ఒకప్పుడు దక్షిణాదిన ఒక వెలుగు వెలిగిన నిర్మాతల్లో ఏఎం రత్నం ఒకరు. శ్రీ సూర్య మూవీస్ అనే బేనర్ కనిపిస్తే చాలు.. ఆ చిత్రం మీద భారీ అంచనాలు ఏర్పడేవి. కర్తవ్యం, భారతీయుడు, స్నేహం కోసం, ఖుషి లాంటి భారీ విజయాలతో నిర్మాతగా వైభవం చూశారాయన. ఆ రోజుల్లో ఉన్న బడ్జెట్ పరిమితులను ఏమాత్రం పట్టించుకోకుండా భారీగా ఖర్చు పెట్టి సినిమాలు తీసేవారాయన. ఎందరో నిర్మాతలకు ఆయన స్ఫూర్తిగా నిలిచారు. కానీ ఎలాంటి నిర్మాతకైనా నిలకడగా విజయాలు సాధించడం కీలకం. అవి లేకే రత్నం కూడా వెనుకబడిపోయారు. ముఖ్యంగా తన కొడుకు జ్యోతికృష్ణ దర్శకత్వంలో తీసిన సినిమాలన్నీ ఆయన్ని దారుణంగా దెబ్బ కొట్టాయి.
వేరే చిత్రాలు కూడా వర్కవుట్ కాక.. కొన్నేళ్ల సినిమా నిర్మాణానికే దూరం అయిపోయారు రత్నం. మళ్లీ ఆయన చాలా గ్యాప్ తర్వాత మొదలుపెట్టిన పెద్ద సినిమా.. హరిహర వీరమల్లు. ఈ సినిమా కోసం దయానందరెడ్డి అనే భాగస్వామిని కూడా తెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ హీరో.. క్రిష్ దర్శకుడు.. పైగా పీరియడ్ స్టోరీ.. ఇంకేముంది బాక్సాఫీస్ బద్దలే అనుకున్నారంతా. సినిమా మొదలైనపుడు, టీజర్ వచ్చినపుడు హైప్ మామూలుగా లేదు. కానీ పవన్ కళ్యాణ్కు ఉన్న ఇతర సినిమా, రాజకీయ కమిట్మెంట్ల ప్రభావం ‘వీరమల్లు’పై పడి ఆ సినిమా అన్యాయం అయిపోయింది. మొదలైన ఐదేళ్లకు కూడా రిలీజ్ కాని పరిస్థితి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ‘వీరమల్లు’ను మే 9 నుంచి కూడా పోస్ట్ పోన్ చేశారన్నది స్పష్టం. ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు.
చివరి షెడ్యూల్ చిత్రీకరణకు పవన్ ఎప్పుడు హాజరవుతాడో క్లారిటీ లేదు. ఇప్పటికే సినిమా బడ్జెట్ తడిసి మోపెడైంది. వడ్డీల భారం మోయలేనంతగా మారింది. మరోవైపు సినిమాకు ఇంతకుముందున్న హైప్ అంతా తగ్గిపోయింది. సినిమా విపరీతంగా ఆలస్యం కావడం, దర్శకుడు మారడం లాంటి కారణాలతో ఇటు ప్రేక్షకుల్లో, అటు ట్రేడ్ వర్గాల్లో సినిమాకు క్రేజ్ కనిపించడం లేదు. పెట్టిన బడ్జెట్ రికవర్ చేయడం చాలా కష్టమే. తక్కువ నష్టాలతో బయటపడ్డమూ సవాలుగా మారే పరిస్థితి. ఈ సినిమా దెబ్బకు రత్నం తీవ్ర సంక్షోభంలో పడిపోయాడని సన్నిహిత వర్గాలంటున్నాయి.
This post was last modified on April 20, 2025 6:14 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…