కొద్దిరోజుల క్రితం చెన్నైలో జరిగిన రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో సూర్య తండ్రి శివకుమార్ మాట్లాడుతూ కోలీవుడ్ లో మొదటి సిక్స్ ప్యాక్ తన బిడ్డే చేశాడని, అంతకు ముందు ఎవరూ చేయలేదని కాస్తంత ఎమోషనల్ గా కొడుకు గొప్పదనం గురించి చెప్పుకొచ్చారు. దీనికి అభిమానుల నుంచి భారీ స్పందన దక్కింది. ఇదే ప్రసంగంలో తమిళంలో ఇంతకు ముందు ఆరు పలకల దేహం ఎవరు చేయలేదని, ఉంటే చెప్పమని శివ కుమార్ యాంకర్లను ప్రశ్నించడం వైరలయ్యింది. అందరూ నిజమే కదా అంతకు ముందు ఎవరూ చేయలేదేమో, సూర్యనే శ్రీకారం చుట్టాడేమో అనుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడీ టాపిక్ పంచాయితీగా మారింది.
నిజానికి శివకుమార్ చెప్పిన ఉదాహరణ వారణమ్ ఆయిరం (సూర్య సన్నాఫ్ కృష్ణన్) గురించి. ఇది 2008 నవంబర్ లో విడుదలయ్యింది. దీనికన్నా రెండు నెలల ముందు ఆగస్ట్ లో రిలీజైన సత్యం (సెల్యూట్) లో విశాల్ సిక్స్ ప్యాక్ తో కనిపించాడు. అప్పట్లో ఆ స్టిల్స్ బాగా తిరిగాయి. అయితే వీళ్ళ కన్నా ముందు 2007 పొల్లాదవన్ (తెలుగు రీమేక్ కుర్రాడు) లో ధనుష్ మొదటిసారి సిక్స్ ప్యాక్ చేసి సంచలనం సృష్టించాడు. ఇదంతా ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో విశాల్ చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులు మా హీరో ముందంటే మా హీరో ముందంటూ ఈ ఆరు పలకల క్రెడిట్ కోసం ఆన్ లైన్లో కొట్టేసుకుంటున్నారు.
సోషల్ మీడియా ఎంత అలెర్ట్ గా ఉంటుందో చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ అక్కర్లేదేమో. శివకుమార్ ఏదో యథాలాపంగా అన్న మాటను పట్టుకుని దాన్ని సూర్య ఫ్యాన్స్ వైరల్ చేస్తే, అది విశాల్ దాకా చేరిపోయి, ఎవరు ముందు చేశారనేది గుర్తించి, తనదే ఫస్ట్ రిలీజైన సంగతిని ప్రత్యేకంగా పంచుకునే దాకా వెళ్ళింది. మన టాలీవుడ్ లో అంతకు ముందే అల్లు అర్జున్, నితిన్ తదితరులు ఈ ఫీట్ సాధించి కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు. తర్వాత దాదాపు అందరూ ఫాలో అయినవాళ్లే. ఇప్పుడంటే దీని మీద క్రేజ్ తగ్గిపోయింది కానీ ఒకప్పుడు యూత్ లో సిక్స్ ప్యాక్ అంటే పిచ్చ క్రేజ్ ఉంది. జిమ్ లో ప్యాకేజీలు ఉండేవి.
This post was last modified on April 25, 2025 10:29 am
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…