టాలీవుడ్ దశనే కాదు ఇండియన్ సినిమా రూపురేఖలను కొత్త దిశ వైపు మళ్లించిన మొదటి ప్యాన్ ఇండియా మూవీగా బాహుబలి స్థానం ప్రత్యేకం. అప్పటిదాకా స్టార్ హీరోగా తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన ప్రభాస్ ఇమేజ్ ఏకంగా దేశాలు దాటిపోయి అమెరికా నుంచి జపాన్ దాకా పాకింది. పులిని చూసి నక్కను వాత పెట్టుకున్న తరహాలో హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఇలాంటి క్లాసిక్ ఒకటి తీయాలని ప్రయత్నించి బొక్కా బోర్లాపడిన వాళ్ళు ఎందరో. మోహన్ లాల్, విజయ్ లాంటి ఎందరో చేసిన ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. అసలు పాయింట్ ఇది కాదు. దర్శకుడు రోహిత్ శెట్టి గురించి.
పోలీస్ కథలకు కమర్షియల్ మసాలా జోడించడంలో ఇతని నైపుణ్యం తెలిసిందే. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో యాంకర్ మన దక్షిణాది చిత్రాల గురించి గొప్పగా మాట్లాడుతుంటే మధ్యలో అడ్డుతగిలి మనం ఏనాడో షోలే, మొఘల్ ఏ అజమ్ ఇచ్చామంటూ పంచులు వేయబోయి కౌంటర్ అయ్యాడు. వర్తమానం గురించి చెప్పమంటే గతాన్ని హైలైట్ చేయబోయాడు. ఇప్పుడదే రోహిత్ శెట్టి ఇటీవలే ఇచ్చిన ఒక పాడ్ క్యాస్ట్ ముఖాముఖీలో బాహుబలి, కల్కి 2898 ఏడి తనను బాగా ఇన్స్ పైర్ చేసిన సినిమాలని, కుటుంబ సభ్యులు కూడా బాగా ఎంజాయ్ చేశారని, వాటిని చూసి నా లాంటి ఫిలిం మేకర్స్ నేర్చుకోవాలని అన్నాడు.
చూశారా కాల మహిమ. ఒకప్పుడు టాలీవుడ్ గొప్పదనాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడని బాలీవుడ్ డైరెక్టర్ ఇప్పుడు అతనే స్వయంగా పొగడ్తల వర్షం కురిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో బాగా చక్కర్లు కొడుతోంది. అయినా రోహిత్ శెట్టికి పెద్ద బ్రేక్ ఇచ్చిన సింగం సిరీస్ కూడా తమిళం నుంచి తీసుకున్నదే కానీ స్వంతం కాదుగా. అదే ఫార్ములాని వాడుతూ ఆ మధ్య సూర్యవంశీ అనే సినిమా, ప్రైమ్ కోసం ఒక వెబ్ సిరీస్ తీశాడు అవేవి ఆశించిన గొప్ప స్థాయిలో ఆడలేదు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రభాస్ సినిమాలు ఇంటర్నేషనల్ మార్కెట్ లో భారతీయ కంటెంట్ కి డిమాండ్ తీసుకొచ్చిన మాట వాస్తవం.
This post was last modified on April 21, 2025 3:12 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…