నటీమణులలో ఈమధ్య పెద్దగా సక్సెస్ లు రాకపోయినా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ అందుకున్న వారిలో ఇశ్వర్యా మేనన్ ఒకరు. నటనతో పాటు తన అందచందాలతోనూ ఆకట్టుకుంటున్న ఈ భామ తాజాగా చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుపు రంగు దుస్తుల్లో ఆమె ఇచ్చిన పొజులు అభిమానుల మనసులను కొల్లగొడుతున్నాయి.
ఒకవైపు సొగసైన చూపులు.. మరోవైపు మినిమల్ మేకప్తో ఆమె ఇచ్చిన అభినయ హావభావాలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. క్లాస్ అందాన్ని చాటేలా ఆమె స్టైలింగ్, హెయిర్డిజైన్ ప్రతి ఫోటోలో ప్రత్యేకంగా కనిపిస్తోంది. వీటిని చూసిన నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. క్యూట్ హీరోయిన్ సొగసుల ఐశ్వర్యం అంటూ పాజిటివ్ గా స్పందిస్తున్నారు.
ఇశ్వర్యా మేనన్ 2012లో తమిళ చిత్రంతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత తెలుగులో ‘స్పై’ సినిమాలో ‘వైష్ణవి’ అనే పాత్రలో కనిపించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆమె నటించిన ఇతర లాంగ్వేజ్ చిత్రాల్లో కొన్ని సినిమాలు బాగానే గుర్తింపు తెచ్చాయి. తెలుగులో ‘భజే వాయు వేగం’ అనే సినిమా ఒక హ్యాపీ రిజల్ట్ ఇచ్చింది.
తన సినీ ప్రస్థానంలో వేగంగా పైకి రావాలన్న తొందరకు బదులుగా, ఏ పాత్ర చేసినా గుర్తుండిపోయేలా చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది ఇశ్వర్యా. అందంతో పాటు అభినయ ప్రతిభను సమపాళ్లలో కొనసాగిస్తూ, అందం అంటే కేవలం మెరుగైన రూపమే కాకుండా, వ్యక్తిత్వంలోనూ ప్రతిబింబించాలని నిరూపిస్తోంది. ఇప్పటికే ఆమె ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతుండగా, ఇలాంటి ఫోటోషూట్లు ఆమెకు మరిన్ని అవకాశాలు తెస్తాయని చెప్పవచ్చు. మరి నెక్స్ట్ అమ్మడికి ఎలాంటి అవకాశాలు అందుతాయో చూడాలి.
This post was last modified on April 30, 2025 2:38 pm
తెలుగు సినిమా స్థాయి ఇంటర్నేషనల్ లెవెల్ కి చేరుకుందని ఒకవైపు మురిసిపోతూనే, ఇంకోవైపు చాలా విషయాల్లో ఆందోళన కలిగిస్తున్న పరిణామాలు…
చాన్నాళ్ల నుంచి భారతీయ ప్రేక్షకులు ఎదురు చూస్తున్న ప్రోమో రానే వచ్చింది. ఇండియాస్ బిగ్గెస్ట్ ఎపిక్స్లో ఒకటైన రామాయణం ఆధారంగా…
శ్రీకాకుళం జిల్లా వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును జైల్లో పరామర్శించేందుకు వెళ్లిన వైసీపీ అధినేత జగన్.. అప్పలరాజును…
రాష్ట్రంలో ఎవరి దయాదాక్షిణ్యాలపైనా తాను ముఖ్యమంత్రిని కాలేదని.. 4 కోట్ల మంది ఓటర్లు ఓటేసి తనను గెలిపించుకున్నారని.. వారి ఆశీర్వాదం,…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి... పాలిటిక్స్ తో పాటు ఇతరత్రా అంశాలపైనా ఓ రేంజి అవగాహన కలిగిన నేతగా…
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు ఆరవ్ యాక్సిడెంట్ చేయడంతో దానయ్య అనే గొర్రెల కాపరి మృతి చెందిన సంగతి…