నటీమణులలో ఈమధ్య పెద్దగా సక్సెస్ లు రాకపోయినా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ అందుకున్న వారిలో ఇశ్వర్యా మేనన్ ఒకరు. నటనతో పాటు తన అందచందాలతోనూ ఆకట్టుకుంటున్న ఈ భామ తాజాగా చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుపు రంగు దుస్తుల్లో ఆమె ఇచ్చిన పొజులు అభిమానుల మనసులను కొల్లగొడుతున్నాయి.
ఒకవైపు సొగసైన చూపులు.. మరోవైపు మినిమల్ మేకప్తో ఆమె ఇచ్చిన అభినయ హావభావాలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. క్లాస్ అందాన్ని చాటేలా ఆమె స్టైలింగ్, హెయిర్డిజైన్ ప్రతి ఫోటోలో ప్రత్యేకంగా కనిపిస్తోంది. వీటిని చూసిన నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. క్యూట్ హీరోయిన్ సొగసుల ఐశ్వర్యం అంటూ పాజిటివ్ గా స్పందిస్తున్నారు.
ఇశ్వర్యా మేనన్ 2012లో తమిళ చిత్రంతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత తెలుగులో ‘స్పై’ సినిమాలో ‘వైష్ణవి’ అనే పాత్రలో కనిపించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆమె నటించిన ఇతర లాంగ్వేజ్ చిత్రాల్లో కొన్ని సినిమాలు బాగానే గుర్తింపు తెచ్చాయి. తెలుగులో ‘భజే వాయు వేగం’ అనే సినిమా ఒక హ్యాపీ రిజల్ట్ ఇచ్చింది.
తన సినీ ప్రస్థానంలో వేగంగా పైకి రావాలన్న తొందరకు బదులుగా, ఏ పాత్ర చేసినా గుర్తుండిపోయేలా చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది ఇశ్వర్యా. అందంతో పాటు అభినయ ప్రతిభను సమపాళ్లలో కొనసాగిస్తూ, అందం అంటే కేవలం మెరుగైన రూపమే కాకుండా, వ్యక్తిత్వంలోనూ ప్రతిబింబించాలని నిరూపిస్తోంది. ఇప్పటికే ఆమె ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతుండగా, ఇలాంటి ఫోటోషూట్లు ఆమెకు మరిన్ని అవకాశాలు తెస్తాయని చెప్పవచ్చు. మరి నెక్స్ట్ అమ్మడికి ఎలాంటి అవకాశాలు అందుతాయో చూడాలి.
This post was last modified on April 30, 2025 2:38 pm
అంశం ఏదైనా సరే.. కేంద్ర ప్రభుత్వం ఒకసారి డిసైడ్ అయితే.. తన అజెండాకు తగ్గట్లుగా పరిస్థితుల్ని మార్చేయటం కొత్తేం కాదు.…
వేసవి వచ్చిందంటే చాలు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంతా మామిడి పండ్ల కోసమే ఎదురుచూస్తారు. ఒకప్పుడు వేసవి సెలవుల్లో…
బీజేపీ, వైసీపీల మధ్య మైత్రి ఇంకెన్నటికీ చెక్కు చెదరదనే చెప్పాలి. ఎందుకంటే...బీజేపీ ఇప్పటిదాకా ప్రతిపాదించిన ప్రతి అంశానికి బేషరతుగా మద్దతు ప్రకటించిన వైసీపీ...తాజాగా నియోజకవర్గాల పునర్విభజనకు కూడా…
బీహార్లో బిజెపి ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరి…
వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్న జగన్.. పేదలకు పట్టెడన్నం కూడా పెట్టలేక పోయారని సీఎం చంద్రబాబు విమర్శించారు.…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు అదే అక్కసు ప్రదర్శిస్తున్నారు. రాజధానిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జగన్ ప్రతిపాదించిన…