పుష్ప విలన్ గా మనకు బాగా దగ్గరైన మలయాళ హీరో ఫాహద్ ఫాసిల్ తో బాహుబలి నిర్మాతలు ఆర్కా మీడియా గత ఏడాది మార్చిలో రెండు సినిమాలు ప్రకటించారు. అవి ఆక్సీజెన్, డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. వీటికి ఎస్ఎస్ రాజమౌళి సమర్పకులుగా వ్యహరిస్తారని పేర్కొన్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా వదిలారు. ఇదంతా జరిగి సంవత్సరం గడిచిపోయింది. రెండు మూడు సార్లు ట్రబుల్ కోసం క్యాస్టింగ్ కాల్ ప్రకటనలు ఇచ్చారు తప్పించి ఆ తర్వాత ఎలాంటి కదలిక లేదు. ఇదంతా ఆవేశం రిలీజ్ ముందు జరిగిన వ్యవహారం. ఇవి నిజంగా జరుగుతున్నాయా లేదానే అనుమానాలు మల్లువుడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
అక్కడి మీడియా కథనాల ప్రకారం ఈ రెండు ప్యాన్ ఇండియా మూవీస్ ప్రస్తుతం హోల్డ్ లో ఉన్నాయి. షూటింగ్ కు వెళ్ళడానికి ముందే పూర్తి చేయాలనుకున్న ఓటిటి డీల్స్ కు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాకపోవడంతో పాటు ఫహద్ ఫాసిల్ బిజీ షెడ్యూల్స్ ఈ ప్రాజెక్టులను పెండింగ్ లో ఉంచాయట. పుష్ప 2 డేట్లకే సుకుమార్ కష్టపడాల్సి వచ్చింది. గత కొంత కాలంగా ఓటిటి మార్కెట్ బాగా డౌన్ లో ఉంది. టయర్ 1 స్టార్ హీరోలకు తప్ప మిగిలిన వాటికి అంత త్వరగా అగ్రిమెంట్లు జరగడం లేదు. ఫహద్ ఫాసిల్ ఫస్ట్ క్యాటగిరీలో లేకపోవడంతో తన మీద పెద్ద మొత్తాలు పెట్టేందుకు డిజిటల్ సంస్థలు సిద్ధంగా లేవట.
అటు ఆర్కా హ్యాండిల్ లోనూ దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడం అనుమానాలను మరింత పెంచుతోంది. బాహుబలి చరిత్ర సృష్టించినా సినిమాల నిర్మాణంలో ఆచితూచి అడుగులు వేస్తున్న ఆర్కా మీడియా రాజమౌళి అండగా ఉన్నా సరే ఇంత నెమ్మదిగా అడుగులు వేయడం ఆశ్చర్యమే. ఆక్సీజెన్ కు సిద్దార్థ్ నాదెళ్ల, డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ కి శశాంక్ యేలేటి దర్శకులుగా లాకయ్యారు. రెండింటికి కాల భైరవనే సంగీతం సమకూర్చాల్సి ఉంది. మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరిగినట్టు లేవు. పోస్టర్లు చూస్తే మంచి కంటెంట్ లాగే అనిపించింది కానీ ఇంత ఆలస్యం జరగడం వెనుక వేరే కారణాలేమైనా ఉన్నాయేమో.
This post was last modified on April 23, 2025 12:11 pm
టాలీవుడ్లో ఒకప్పుడు మాంచి క్రేజ్ సంపాదించుకున్న దర్శకుల్లో వైవీఎస్ చౌదరి ఒకరు. లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు చిత్రాలతో…
ఈ మధ్య అమీర్ ఖాన్ ఇంటర్వ్యూలలో మహాభారతం ప్రస్తావన ఎక్కువగా వస్తోంది. ఇది తన డ్రీం ప్రాజెక్ట్ అంటూ త్వరలోనే…
కొందరు సెలబ్రిటీలు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో కానీ ఒక్కోసారి చిన్న ట్వీట్లు, స్టేటస్ లే పెద్ద రాద్ధాంతానికి దారి…
నిన్నటిదాకా ఖచ్చితంగా మే 30 వస్తామని చెప్పిన కింగ్ డమ్ వాయిదా దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్…
పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో భారత్ శుక్రవారం మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. దేశంలోని అన్ని పోర్టులు, అంతరిక్ష…
ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణానికి పాక్ వైఖరే కారణం. ఈ…