90ల్లో అప్పటి పిల్లల్ని ఉర్రూతలూగించిన టీవీ సీరియళ్లలో ‘శక్తిమాన్’ ఒకటి. దూరదర్శన్లో సూపర్ హిట్టయిన ఈ సీరియల్లో ప్రధాన పాత్ర పోషించి ఎనలేని ఆదరణ సంపాదించుకున్నాడు ముకేష్ ఖన్నా. ఆ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించినా, ఎన్ని పాత్రలు చేసినా ‘శక్తిమాన్’తో తెచ్చుకున్న గుర్తింపే వేరు. ఐతే కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా, లైమ్ లైట్లో లేకుండా పోయిన ముకేష్ ఖన్నా.. వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో వ్యక్తి అయిపోయారు. ఆయనకున్న పేరును ఆ వ్యాఖ్యలు బాగా దెబ్బ తీశాయి.
సినీ పరిశ్రమతో పాటు వివిధ రంగాల్లో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై కొన్నేళ్లుగా ‘మీటూ’ పేరుతో ఉద్యమం సాగుతున్న సంగతి తెలిసిందే. దీని గురించి ముకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పని ప్రదేశాల్లో మహిళలపై జరిగే లైంగిక వేధింపులకు వారిదే బాధ్యత అన్న అర్థం వచ్చేలా మాట్లాడాడు ముకేష్ ఖన్నా.
సమాజంలోని ప్రతి అంశంలో తామూ మగవాళ్లతో సమామని భావించడం వల్లే మహిళలు లైంగిక దాడికి గురవుతున్నారని.. ఆడవాళ్లు ఇంటి పట్టున ఉండకుండా బయటకి వచ్చాకే ‘మీటూ’ మొదలైందని.. ఈ ఉద్యమానికి బాధ్యత వహించాల్సింది మహిళలే అని.. వారు పురుషులతో భుజం భుజం రాసుకు తిరగకుండా ఇంటి పని చూసుకుంటే మంచిదని ఇటీవల వ్యాఖ్యానించాడు ముకేష్.
ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలోనే దుమారం రేగింది. సోషల్ మీడియాలో మహిళలు ఆయనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పురుషులు సైతం పెద్ద ఎత్తున ఈ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ‘మీ టూ’లో భాగంగా అలుపెరగని పోరాటం చేస్తున్న చిన్మయి లాంటి వాళ్లు ఈ విషయాన్ని మరింతగా సోషల్ మీడియాలోకి తీసుకెళ్లారు.
దీంతో ముకేష్ పేరు బాగా దెబ్బ తింది. ఆయన అన్పాపులర్ అయ్యాడు. దీంతో తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పక తప్పలేదు. తాను మహిళల్ని గౌరవించడంలో ఎప్పుడూ ముందుంటానని.. తన వ్యాఖ్యలని తప్పుగా అర్థం చేసుకున్నారని.. తన వల్ల బాధ పడ్డవాళ్లందరినీ క్షమాపణలు చెబుతున్నానని ఆయన పేర్కొన్నారు. కానీ ఈలోపే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది.
This post was last modified on November 3, 2020 9:43 am
అఖండ 2 తాండవం వచ్చి తొమ్మిది నెలలు అయిపోయాయి. సీక్వెల్ అందులోనూ బ్లాక్ బస్టర్ కొనసాగింపు కాబట్టి బాలయ్య మరోసారి…
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…