నటీమణులలో ఈమధ్య పెద్దగా సక్సెస్ లు రాకపోయినా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ అందుకున్న వారిలో ఇశ్వర్యా మేనన్ ఒకరు. నటనతో పాటు తన అందచందాలతోనూ ఆకట్టుకుంటున్న ఈ భామ తాజాగా చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుపు రంగు దుస్తుల్లో ఆమె ఇచ్చిన పొజులు అభిమానుల మనసులను కొల్లగొడుతున్నాయి.
ఒకవైపు సొగసైన చూపులు.. మరోవైపు మినిమల్ మేకప్తో ఆమె ఇచ్చిన అభినయ హావభావాలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. క్లాస్ అందాన్ని చాటేలా ఆమె స్టైలింగ్, హెయిర్డిజైన్ ప్రతి ఫోటోలో ప్రత్యేకంగా కనిపిస్తోంది. వీటిని చూసిన నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. క్యూట్ హీరోయిన్ సొగసుల ఐశ్వర్యం అంటూ పాజిటివ్ గా స్పందిస్తున్నారు.
ఇశ్వర్యా మేనన్ 2012లో తమిళ చిత్రంతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత తెలుగులో ‘స్పై’ సినిమాలో ‘వైష్ణవి’ అనే పాత్రలో కనిపించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆమె నటించిన ఇతర లాంగ్వేజ్ చిత్రాల్లో కొన్ని సినిమాలు బాగానే గుర్తింపు తెచ్చాయి. తెలుగులో ‘భజే వాయు వేగం’ అనే సినిమా ఒక హ్యాపీ రిజల్ట్ ఇచ్చింది.
తన సినీ ప్రస్థానంలో వేగంగా పైకి రావాలన్న తొందరకు బదులుగా, ఏ పాత్ర చేసినా గుర్తుండిపోయేలా చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది ఇశ్వర్యా. అందంతో పాటు అభినయ ప్రతిభను సమపాళ్లలో కొనసాగిస్తూ, అందం అంటే కేవలం మెరుగైన రూపమే కాకుండా, వ్యక్తిత్వంలోనూ ప్రతిబింబించాలని నిరూపిస్తోంది. ఇప్పటికే ఆమె ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతుండగా, ఇలాంటి ఫోటోషూట్లు ఆమెకు మరిన్ని అవకాశాలు తెస్తాయని చెప్పవచ్చు. మరి నెక్స్ట్ అమ్మడికి ఎలాంటి అవకాశాలు అందుతాయో చూడాలి.
This post was last modified on April 30, 2025 2:38 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…