‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో గాడిన పడ్డట్లే పడి.. ఆ తర్వాత ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రాలతో ఎదురు దెబ్బలు తిన్నాడు సీనియర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. మామూలుగా చివరి చిత్రం ఫలితం ఎలా ఉన్నా.. వెంటనే తర్వాతి చిత్రాన్ని మొదలుపెట్టేస్తుంటాడు పూరి. కానీ ఈసారి మాత్రం ఇబ్బంది తప్పలేదు. టాలీవుడ్ స్టార్లలో ఎవ్వరూ ఆయనతో సినిమా చేయడానికి రెడీగా లేని పరిస్థితి. నిర్మాత దొరకడమూ కష్టమైంది. ఐతే విజయ్ సేతుపతి లాంటి విలక్షణ నటుడికి కథ చెప్పి మెప్పించడంతో పూరి మళ్లీ ప్రేక్షకులతో పాటు నిర్మాతల దృష్టిని కూడా ఆకర్షించగలిగాడు. ఈ కలయికలో త్వరలోనే సినిమా సెట్స్ మీదికి వెళ్లబోతోంది.
టబు, రాధికా ఆప్టే లాంటి ఆర్టిస్టులు ఈ ప్రాజెక్టులోకి రావడంతో క్రేజ్ ఇంకా పెరిగింది. మరోవైపు సినిమాలో అత్యంత కీలకమైన విలన్ పాత్ర కోసం సరైన నటుడిని ఎంచుకోవాలని చూస్తున్నాడు పూరి. అందుకోసం ఆయన ఫస్ట్ ఛాయిస్ ఫాహద్ ఫాజిల్ అట. అతడికి పూరి కథ కూడా చెప్పాడు. అతడికి నచ్చిందని సమాచారం. కానీ సౌత్ ఇండియాలో బిజీయెస్ట్ యాక్టర్లలో ఒకడైన ఫాహద్.. ఈ సినిమాకు డేట్లు సర్దుబాటు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడట.
ఇంతకుముందు సేతుపతి, ఫాహద్ కలిసి ‘విక్రమ్’లో నటించారు. ఈ కాంబో బాగా వర్కవుట్ అయింది. అందులో సేతుపతి విలన్గా చేశాడు. ఫాహద్ది సహాయ పాత్ర. కానీ ఈసారి అతను హీరోగా నటిస్తే.. ఫాహద్ విలన్ పాత్ర చేయాల్సి ఉంది. ఈ కలయిక మరింత ఆసక్తిని రేకెత్తిస్తుందనడంలో సందేహం లేదు. ఐతే పూరి ఎవరి కోసం ఎక్కువ రోజులు ఎదురు చూసే రకం కాదు. అందుకోసం ప్రత్యామ్నాయాలు కూడా చూసి పెట్టుకున్నాడు. ‘యానిమల్’తో వెలుగులోకి వచ్చి ‘పుష్ప-2’లోనూ నటించిన సౌరభ్ సచ్దేవా పేరునూ పరిశీలిస్తున్నాడు. కానీ ఫాహద్ చేస్తే ఈ సినిమా క్రేజే వేరుగా ఉంటుంది. మరి అతను డేట్లు సర్దుబాటు చేస్తాడా లేదా అన్నదే చూడాలి.
This post was last modified on April 23, 2025 2:28 pm
కియారా అద్వానీ.. బాలీవుడ్, తెలుగు సినిమాల్లో ప్రముఖ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్న విషయం తెలిసిందే. ఫగ్లీ…
ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్లేఆఫ్స్ రేసు రోజురోజుకూ ఉత్కంఠగా మారుతోంది. సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై…
డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారులను స్వదేశాలకు తిరిగి పంపే ప్రక్రియను వేగవంతం చేయడానికి కొత్త విధానాన్ని…
మే నెల వచ్చిందంటే నందమూరి అభిమానుల ఉత్సాహం మామూలుగా ఉండదు. లెజెండరీ నటుడు సీనియర్ ఎన్టీఆరే కాక ఆయన మనవడు జూనియర్…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ ఇప్పుడప్పుడే కోలుకునేలా కనిపించడం లేదనే చెప్పాలి. అప్పటిదాకా 151 సీట్లతో…
భారత్-పాకిస్థాన్ ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఏ క్షణమైనా యుద్ధానికి దారితీయొచ్చని రక్షణ రంగ నిపుణులు చెబుతు న్న సమయంలో…