టాలీవుడ్ క్రైమ్ జానర్ లో తనదైన ముద్ర చూపించిన దర్శకుడు శైలేష్ కొలను. హిట్ 1 తక్కువ బడ్జెట్ తో విజయం సాధించి, హిట్ 2 కి అడివి శేష్ లాంటి క్రేజీ హీరో తోడై, ఇప్పుడు హిట్ 3కి ఏకంగా నానినే హీరోగా మారే దాకా దీని రేంజ్ అంతకంతా పెరుగుతూ పోయింది. శైలేష్ సినిమాటిక్ యునివర్స్ పేరుతో త్వరలోనే వీళ్లందరినీ కలిపేలా అవెంజర్స్ తరహా మూవీ ప్లానింగ్ లో ఉన్నాడు శైలేష్ కొలను. అయితే దీనికి చాలా టైం పడుతుంది కాబట్టి ఈలోగా వేరే ప్రాజెక్టుని ఓకే చేసుకునే పనిలో పడ్డాడు. ప్రస్తుతం నాని, శ్రీనిధి శెట్టి ప్రమోషన్లలో బిజీగా ఉండగా శైలేష్ హిట్ 3 చివరి దశ పనులు, ఫైనల్ కరెక్షన్లలో మునిగి తేలుతున్నాడు.
ఇదిలా ఉండగా నాగార్జునకు శైలేష్ కొలను ఒక స్టోరీ చెప్పినట్టు లేటెస్ట్ అప్డేట్. ఇంకా అధికారికంగా తెలియలేదు కానీ ఒక రౌండ్ చర్చలైతే జరిగాయట. కుబేర, కూలి క్యామియోల తర్వాత నాగార్జున ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తమిళ దర్శకులతో అనుకున్న ఒకటి రెండు ప్యాన్ ఇండియా మూవీస్ ని పెండింగ్ లో ఉంచారు. అయితే శైలేష్ చెప్పిన స్టోరీ లైన్ బాగా నచ్చడంతో ఫుల్ వెర్షన్ డెవలప్ చేసుకుని రమ్మని అడిగారట. సీనియర్ స్టార్లను హ్యాండిల్ చేయడంలో తడబడిన శైలేష్ కొలను వెంకటేష్ కు సైంధవ్ రూపంలో ఫ్లాప్ ఇచ్చాడు. అందుకే ఈ టాలెంటెడ్ డాక్టర్ కి హిట్ 3 సక్సెస్ చాలా కీలకం.
హిట్ 3 ఫలితం కూడా నాగ్ కాంబో కార్యరూపం దాల్చడానికి దోహదం చేయొచ్చు. నా సామిరంగా తర్వాత నాగార్జున దర్శనం జరగలేదు. ఈ ఏడాది రెండుసార్లు కనిపించబోతున్నప్పటికీ అవి స్పెషల్ రోల్స్ కావడంతో సోలోగా నాగ్ ని చూడాలని అభిమనులు ఎదురు చూస్తున్నారు. శైలేష్ ఆయనకు చెప్పిన కథ క్రైమ్ జానరేనట. బీహార్ లో సంచలనం సృష్టించిన ఒక హత్య చుట్టూ పవర్ ఫుల్ స్టోరీ రాసుకున్నారని తెలిసింది. కేవలం ఇన్వెస్టిగేషన్ కోణంలోనే కాకుండా పొలిటికల్, సోషల్ ఇష్యూస్ ని టచ్ చేయబోతున్నారని తెలిసింది. అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేదాకా నిర్ధారణగా చెప్పలేం కాబట్టి లెట్ వెయిట్ అండ్ సీ.
This post was last modified on April 27, 2025 6:31 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…