తెలుగు చలనచిత్ర నటసింహం, టీడీపీ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఈ సోమవారానికి ఓ ప్రత్యేకత ఉంది. భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ అవార్డును బాలయ్య సోమవారం సాయంత్రం అందుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని బాలయ్య తన ఫ్యామిలీ పరివారంతో కలిసి సోమవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన పరివారంతో కలిసి అక్కడ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫొటోల్లో బాలయ్యను చూస్తే… ఆయన తండ్రి, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారకరామారావునే చూసినట్లుగా ఉంది. అనంతరం తన తండ్రి తరహా హావభావాలతో సాగి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి అవార్డును స్వీకరించారు.
పద్మ భూషణ్ పురస్కారాన్ని బాలయ్య అందుకునే… ఈ అరుదైన సన్నివేశాన్ని ప్రత్యక్ష్యంగా వీక్షించేందుకు బాలయ్య సోదరి, టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి, బాలయ్య సతీమణి వసుంధర, కుమారుడు మోక్షజ్ఞ తేజలతో పాటు పెద్ద కుమార్తె బ్రాహ్మణి, ఆమె భర్త, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్, వారి కుమారుడు, బాలయ్య మనవడు నారా దేవాన్ష్, చిన్న కుమార్తె తేజస్వినీ, ఆమె భర్త, విశాఖ ఎంపీ శ్రీభరత్ తదితరులు బాలయ్య వెంట రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు.
ఈ సందర్భంగా తీసుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ తర్వాత పద్మ భూషణ్ అవార్డును అందుకున్న దృశ్యాల వీడియో కూడా సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఈ ఫొటో, వీడియోలను చూసిన వారంతా… బాలయ్యను చూసినంతనే… రాష్ట్రపతి భవన్ కు సీనియర్ ఎన్టీఆర్ వచ్చారా? అంటూ ఆసక్తి వ్యక్తం చేశారు. అచ్చ తెలుగు పంచె కట్లులో బాలయ్య ఈ వేడుకకు హాజరు అయ్యారు. దీంతో పంచెకట్లులో ఆయనను చూసినంతనే జనానికి ఎన్టీఆరే గుర్తుకు వచ్చారు. ఒక్క హైట్ తప్పిస్తే.. బాలయ్య అచ్చు గుద్దినట్టుగా తన తండ్రి ఎన్టీఆర్ మాదిరే కనిపించి అందరికీ కనువిందు చేశారనే చెప్పాలి. నటనలో విశేష ప్రతిభ కనబరచినందుకు బాలయ్యను పద్మ భూషణ్ అవార్డుకు ఇటీవలే కేంద్రం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…