సమంత నిర్మాతగా మారి శుభం అనే చిన్న సినిమా తీసింది. మే 9 రిలీజ్. అందరూ కొత్తోళ్లే. దర్శకుడు ప్రవీణ్ ఇంతకు ముందు నెట్ ఫ్లిక్స్ కోసం సినిమా బండి తీస్తే మంచి పేరు తీసుకొచ్చింది. శుభం ట్రైలర్ చూశాక జనం కాసింత నవ్వుకున్నారు కానీ ఖచ్చితంగా థియేటర్లకు వెళ్లాలనే రేంజ్ లో ఆసక్తి పెంచలేకపోయిన మాట వాస్తవం. ముందు సస్పెన్స్ గా పెడదామనుకున్న సమంత క్యామియోని ఇందులోనే రివీల్ చేశారు. కారణం బిజినెస్ యాంగిల్. ఎంత సామ్ ప్రొడ్యూసర్ అయినా కేవలం కొత్త మొహాల మీద బిజినెస్ జరగడం కష్టం. అందులోనూ హిట్ 3 వచ్చిన ఎనిమిది రోజులకు థియేటర్లకు రావడమంటే రిస్క్ ఉంటుంది.
సరే బజ్ సంగతి ఎలా ఉన్నా శుభం కోసం అగ్ర డిస్ట్రిబ్యూషన్ సంస్థలు తలో చేయి వేస్తున్నాయి. నైజాం పంపిణి బాధ్యతను మైత్రి తీసుకోగా ఏసి సీడెడ్ కోసం సురేష్ బాబు ముందుకొచ్చారు. ఫలితంగా శుభంకు చెప్పుకోదగ్గ థియేటర్లు దక్కుతాయి. రిలీజ్ ఛార్ట్ లో మంచి స్క్రీన్లు కనిపిస్తాయి. దీని ద్వారా ప్రేక్షకుల్లో అటెన్షన్ తెచ్చే ప్రయత్నాలు పెంచుకోవచ్చు. ఒకరకంగా సామ్ కు ఇదంతా బలమైన సపోర్ట్ కానుంది. పాజిటివ్ టాక్ వస్తే వీటి మద్దతు మరింత బలమై రెండో వారంలో థియేటర్లు హోల్డ్ చేసుకోవడానికి ఉపయోపడుతుంది. తద్వారా బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాలు అందుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.
కాకపోతే శుభంకి పోటీ పరంగా రిస్క్ లేకుండా అయితే ఉంది. శ్రీవిష్ణు సింగిల్ మీద బజ్ పెరుగుతోంది. ట్రైలర్ వచ్చాక యూత్ దృష్టి దాని వైపు వెళ్ళింది. జగదేకవీరుడు అతిలోకసుందరిని భారీ ఎత్తున 2డి, 3డి లో రీ రిలీజ్ చేస్తున్నారు. వైజయంతి సంస్థ కాబట్టి వీళ్ళ ప్లానింగ్ ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. సో శుభంకు సూపర్ హిట్ టాక్ వస్తేనే వీటిని తట్టుకుంటుంది. పైగా ప్రమోషన్లకు ఎక్కువ సమయం లేదు. కళ్లుమూసి తెరిచే లోపు ఎనిమిది రోజుల అయిపోతాయి. నిర్మాతగా తొలి ప్రయత్నం కాబట్టి సమంతా బోలెడు ఆశలు పెట్టుకుంది. థియేటర్ ఎలా ఉన్నా ఓటిటి, డిజిటల్, డబ్బింగ్ హక్కులు మంచి రేట్ కే వెళ్లాయట.
This post was last modified on April 30, 2025 4:48 pm
రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హల్ద్వానిలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని శ్రీరామ్…
ఒకప్పుడు షకీలాకు సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. వరుస సినిమాలు, భారీ గుర్తింపు, తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్తో…
ఏఐ రంగప్రవేశం తర్వాత తమ ఫొటోలు, వీడియోలను ఇష్టానుసారం వాడేస్తున్న నేపథ్యంలో పర్సనాలిటీ రైట్స్ కోసం ఫిలిం సెలబ్రెటీలను న్యాయస్థానాలను…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాధమిక ప్రాజెక్టులుగా భావిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జిలను సీఎం చంద్రబాబు తాజాగా…
ఓజిలో విలన్ గా పరిచయమైన ఇమ్రాన్ హష్మీ ఒకప్పుడు బాలీవుడ్ సోలో హీరోగా మంచి మార్కెట్ ఎంజాయ్ చేసిన వైనం…
కొందరు నిర్మాతలకు కాకతాళీయంగా జరిగేవే అయినా కొన్ని సంఘటనల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. నాగవంశీకి ఇది బాగా అనుభవం. లక్కీ…