యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఒకప్పుడు తెరను ఏలిన రాజశేఖర్ చాలా ఏళ్లుగా ట్రాక్ తప్పేశారు. తన సమకాలీకులైన సీనియర్ హీరోల్లో కొందరు ఇంకా రాణిస్తుండగా మరికొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయి సెకండ్ ఇన్నింగ్స్ ని బ్రహ్మాండంగా నడిపిస్తున్నారు. జగపతిబాబు, శ్రీకాంత్ లాంటివాళ్లను ఉదాహరణగా తీసుకోవచ్చు. కానీ రాజశేఖర్ రెండింట్లోనూ ఇమడలేకపోతున్నారు. ఆ మధ్య నితిన్ ఎక్స్ ట్రాడినరి మ్యాన్ లో స్పెషల్ రోల్ చేశారు కానీ అది డిజాస్టర్ కావడంతో ఆయన ఉన్న సంగతే ఎవరికీ గుర్తు లేకుండా పోయింది. అంతకు ముందు మళయాలం జోసెఫ్ రీమేక్ శేఖర్ బాక్సాఫీస్ వద్ద దారుణంగా దెబ్బ కొట్టింది.
ఇదే కాదు తమిళ బ్లాక్ బస్టర్ సూదు కవ్వంని కోరిమరీ గడ్డం గ్యాంగ్ గా రీమేక్ చేసుకుంటే థియేటర్ రన్ తర్వాత కనీసం ఓటిటి, శాటిలైట్ అమ్మకలకు సైతం నోచుకోలేకపోయింది. అంతకు ముందు మహంకాళి, మా అన్నయ్య బంగారం, నా స్టైలే వేరు అన్నీ ఫ్లాపే. 2017 లో వచ్చిన పిఎస్వి గరుడవేగ ఒక్కటే కమర్షియల్ గా ఊరట కలిగించిన సూపర్ హిట్. ఇదంతా జరిగి తొమ్మిదేళ్లు గడిచిపోయాయి. రాజశేఖర్ మళ్ళీ కంబ్యాక్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. శర్వానంద్ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నారనే టాక్ ఉంది కానీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉండగా ఆయన మరో రీమేక్ కొన్నారట.
గత ఏడాది తమిళంలో మంచి హిట్టు అందుకున్న లబ్బర్ పందుని తెలుగులో తీసే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిసింది. ఇందులో వయసు మళ్ళిన ఒక తండ్రికి, అల్లుడు కావాలనుకున్న ఒక కుర్రాడికి మధ్య క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా జరుగుతుంది. పల్లెటూరి నేపథ్యంలో రూపొందిన ఈ స్పోర్ట్స్ డ్రామకు పెద్ద బడ్జెట్ అక్కర్లేదు. ఎమోషన్, ఎంటర్ టైన్మెంట్, లవ్ స్టోరీ ఇలా అన్ని పుష్కలంగా ఉంటాయి. కాకపోతే మన నేటివిటీకి సూటవ్వడం గురించే అనుమానం లేకపోలేదు. తెలుగు ఆడియోతో సహా ఇది ఓటిటిలో అందుబాటులో ఉంది. మరి రాజశేఖర్ అంతా తెలిసి రిస్క్ కి సిద్ధపడటం చూస్తే కంటెంట్ మీద ఓ రేంజ్ నమ్మకమున్నట్టే.
This post was last modified on April 24, 2025 10:27 am
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ…
ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేతికి వెళ్లడం సినీ పరిశ్రమలో కామన్ వ్యవహారం. ఇలా మిస్ అయిన…
ఇరవై ఏడు సంవత్సరాల క్రితం వచ్చిన దేవి సినిమాకు టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అమ్మోరు లాంటి…
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై అదే పార్టీ నుంచి ఎంపీగా విజయం దక్కించుకుని.. ప్రస్తుతం…
తాము నిర్మించే సినిమాలు ఎంత నష్టం తెచ్చిపెట్టినా… తమను ఎంతగా కుదేలు చేసినా.. వాటి గురించి ఓపెన్ అవ్వడానికి నిర్మాతలు…
వైసీపీలో మరోసారి సజ్జల రామకృష్ణారెడ్డి శకం ప్రారంభం అవుతుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్..…