రేపు విడుదల కాబోతున్న రెండు పెద్ద సినిమాల మధ్య పోటీని హీరోల పరంగా కాకుండా దర్శకుల కోణం నుంచి చూస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు అర్థమవుతాయి. అవేంటో విశ్లేషించుకుంటే హిట్ 3కే బజ్ ఎందుకు ఎక్కువగా ఉందనేది అర్థమవుతుంది. రెట్రో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కు ఇంటెలిజెంట్ ఫిలిం మేకర్ గా పేరుంది. క్లిష్టంగా అనిపించే స్క్రీన్ ప్లేతో ఒక్కోసారి అర్థం కాని కథలను తెరకెక్కించి ఆడియన్స్ తిరస్కారానికి గురవుతుంటాడు. జగమే తంతిరం, మెర్క్యూరీ దానికి మంచి ఉదాహరణలు. మహాన్ ఓటిటిలో వచ్చింది కాబట్టి దాని థియేటర్ పొటెన్షియాలిటీని అంచనా వేయలేం కానీ అదీ గొప్ప క్లాసిక్ కాదు.
మిగిలిన వాటిలో రజనీకాంత్ స్టైల్ అండ్ ఇమేజ్ ఇమేజ్ వల్ల పేట గట్టెక్కగా నవరస వెబ్ సిరీస్ లో తీసిన సింగల్ ఎపిసోడ్ కు సైతం ఏమంత గొప్ప ప్రశంసలు రాలేదు. కార్తీక్ సుబ్బరాజ్ పదమూడు సంవత్సరాల కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు రెండే ఒకటి జిగర్ తండా, రెండు ఇరైవి. తమిళంలో మాత్రమే బాగా ఆడాయి. ఇక గత చిత్రం జిగర్ తండా డబుల్ ఎక్స్ తెలుగుతో సహా అన్ని డబ్బింగుల్లో డిజాస్టరే. కోలీవుడ్ లో మాత్రమే డబ్బులు తెచ్చింది. సో రెట్రోకు ఎక్కువగా పని చేస్తోంది సూర్య ఇమేజే. లోకేష్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్, ప్రశాంత్ నీల్ లాగా కార్తీక్ సుబ్బరాజ్ కు కమర్షియల్ ఫుల్ లేదనేది వాస్తవం.
ఇక శైలేష్ కొలను విషయానికి వస్తే తీసింది మూడు సినిమాలు. వాటిలో సైంధవ్ ఒకటే ఫ్లాప్. హిట్ ది ఫస్ట్ కేస్, హిట్ ది సెకండ్ కేస్ రెండూ హిట్టే. వసూళ్లపరంగా నిర్మాత నానికి బాగా పే చేశాయి. హిట్ 1 మక్కికి మక్కి హిందీ రీమేక్ కౌంట్ లోకి తీసుకోలేం. ఇప్పుడు హిట్ 3 ది థర్డ్ కేస్ ని శైలేష్ కొలను రూపొందించిన విధానం అంచనాలు పెంచేసింది. ట్రైలర్ కట్ కొంచెం హడావిడిగా అనిపించినా నాని కటవుట్ సహాయంతో శైలేష్ స్టైలిష్ హింసతో హైప్ పెంచేశాడు. తమిళం, హిందీలోనూ బుకింగ్స్ పాజిటివ్ గా ఉండటం గమనార్హం. ఎలా చూసినా కార్తీక్ సుబ్బరాజ్ సీనియర్ ఇంటెలిజెన్స్ ని కేవలం ఐదేళ్ళ అనుభవమున్న శైలేష్ వయొలెన్స్ డామినేట్ చేసేస్తోంది.
This post was last modified on April 30, 2025 5:55 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…