ప్రతి అన్నం మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందని పెద్దలు ఊరికే అనలేదు. ఇది సినిమా పరిశ్రమకు కూడా వర్తిస్తుంది. బాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ గ్రాండియర్ గా తెరకెక్కుతున్న రామాయణలో సీతగా సాయిపల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పాత్ర కోసం కెజిఎఫ్, హిట్ 3 భామ శ్రీనిధి శెట్టి కూడా ఆడిషన్ కు వెళ్ళింది. రెండు మూడు సీన్లను ప్రాక్టీస్ చేసి మరీ అందులో పాల్గొంది. తనతో పాటు అలియా భట్ ని సైతం పరిశీలించారు. కానీ చివరికది సాయిపల్లవిని వరించింది. అందం కన్నా పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే క్యారెక్టర్ కావడంతో దర్శకుడు నితేశ్ తివారి తెలివైన నిర్ణయం తీసుకున్నారు.
ఇదంతా కెజిఎఫ్ 2 విడుదల టైంలో జరిగింది. రావణుడిగా యష్ చేయొచ్చనే విషయం శ్రీనిధికి అప్పుడే తెలిసింది. ఒకవేళ రామాయణ కనక తనను వరిస్తే కెజిఎఫ్ జంట ఇప్పుడు శత్రువుల్లా నటించాల్సి వస్తుందని ఊహించుకుని ఆనందపడింది. కానీ బ్యాడ్ లక్ అవకాశం వేరొకరికి వెళ్ళిపోయింది. ఇదంతా ఒక హిందీ ఇంటర్వ్యూలో శ్రీనిధి చెప్పింది. ఇండస్ట్రీ హిట్ కొట్టిన కెజిఎఫ్ తర్వాత శ్రీనిధి శెట్టి కెరీర్ ఆశించినంత వేగంగా వెళ్లడం లేదు. నానితో జట్టు కట్టిన హిట్ 3 ది థర్డ్ కేస్ తో పాటు సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా పెద్ద బ్రేక్ ఇస్తుందనే నమ్మకంతో ఉంది. దానికి తగ్గట్టే ప్రమోషన్లలో హుషారుగా పాల్గొంటోంది.
నానితో పాటే ఉంటూ ముంబై నుంచి కోచి దాకా పబ్లిసిటీలో భాగమవుతున్న శ్రీనిధి శెట్టికి హిట్ 3 సక్సెస్ కావడం చాలా కీలకం. అమ్మడి హుషారు చూస్తుంటే ప్రాధాన్యం బాగానే ఇచ్చినట్టు ఉన్నారు. కథలో ముఖ్యమైన ట్విస్టుకి ఆమె క్యారెక్టరే కీలకమని యూనిట్ టాక్. ఆ ఎపిసోడ్ చుట్టే మొత్తం స్టోరీ నడుస్తుందని అంటున్నారు. ట్రైలర్ తప్ప ఇంకెలాంటి వీడియో కంటెంట్ వదలకుండా హిట్ 3 జాగ్రత్తలు తీసుకుని కథకు గురించి ఎక్కువ చర్చ జరగకుండా తెలివిగా వ్యవహరిస్తోంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లో ఒక ప్రధాన భాగం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం పెహల్గామ్ లో తీశారు.
This post was last modified on July 7, 2025 11:20 pm
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…