90ల్లో అప్పటి పిల్లల్ని ఉర్రూతలూగించిన టీవీ సీరియళ్లలో ‘శక్తిమాన్’ ఒకటి. దూరదర్శన్లో సూపర్ హిట్టయిన ఈ సీరియల్లో ప్రధాన పాత్ర పోషించి ఎనలేని ఆదరణ సంపాదించుకున్నాడు ముకేష్ ఖన్నా. ఆ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించినా, ఎన్ని పాత్రలు చేసినా ‘శక్తిమాన్’తో తెచ్చుకున్న గుర్తింపే వేరు. ఐతే కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా, లైమ్ లైట్లో లేకుండా పోయిన ముకేష్ ఖన్నా.. వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో వ్యక్తి అయిపోయారు. ఆయనకున్న పేరును ఆ వ్యాఖ్యలు బాగా దెబ్బ తీశాయి.
సినీ పరిశ్రమతో పాటు వివిధ రంగాల్లో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై కొన్నేళ్లుగా ‘మీటూ’ పేరుతో ఉద్యమం సాగుతున్న సంగతి తెలిసిందే. దీని గురించి ముకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పని ప్రదేశాల్లో మహిళలపై జరిగే లైంగిక వేధింపులకు వారిదే బాధ్యత అన్న అర్థం వచ్చేలా మాట్లాడాడు ముకేష్ ఖన్నా.
సమాజంలోని ప్రతి అంశంలో తామూ మగవాళ్లతో సమామని భావించడం వల్లే మహిళలు లైంగిక దాడికి గురవుతున్నారని.. ఆడవాళ్లు ఇంటి పట్టున ఉండకుండా బయటకి వచ్చాకే ‘మీటూ’ మొదలైందని.. ఈ ఉద్యమానికి బాధ్యత వహించాల్సింది మహిళలే అని.. వారు పురుషులతో భుజం భుజం రాసుకు తిరగకుండా ఇంటి పని చూసుకుంటే మంచిదని ఇటీవల వ్యాఖ్యానించాడు ముకేష్.
ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలోనే దుమారం రేగింది. సోషల్ మీడియాలో మహిళలు ఆయనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పురుషులు సైతం పెద్ద ఎత్తున ఈ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ‘మీ టూ’లో భాగంగా అలుపెరగని పోరాటం చేస్తున్న చిన్మయి లాంటి వాళ్లు ఈ విషయాన్ని మరింతగా సోషల్ మీడియాలోకి తీసుకెళ్లారు.
దీంతో ముకేష్ పేరు బాగా దెబ్బ తింది. ఆయన అన్పాపులర్ అయ్యాడు. దీంతో తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పక తప్పలేదు. తాను మహిళల్ని గౌరవించడంలో ఎప్పుడూ ముందుంటానని.. తన వ్యాఖ్యలని తప్పుగా అర్థం చేసుకున్నారని.. తన వల్ల బాధ పడ్డవాళ్లందరినీ క్షమాపణలు చెబుతున్నానని ఆయన పేర్కొన్నారు. కానీ ఈలోపే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది.
This post was last modified on November 3, 2020 9:43 am
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…