ఛత్రపతి హిందీ రీమేక్ కోసం బోలెడు సమయాన్ని ముంబైలో వృథా చేసుకుని వచ్చిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ రాగానే వరసబెట్టి సినిమాలు చేయడం చూస్తున్నాం. ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు భారీ చిత్రాలు టైటిల్స్ తో సహా సిద్ధమయ్యే దిశగా వెళ్లడం ఫ్యాన్స్ కి ఆనందం కలిగిస్తోంది. కానీ దేనికీ విడుదల తేదీలు ఖరారు కాకపోవడం ఆందోళన కలిగించే విషయం. ముందుగా ‘భైరవం’ సంగతి చూస్తే డిసెంబర్ నుంచి వాయిదాల పర్వంలోనే ఉంది. ఇప్పుడైనా కొత్త డేట్ చెబుతారా అంటే ఆ సూచనలు కనిపించడం లేదు. కన్నప్పకు పోటీగా దింపాలని మంచు మనోజ్ ఒత్తిడి చేస్తున్న టాక్ ఫిలిం నగర్ వర్గాల్లో ఉంది.
ఏళ్ళ తరబడి నిర్మాణంలో ఉన్న ‘టైసన్ నాయుడు’ ఇంకా అడ్డంకులు ఎదురుకుంటూనే ఉంది. టీజర్ వచ్చి ఏడాది దాటింది. ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. ఇప్పుడు ప్రొడక్షన్ లో ఉన్న ‘కిష్కిందపురి’ ఫస్ట్ లుక్ వచ్చేసింది. అంతకు ముందే ‘హైందవ’ అనౌన్స్ మెంట్ టీజర్ ని వదిలారు. ఇప్పుడీ నాలుగింట్లో రెండు ఫాంటసీ టచ్ ఉన్న ప్యాన్ ఇండియా మూవీస్ కావడం గమనార్హం. ఒక్క సినిమా సెట్ మీద పెట్టడానికే మీడియం రేంజ్ హీరోలు సైతం కిందా మీద పడుతున్న తరుణంలో సాయి శ్రీనివాస్ ఇంత స్పీడ్ గా ఉండటం మెచ్చుకోవాల్సిన విషయమే. కాకపోతే రిలీజ్ ప్లానింగ్ తేడా కొట్టడం గమనించుకోవాలి.
ముందైతే భైరవం, టైసన్ నాయుడుల వ్యవహారం తేల్చాలి. ప్రేక్షకులకు కనెక్టివిటీ క్రమం తప్పకుండా ఉండాలంటే రెగ్యులర్ గా సినిమాలు వస్తూ ఉండాలి. సాయి శ్రీనివాస్ కు మాస్ లో మార్కెట్ ఉంది కానీ మరీ టయర్ 2 స్థాయిలో అయితే కాదు. ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ ఇంకా తన కెరీర్ లో పడలేదు. రాక్షసుడు ఆడినా కానీ అది పూర్తిగా కంటెంట్ మీద ఆధారపడింది. హీరో పరంగా ఇమేజ్, నటన రెండూ పెద్దగా దోహదపడింది కాదు. తమ్ముడు బెల్లంకొండ గణేష్ సైతం మొదటి రెండు అడుగులు ఫ్లాపులు చూసి మూడోది నెమ్మదిగా వేస్తున్నాడు. వీలైనంత త్వరగా సాయి శ్రీనివాస్ ఏదో ఒక సినిమాతో థియేటర్లకు వచ్చేయాలి.
This post was last modified on April 27, 2025 3:00 pm
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…