ఒకప్పుడు దక్షిణాదిన ఒక వెలుగు వెలిగిన నిర్మాతల్లో ఏఎం రత్నం ఒకరు. శ్రీ సూర్య మూవీస్ అనే బేనర్ కనిపిస్తే చాలు.. ఆ చిత్రం మీద భారీ అంచనాలు ఏర్పడేవి. కర్తవ్యం, భారతీయుడు, స్నేహం కోసం, ఖుషి లాంటి భారీ విజయాలతో నిర్మాతగా వైభవం చూశారాయన. ఆ రోజుల్లో ఉన్న బడ్జెట్ పరిమితులను ఏమాత్రం పట్టించుకోకుండా భారీగా ఖర్చు పెట్టి సినిమాలు తీసేవారాయన. ఎందరో నిర్మాతలకు ఆయన స్ఫూర్తిగా నిలిచారు. కానీ ఎలాంటి నిర్మాతకైనా నిలకడగా విజయాలు సాధించడం కీలకం. అవి లేకే రత్నం కూడా వెనుకబడిపోయారు. ముఖ్యంగా తన కొడుకు జ్యోతికృష్ణ దర్శకత్వంలో తీసిన సినిమాలన్నీ ఆయన్ని దారుణంగా దెబ్బ కొట్టాయి.
వేరే చిత్రాలు కూడా వర్కవుట్ కాక.. కొన్నేళ్ల సినిమా నిర్మాణానికే దూరం అయిపోయారు రత్నం. మళ్లీ ఆయన చాలా గ్యాప్ తర్వాత మొదలుపెట్టిన పెద్ద సినిమా.. హరిహర వీరమల్లు. ఈ సినిమా కోసం దయానందరెడ్డి అనే భాగస్వామిని కూడా తెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ హీరో.. క్రిష్ దర్శకుడు.. పైగా పీరియడ్ స్టోరీ.. ఇంకేముంది బాక్సాఫీస్ బద్దలే అనుకున్నారంతా. సినిమా మొదలైనపుడు, టీజర్ వచ్చినపుడు హైప్ మామూలుగా లేదు. కానీ పవన్ కళ్యాణ్కు ఉన్న ఇతర సినిమా, రాజకీయ కమిట్మెంట్ల ప్రభావం ‘వీరమల్లు’పై పడి ఆ సినిమా అన్యాయం అయిపోయింది. మొదలైన ఐదేళ్లకు కూడా రిలీజ్ కాని పరిస్థితి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ‘వీరమల్లు’ను మే 9 నుంచి కూడా పోస్ట్ పోన్ చేశారన్నది స్పష్టం. ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు.
చివరి షెడ్యూల్ చిత్రీకరణకు పవన్ ఎప్పుడు హాజరవుతాడో క్లారిటీ లేదు. ఇప్పటికే సినిమా బడ్జెట్ తడిసి మోపెడైంది. వడ్డీల భారం మోయలేనంతగా మారింది. మరోవైపు సినిమాకు ఇంతకుముందున్న హైప్ అంతా తగ్గిపోయింది. సినిమా విపరీతంగా ఆలస్యం కావడం, దర్శకుడు మారడం లాంటి కారణాలతో ఇటు ప్రేక్షకుల్లో, అటు ట్రేడ్ వర్గాల్లో సినిమాకు క్రేజ్ కనిపించడం లేదు. పెట్టిన బడ్జెట్ రికవర్ చేయడం చాలా కష్టమే. తక్కువ నష్టాలతో బయటపడ్డమూ సవాలుగా మారే పరిస్థితి. ఈ సినిమా దెబ్బకు రత్నం తీవ్ర సంక్షోభంలో పడిపోయాడని సన్నిహిత వర్గాలంటున్నాయి.
This post was last modified on April 20, 2025 6:14 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…