టాలీవుడ్లో ఒక సెలబ్రెటీ జంట తల్లిదండ్రులు కాబోతున్నారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. చాలామంది ఆ జంట అక్కినేని నాగచైతన్య-శోభిత ధూళిపాళ్లనే అంటూ వారి ఫొటోలు పెట్టి శుభాకాంక్షలు చెప్పడం మొదలుపెట్టారు. పెళ్లయిన కొన్ని నెలలకే గుడ్ న్యూస్ చెప్పేశారే అంటూ ఆశ్చర్యపోతున్నారు. కానీ చైతూ-శోభిత తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్త వాస్తవం కాదన్నది లేటెస్ట్ న్యూస్. ఈ శుభ వార్త మెగా ఫ్యామిలీకి సంబంధించినది అట. రెండేళ్ల కిందట పెళ్లి చేసుకున్న ఈ జంట.. ఇప్పుడు తమ కుటుంబంలోకి కొత్త మెంబర్ను ఆహ్వానించడానికి సిద్ధమైందట.
లావణ్య ప్రెగ్నెంట్ అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. త్వరలోనే అఫీషియల్ న్యూస్ బయటికి రావచ్చు. 2017లో వచ్చిన ‘మిస్టర్’ చిత్రంలో కలిసి పని చేసిన సమయంలో వరుణ్, లావణ్యల మధ్య స్నేహం మొదలై అది తర్వాత ప్రేమకు దారి తీసింది. ఈ జంట ‘అంతరిక్షం’ చిత్రంలోనూ కలిసి నటించింది. అప్పుడే ప్రేమ బలపడింది.
2023లో ఈ జంట పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత లావణ్య సినిమాలకు దాదాపు దూరమైనట్లే కనిపించింది. ఐతే మూడు నెలల కిందటే ఆమె ప్రధాన పాత్రలో ‘సతీ లీలావతి’ అనే సినిమా మొదలైంది. తమిళంలో ఆమె ‘తనల్’ అనే సినిమాను పూర్తి చేసేసింది. ‘సతీ లీలావతి’ సినిమా చేతిలో ఉండగానే.. లావణ్య ప్రెగ్నెంట్ అనే వార్త బయటికి వచ్చింది. బహుశా ఆ సినిమా చిత్రీకరణ పూర్తి కావస్తుండొచ్చు. షూట్ అంతా అవ్వగానే లావణ్య విశ్రాంతి తీసుకుంటుందేమో. మరోవైపు వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘కొరియన్ కనకరాజు’ అనే హార్రర్ కామెడీలో నటిస్తున్నాడు. వరుస డిజాస్టర్లతో సతమతం అవుతున్న వరుణ్కు తండ్రి అయ్యాక జాతకం మారుతుందేమో చూడాలి.
This post was last modified on April 30, 2025 4:39 pm
రాష్ట్రంలో ఎవరి దయాదాక్షిణ్యాలపైనా తాను ముఖ్యమంత్రిని కాలేదని.. 4 కోట్ల మంది ఓటర్లు ఓటేసి తనను గెలిపించుకున్నారని.. వారి ఆశీర్వాదం,…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి... పాలిటిక్స్ తో పాటు ఇతరత్రా అంశాలపైనా ఓ రేంజి అవగాహన కలిగిన నేతగా…
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు ఆరవ్ యాక్సిడెంట్ చేయడంతో దానయ్య అనే గొర్రెల కాపరి మృతి చెందిన సంగతి…
తెలుగులో గత కొన్నేళ్లలో వచ్చిన ఉత్తమ ప్రేమకథా చిత్రాల్లో ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ ఒకటి. ఎక్కువగా అగ్రెసివ్ క్యారెక్టర్లు…
ప్రభాస్ అభిమానులకు పీడకలగా మిగిలిపోయిన ఆదిపురుష్ మరోసారి సోషల్ మీడియా టాపిక్ అయ్యింది. కారణం రామాయణ ట్రైలర్. రెండు సినిమాల్లో…
వైసీపీ అధినేత జగన్ ఏలక్ష్యంతో అయితే.. శ్రీకాకుళం పర్యటనకు వెళ్లారో.. ఆ లక్ష్యం నెరవేరకుండానే వెనుదిరిగే పరిస్థితి ఏర్పడింది. దీనికి…