టాలీవుడ్ క్రైమ్ జానర్ లో తనదైన ముద్ర చూపించిన దర్శకుడు శైలేష్ కొలను. హిట్ 1 తక్కువ బడ్జెట్ తో విజయం సాధించి, హిట్ 2 కి అడివి శేష్ లాంటి క్రేజీ హీరో తోడై, ఇప్పుడు హిట్ 3కి ఏకంగా నానినే హీరోగా మారే దాకా దీని రేంజ్ అంతకంతా పెరుగుతూ పోయింది. శైలేష్ సినిమాటిక్ యునివర్స్ పేరుతో త్వరలోనే వీళ్లందరినీ కలిపేలా అవెంజర్స్ తరహా మూవీ ప్లానింగ్ లో ఉన్నాడు శైలేష్ కొలను. అయితే దీనికి చాలా టైం పడుతుంది కాబట్టి ఈలోగా వేరే ప్రాజెక్టుని ఓకే చేసుకునే పనిలో పడ్డాడు. ప్రస్తుతం నాని, శ్రీనిధి శెట్టి ప్రమోషన్లలో బిజీగా ఉండగా శైలేష్ హిట్ 3 చివరి దశ పనులు, ఫైనల్ కరెక్షన్లలో మునిగి తేలుతున్నాడు.
ఇదిలా ఉండగా నాగార్జునకు శైలేష్ కొలను ఒక స్టోరీ చెప్పినట్టు లేటెస్ట్ అప్డేట్. ఇంకా అధికారికంగా తెలియలేదు కానీ ఒక రౌండ్ చర్చలైతే జరిగాయట. కుబేర, కూలి క్యామియోల తర్వాత నాగార్జున ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తమిళ దర్శకులతో అనుకున్న ఒకటి రెండు ప్యాన్ ఇండియా మూవీస్ ని పెండింగ్ లో ఉంచారు. అయితే శైలేష్ చెప్పిన స్టోరీ లైన్ బాగా నచ్చడంతో ఫుల్ వెర్షన్ డెవలప్ చేసుకుని రమ్మని అడిగారట. సీనియర్ స్టార్లను హ్యాండిల్ చేయడంలో తడబడిన శైలేష్ కొలను వెంకటేష్ కు సైంధవ్ రూపంలో ఫ్లాప్ ఇచ్చాడు. అందుకే ఈ టాలెంటెడ్ డాక్టర్ కి హిట్ 3 సక్సెస్ చాలా కీలకం.
హిట్ 3 ఫలితం కూడా నాగ్ కాంబో కార్యరూపం దాల్చడానికి దోహదం చేయొచ్చు. నా సామిరంగా తర్వాత నాగార్జున దర్శనం జరగలేదు. ఈ ఏడాది రెండుసార్లు కనిపించబోతున్నప్పటికీ అవి స్పెషల్ రోల్స్ కావడంతో సోలోగా నాగ్ ని చూడాలని అభిమనులు ఎదురు చూస్తున్నారు. శైలేష్ ఆయనకు చెప్పిన కథ క్రైమ్ జానరేనట. బీహార్ లో సంచలనం సృష్టించిన ఒక హత్య చుట్టూ పవర్ ఫుల్ స్టోరీ రాసుకున్నారని తెలిసింది. కేవలం ఇన్వెస్టిగేషన్ కోణంలోనే కాకుండా పొలిటికల్, సోషల్ ఇష్యూస్ ని టచ్ చేయబోతున్నారని తెలిసింది. అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేదాకా నిర్ధారణగా చెప్పలేం కాబట్టి లెట్ వెయిట్ అండ్ సీ.
This post was last modified on April 27, 2025 6:31 pm
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…