కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన బింబిసార వచ్చి మూడేళ్లు దాటింది. ఆ తర్వాత మరో హిట్టు పడలేదు. అమిగోస్, డెవిల్ తీవ్రంగా నిరాశపరిచాయి. అయినా సరే బింబిసార సీక్వెల్ ని తీయడానికి సిద్ధపడిన కళ్యాణ్ రామ్ మొదటి భాగం దర్శకుడు వసిష్ఠ విశ్వంభరకు లాకైపోవడంతో పార్ట్ 2ని రొమాంటిక్ ఫేమ్ అనిల్ పాడూరికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అనౌన్స్ మెంట్ స్టేజి దాకా వచ్చిన ఈ ప్యాన్ ఇండియా ప్రాజెక్టు ఆ తర్వాత కదలిక లేకుండా ఆగిపోయింది. బడ్జెట్ చాలా ఎక్కువ డిమాండ్ చేయడంతో అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఖచ్చితంగా హిట్టవుతుందనే నమ్మకంతో కళ్యాణ్ రామ్ దాన్ని పెండింగ్ లో ఉంచాడు.
తీరా చూస్తే అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఫలితం నిరాశ కలిగించే దిశగా వెళ్తోంది. నాలుగైదు రోజులకు బ్రేక్ ఈవెన్ అయిపోతుందని కళ్యాణ్ రామ్ అన్న మాటలు నిజమయ్యే సూచనలు కనిపించడం లేదు. యాభై శాతం రికవరీకే కష్టపడుతున్న వైనం చూసి నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ నాలుగు రోజుల నుంచి సోషల్ మీడియా ప్రచారం ఆపేసింది. స్వయంగా తను కూడా నిర్మాణంలో పార్ట్ నర్ కావడంతో నష్టాల బరువు కళ్యాణ్ రామ్ మీద పడనుంది. తద్వారా బింబిసార 2 మీద ఎక్కువ పెట్టుబడి చేయలేని పరిస్థితి నెలకొందని ఇన్ సైడ్ టాక్. ఈ కారణంగానే సీక్వెల్ ని పక్కనపెట్టి మరో సినిమా చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ఆదిత్య వర్మ, వైష్ణవ్ తేజ్ రంగ రంగ వైభవంగా తీసిన దర్శకుడు గిరిసాయ చెప్పిన కథ నచ్చడంతో ముందు దాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. అర్జున్ మీద నమ్మకం ఈ స్థాయిలో ఆవిరవ్వడం కళ్యాణ్ రామ్ ఊహించలేదు. రొటీన్ కమర్షియల్ టెంప్లేట్ కు మదర్ సెంటిమెంట్ తోడై ఖచ్చితంగా విజయం సాధిస్తుందనుకున్నాడు కానీ విజయశాంతి పాత్ర, షాక్ అనుకున్న క్లైమాక్స్ మిగిలిన బలహీనతలకు కాపాడలేకపోయాయి. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు నిర్మాణ భాగస్వామిగా ఉన్న కళ్యాణ్ రామ్ దాంతో పాటు తన కొత్త సినిమా పనులు చూసుకుంటున్నాడు.
This post was last modified on April 25, 2025 10:53 am
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…