నారా రోహిత్ను తెర మీద చూసి చాలా కాలం అయిపోయింది. ఒక దశలో అతడి సినిమాలు తొమ్మిది సినిమాలు లైన్లో ఉన్నాయి. రెండు మూడేళ్ల వ్యవధిలో ఆ సినిమాలన్నీ రిలీజయ్యాయి కూడా. ఐతే వాటిలో మెజారిటీ తీవ్ర నిరాశకు గురి చేశాయి. అలా మొదలైన పరాజయ పరంపరం నిరాటంకంగా సాగిపోయింది. గత నాలుగేళ్లలో రోహిత్ నుంచి ఒక్క హిట్టు సినిమా కూడా రాలేదు.
గత రెండేళ్లలో నారా రోహిత్ సినిమాలు చేయడమే మానేశాడు. చివరగా వీర భోగ వసంతరాయలులో నటించాడతను. ఆ సినిమా ఫలితం గురించి తెలిసిందే. అనగనగా దక్షిణాదిన పేరుతో ఒక భారీ సినిమాను మొదలుపెట్టినట్లే పెట్టి ఆపేసిన రోహిత్.. మరే కొత్త సినిమాను ప్రకటించలేదు. ఈ మధ్య బరువు తగ్గి, లుక్ మార్చుకునేసరికి కొత్త సినిమా ప్రకటన ఉంటుందనే సంకేతాలు కనిపించాయి. కానీ చప్పుడు లేదు.
రోహిత్ కొత్త సినిమాల గురించి అప్పుడప్పుడూ ఆసక్తికర ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఏదీ కార్యరూపం దాల్చట్లేదు. కొన్ని రోజుల కిందట పుష్పలో ఓ పాత్ర కోసం రోహిత్ను కన్సిడర్ చేస్తున్నారని, అల్లు అర్జునే అతణ్ని సుక్కుకు సిఫారసు చేశాడని వార్తలొచ్చాయి. కట్ చేస్తే అలాంటిదేమీ లేదని తేలిపోయింది. తాజాగా నాని చేయబోతున్న ప్రెస్టీజియస్ మూవీ శ్యామ్ సింగరాయ్లో నారా రోహిత్ ఓ కీలక పాత్ర చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి.
ట్యాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన ఈ సినిమా నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీతనంతో తెరకెక్కనుంది. ఇలాంటి వైవిధ్యమైన సినిమాలో రోహిత్ నటించాడంటే అతడి కెరీర్కు మంచిదే. కానీ ఇలా వార్తలు రావడమే తప్ప రోహిత్ సినిమాలేవీ పట్టాలైతే ఎక్కట్లేదు. మరి ఈ వార్త అయిన నిజం అయి ఈ టాలెంటెడ్ హీరో మళ్లీ తెరపై కనిపిస్తాడేమో చూడాలి.
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…