Movie News

బ్రాండ్ సెలబ్రిటీలు జాగ్రత్తగా ఉండాల్సిందే

వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉండే మహేష్ బాబు ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ కి బ్రాండ్ అంబాసడర్ గా పని చేసినందుకు ఈడి నోటీసులు అందుకోవడం ఇండస్ట్రీలోనే కాదు సగటు జనంలోనూ సంచలనం సృష్టించింది. సదరు సంస్థ వెనుక స్కాములు ఉండటంతో దానికి ప్రమోటర్ గా పారితోషికం తీసుకున్నందుకు మహేష్ ఇప్పుడు అధికారుల ముందు సంజాయిషీ ఇవ్వాల్సి ఉంటుంది. సరే ఇదేదో కావాలని చేసింది కాదనేది అర్థమవుతోంది. కానీ చట్టం లెక్కల్లో నిజాల కన్నా సాక్ష్యాలకే విలువెక్కువ. అందుకే ఈ పరిస్థితి. సరే మహేష్ ఈ సమస్యని పరిష్కరించుకుని బయటికి వచ్చేస్తాడు కానీ ఇక్కడ కొన్ని అంశాలు గమనించాలి.

రెమ్యునరేషన్లు భారీగా ఇస్తున్నారు కదాని దగ్గరికొచ్చిన బ్రాండ్లకు సంతకాలు చేసుకుంటూ పోతే తర్వాత చాలా సమస్యలు వస్తాయి. ఇటీవలే బెట్టింగ్ యాప్ వ్యవహారంలో వాటి వాణిజ్య ప్రకటనల్లో నటించిన నటీనటులు, ఇన్ఫ్లు యెన్సర్లు విచారణ సందర్భంగా ఇబ్బందులు ఎదురుకున్నారు. ప్రకాష్ రాజ్ ఏకంగా వీడియో రూపంలో సారీ చెప్పాడు. ఇటీవలే అల్లు అర్జున్, శ్రీలీల ఒక కార్పొరేట్ కాలేజీకు చేసిన ప్రచారం పట్ల విద్యార్ధి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీడియోలు విడుదల చేయడం హాట్ టాపిక్ అయ్యింది. గతంలో అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ లాంటి వాళ్ళు సైతం ఇలాంటి చిక్కులు ఎదురుకున్నవాళ్లే.

ఇకపై తమదగ్గరికి వచ్చే కంపెనీల విషయంలో స్టార్లు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఉదంతాలు ఋజువు చేస్తున్నాయి. ఎందుకంటే జనాలు హీరో హీరోయిన్లు చెప్పేది నిజమని నమ్ముతారు. కొనుగోలు విషయంలో ప్రభావితం చెందుతారు. ఏదైనా తప్పు జరిగినప్పుడు బాధ్యతను నటీనటుల మీదకు తోసేస్తారు. ఇక్కడ పబ్లిక్ ది తప్పని చెప్పలేం. ఎందుకంటే రోజు టీవీలో, థియేటర్ లో చూస్తూ ఇష్టపడే వ్యక్తులు కావాలని అబద్దాలు చెప్పరనే నమ్మకం వాళ్ళలో ఉంటుంది. అలాంటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన బాధ్యత యాక్టర్ల మీదే ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ పరిణామాలు హెచ్చరికల్లాంటివి.

This post was last modified on April 22, 2025 7:51 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

5 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

7 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

8 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

8 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

10 hours ago

సమస్య చిన్నదయినా, పెద్దదయినా పవన్ కు ఒకటే

సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…

12 hours ago