపించే స్క్రీన్ ప్లేతో ఒక్కోసారి అర్థం కాని కథలను తెరకెక్కించి ఆడియన్స్ తిరస్కారానికి గురవుతుంటాడు. జగమే తంతిరం, మెర్క్యూరీ దానికి మంచి ఉదాహరణలు. మహాన్ ఓటిటిలో వచ్చింది కాబట్టి దాని థియేటర్ పొటెన్షియాలిటీని అంచనా వేయలేం కానీ అదీ గొప్ప క్లాసిక్ కాదు.
మిగిలిన వాటిలో రజనీకాంత్ స్టైల్ అండ్ ఇమేజ్ ఇమేజ్ వల్ల పేట గట్టెక్కగా నవరస వెబ్ సిరీస్ లో తీసిన సింగల్ ఎపిసోడ్ కు సైతం ఏమంత గొప్ప ప్రశంసలు రాలేదు. కార్తీక్ సుబ్బరాజ్ పదమూడు సంవత్సరాల కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు రెండే ఒకటి జిగర్ తండా, రెండు ఇరైవి. తమిళంలో మాత్రమే బాగా ఆడాయి. ఇక గత చిత్రం జిగర్ తండా డబుల్ ఎక్స్ తెలుగుతో సహా అన్ని డబ్బింగుల్లో డిజాస్టరే. కోలీవుడ్ లో మాత్రమే డబ్బులు తెచ్చింది. సో రెట్రోకు ఎక్కువగా పని చేస్తోంది సూర్య ఇమేజే. లోకేష్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్, ప్రశాంత్ నీల్ లాగా కార్తీక్ సుబ్బరాజ్ కు కమర్షియల్ ఫుల్ లేదనేది వాస్తవం.
ఇక శైలేష్ కొలను విషయానికి వస్తే తీసింది మూడు సినిమాలు. వాటిలో సైంధవ్ ఒకటే ఫ్లాప్. హిట్ ది ఫస్ట్ కేస్, హిట్ ది సెకండ్ కేస్ రెండూ హిట్టే. వసూళ్లపరంగా నిర్మాత నానికి బాగా పే చేశాయి. హిట్ 1 మక్కికి మక్కి హిందీ రీమేక్ కౌంట్ లోకి తీసుకోలేం. ఇప్పుడు హిట్ 3 ది థర్డ్ కేస్ ని శైలేష్ కొలను రూపొందించిన విధానం అంచనాలు పెంచేసింది. ట్రైలర్ కట్ కొంచెం హడావిడిగా అనిపించినా నాని కటవుట్ సహాయంతో శైలేష్ స్టైలిష్ హింసతో హైప్ పెంచేశాడు. తమిళం, హిందీలోనూ బుకింగ్స్ పాజిటివ్ గా ఉండటం గమనార్హం. ఎలా చూసినా కార్తీక్ సుబ్బరాజ్ సీనియర్ ఇంటెలిజెన్స్ ని కేవలం ఐదేళ్ళ అనుభవమున్న శైలేష్ వయొలెన్స్ డామినేట్ చేసేస్తోంది.
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…
అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…