టాలీవుడ్ క్రైమ్ జానర్ లో తనదైన ముద్ర చూపించిన దర్శకుడు శైలేష్ కొలను. హిట్ 1 తక్కువ బడ్జెట్ తో విజయం సాధించి, హిట్ 2 కి అడివి శేష్ లాంటి క్రేజీ హీరో తోడై, ఇప్పుడు హిట్ 3కి ఏకంగా నానినే హీరోగా మారే దాకా దీని రేంజ్ అంతకంతా పెరుగుతూ పోయింది. శైలేష్ సినిమాటిక్ యునివర్స్ పేరుతో త్వరలోనే వీళ్లందరినీ కలిపేలా అవెంజర్స్ తరహా మూవీ ప్లానింగ్ లో ఉన్నాడు శైలేష్ కొలను. అయితే దీనికి చాలా టైం పడుతుంది కాబట్టి ఈలోగా వేరే ప్రాజెక్టుని ఓకే చేసుకునే పనిలో పడ్డాడు. ప్రస్తుతం నాని, శ్రీనిధి శెట్టి ప్రమోషన్లలో బిజీగా ఉండగా శైలేష్ హిట్ 3 చివరి దశ పనులు, ఫైనల్ కరెక్షన్లలో మునిగి తేలుతున్నాడు.
ఇదిలా ఉండగా నాగార్జునకు శైలేష్ కొలను ఒక స్టోరీ చెప్పినట్టు లేటెస్ట్ అప్డేట్. ఇంకా అధికారికంగా తెలియలేదు కానీ ఒక రౌండ్ చర్చలైతే జరిగాయట. కుబేర, కూలి క్యామియోల తర్వాత నాగార్జున ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తమిళ దర్శకులతో అనుకున్న ఒకటి రెండు ప్యాన్ ఇండియా మూవీస్ ని పెండింగ్ లో ఉంచారు. అయితే శైలేష్ చెప్పిన స్టోరీ లైన్ బాగా నచ్చడంతో ఫుల్ వెర్షన్ డెవలప్ చేసుకుని రమ్మని అడిగారట. సీనియర్ స్టార్లను హ్యాండిల్ చేయడంలో తడబడిన శైలేష్ కొలను వెంకటేష్ కు సైంధవ్ రూపంలో ఫ్లాప్ ఇచ్చాడు. అందుకే ఈ టాలెంటెడ్ డాక్టర్ కి హిట్ 3 సక్సెస్ చాలా కీలకం.
హిట్ 3 ఫలితం కూడా నాగ్ కాంబో కార్యరూపం దాల్చడానికి దోహదం చేయొచ్చు. నా సామిరంగా తర్వాత నాగార్జున దర్శనం జరగలేదు. ఈ ఏడాది రెండుసార్లు కనిపించబోతున్నప్పటికీ అవి స్పెషల్ రోల్స్ కావడంతో సోలోగా నాగ్ ని చూడాలని అభిమనులు ఎదురు చూస్తున్నారు. శైలేష్ ఆయనకు చెప్పిన కథ క్రైమ్ జానరేనట. బీహార్ లో సంచలనం సృష్టించిన ఒక హత్య చుట్టూ పవర్ ఫుల్ స్టోరీ రాసుకున్నారని తెలిసింది. కేవలం ఇన్వెస్టిగేషన్ కోణంలోనే కాకుండా పొలిటికల్, సోషల్ ఇష్యూస్ ని టచ్ చేయబోతున్నారని తెలిసింది. అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేదాకా నిర్ధారణగా చెప్పలేం కాబట్టి లెట్ వెయిట్ అండ్ సీ.
This post was last modified on April 27, 2025 6:31 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…