‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో గాడిన పడ్డట్లే పడి.. ఆ తర్వాత ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రాలతో ఎదురు దెబ్బలు తిన్నాడు సీనియర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. మామూలుగా చివరి చిత్రం ఫలితం ఎలా ఉన్నా.. వెంటనే తర్వాతి చిత్రాన్ని మొదలుపెట్టేస్తుంటాడు పూరి. కానీ ఈసారి మాత్రం ఇబ్బంది తప్పలేదు. టాలీవుడ్ స్టార్లలో ఎవ్వరూ ఆయనతో సినిమా చేయడానికి రెడీగా లేని పరిస్థితి. నిర్మాత దొరకడమూ కష్టమైంది. ఐతే విజయ్ సేతుపతి లాంటి విలక్షణ నటుడికి కథ చెప్పి మెప్పించడంతో పూరి మళ్లీ ప్రేక్షకులతో పాటు నిర్మాతల దృష్టిని కూడా ఆకర్షించగలిగాడు. ఈ కలయికలో త్వరలోనే సినిమా సెట్స్ మీదికి వెళ్లబోతోంది.
టబు, రాధికా ఆప్టే లాంటి ఆర్టిస్టులు ఈ ప్రాజెక్టులోకి రావడంతో క్రేజ్ ఇంకా పెరిగింది. మరోవైపు సినిమాలో అత్యంత కీలకమైన విలన్ పాత్ర కోసం సరైన నటుడిని ఎంచుకోవాలని చూస్తున్నాడు పూరి. అందుకోసం ఆయన ఫస్ట్ ఛాయిస్ ఫాహద్ ఫాజిల్ అట. అతడికి పూరి కథ కూడా చెప్పాడు. అతడికి నచ్చిందని సమాచారం. కానీ సౌత్ ఇండియాలో బిజీయెస్ట్ యాక్టర్లలో ఒకడైన ఫాహద్.. ఈ సినిమాకు డేట్లు సర్దుబాటు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడట.
ఇంతకుముందు సేతుపతి, ఫాహద్ కలిసి ‘విక్రమ్’లో నటించారు. ఈ కాంబో బాగా వర్కవుట్ అయింది. అందులో సేతుపతి విలన్గా చేశాడు. ఫాహద్ది సహాయ పాత్ర. కానీ ఈసారి అతను హీరోగా నటిస్తే.. ఫాహద్ విలన్ పాత్ర చేయాల్సి ఉంది. ఈ కలయిక మరింత ఆసక్తిని రేకెత్తిస్తుందనడంలో సందేహం లేదు. ఐతే పూరి ఎవరి కోసం ఎక్కువ రోజులు ఎదురు చూసే రకం కాదు. అందుకోసం ప్రత్యామ్నాయాలు కూడా చూసి పెట్టుకున్నాడు. ‘యానిమల్’తో వెలుగులోకి వచ్చి ‘పుష్ప-2’లోనూ నటించిన సౌరభ్ సచ్దేవా పేరునూ పరిశీలిస్తున్నాడు. కానీ ఫాహద్ చేస్తే ఈ సినిమా క్రేజే వేరుగా ఉంటుంది. మరి అతను డేట్లు సర్దుబాటు చేస్తాడా లేదా అన్నదే చూడాలి.
పెద్ది ఇప్పుడు రామ్ చరణ్ కెరీర్లో మరో చాలెంజ్ లాంటి ప్రాజెక్టు. RRR తర్వాత వచ్చిన గ్లోబల్ ఇమేజ్ని నిలబెట్టుకోవాలి.…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా సినిమా అయినా దాన్ని జనంలోకి తీసుకెళ్లాలంటే ప్రచారం తప్పనిసరి. కంటెంట్ ఉంటే చాలు ఇంకేం…
టాలీవుడ్ టాప్ హీరోలు వేగంగా సినిమాలు చేయాలని, ఏడాదికి ఒకట్రెండు రిలీజ్లు ఉండేలా చూసుకోవాలని ఇటు ఇండస్ట్రీ జనాలు, అటు…
ఒకప్పుడు యాక్షన్ కింగ్ గా మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో అర్జున్. తెలుగులో మా పల్లెలో గోపాలుడు లాంటి…
రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ ఐపీఎల్ సీజన్ను పూర్తిగా తన సొంతం…
ఐపీఎల్ ఫైనల్స్ లో ఆర్సీబీ వరుసగా రెండోసారి కప్పు గెలవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ ఆ…