Movie News

కొత్త సినిమా రిలీజ్.. మినిమం బజ్ లేదే


ఎంత ఓటీటీ కాలమైనా సరే.. కొత్త సినిమా రిలీజవుతుంటే సోషల్ మీడియాలో ఎంతో కొంత డిస్కషన్ ఉంటుంది. ప్రమోషన్ హడావుడి ఉంటుంది. కానీ ‘మిస్ ఇండియా’ సినిమా విషయంలో అలాంటిదేమీ కనిపించడం లేదు. ఈ సినిమా ఇంకొక్క రోజులో విడుదలవుతున్న సంగతే జనాలకు తెలియడం లేదు. అసలు ముందు ఈ సినిమా పబ్లిసిటీకి దూరంగానే ఉంది. దీనికి ముందు కీర్తి నటించిన ‘పెంగ్విన్’ అప్పట్లో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

లాక్ డౌన్ టైంలో ముందుగా ఓటీటీల్లో రిలీజైన సినిమాల్లో ఒకటి కావడంతో దీనికి హైప్ బాగానే వచ్చింది. కీర్తి నటించిన మరో సినిమా ‘గుడ్ లక్ సఖి’ కూడా అప్పుడప్పుడూ వార్తల్లో నిలుస్తూనే వచ్చింది. కానీ ‘మిస్ ఇండియా’ గురించి చప్పుడే లేదు. ఐతే వారం కిందట ఉన్నట్లుండి ట్రైలర్ రిలీజ్ చేశారు. అందులోనే రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. నెట్‌ఫ్లిక్స్‌లో నవంబరు 4న సినిమా రిలీజ్.

అంటే మంగళవారం అర్ధరాత్రి నుంచే ‘మిస్ ఇండియా’ స్ట్రీమ్ కాబోతోంది. కానీ ఈ సంగతే జనాలకు తెలియనట్లుగా ఉంది సోషల్ మీడియా వ్యవహారం చూస్తే. బయట చిన్న స్థాయిలో అయినా సరే ప్రి రిలీజ్ ఈవెంట్, ప్రెస్ మీట్లు లాంటివి లేవు. సోషల్ మీడియాలోనూ ప్రచారం లేదు. కొత్త సినిమాలు మామూలుగా శుక్రవారం రిలీజవుతాయి కానీ.. ఈ చిత్రాన్ని బుధవారమే విడుదల చేస్తుండటం కూడా జనాలకు విషయం తెలియకపోవడానికి ఒక కారణం కావచ్చు.

అసలు నెట్ ఫ్లిక్స్‌లో రిలీజైన సినిమాలన్నింటి పరిస్థితి ఇలాగే ఉంటోంది. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ను ఉన్నట్లుండి చడీచప్పుడు లేకుండా దించేశారు. అసలు ప్రకటన కూడా లేదు. ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ విషయంలోనూ ఇలాగే జరిగింది. ఐతే రిలీజ్ ముంగిట పబ్లిసిటీ లేకపోయినా ఆ సినిమాలకు మంచి స్పందనే వచ్చిన నేపథ్యంలో దాన్ని సెంటిమెంటుగా భావిస్తున్నారో లేక కంటెంట్ మీద నమ్మకమో కానీ.. ‘మిస్ ఇండియా’ అయితే మినిమం బజ్ లేకుండా రిలీజవుతోంది.

This post was last modified on November 3, 2020 4:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

3 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

5 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

8 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

9 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

10 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

10 hours ago