‘గ్రహణం’ చిత్రంతో అరంగేట్రంలోనే జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. తెలుగులో గొప్ప అభిరుచి ఉన్న, తెలుగుదనంతో సినిమాలు తీసే అతి కొద్దిమంది దర్శకుల్లో ఆయనొకరు. ఐతే కెరీర్లో ఇప్పటిదాకా చిన్న, మిడ్ రేంజ్ చిత్రాలే చేశాడు ఇంద్రగంటి. ఆయనకు కూడా పెద్ద స్టార్లతో భారీ చిత్రాలు తీయాలనే ఆశ ఉంది. ఆయన దగ్గర ‘జటాయు’ అనే ఒక భారీ కథ ఉంది. దీన్ని రెండొందల కోట్ల బడ్జెట్లో ఒక టాప్ స్టార్తో తీస్తారని గతంలో ప్రచారం జరిగింది. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడానికి కూడా ముందుకొచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఎందుకో ఆ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు.
అన్నీ రెడీ అనుకున్నాక ఏం జరిగింది అన్నది అర్థం కాలేదు. తన కొత్త చిత్రం ‘సారంగపాణి జాతకం’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన ఇంద్రగంటి ‘జటాయు’ గురించి మాట్లాడారు. ‘‘సారంగపాణి కంటే ముందు ‘జటాయు’ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడానికి అంగీకరించారు. ఐతే కొన్ని రోజుల ట్రావెల్ చేసిన తర్వాత.. ఆయన నిర్మిస్తున్న ‘గేమ్ చేంజర్’ పూర్తి కావడానికి ఎక్కువ సమయం పడుతుందని తెలిసి మధ్యలో ఇంకో సినిమా చేసుకుని రండి అని రాజు గారు చెప్పారు. అప్పుడే శివలెంక కృష్ణ ప్రసాద్ గారితో ‘సారంగపాణి జాతకం’ మొదలుపెట్టాం.
‘జటాయు’ నా డ్రీమ్ ప్రాజెక్టు. ఆ చిత్రాన్ని ఎప్పటికైనా నేనే తెరకెక్కిస్తా. వేరొక దర్శకుడైతే నేను అనుకున్నట్లుగా ఆ సినిమాను తీయలేరు’’ అని ఇంద్రగంటి తెలిపారు. ఇక ‘సారంగపాణి జాతకం’లో జాతకాలు మంచివా, చెడ్డవా అనేమీ చెప్పలేదని.. నమ్మకాల్ని తాను ప్రశ్నించలేదని ఇంద్రగంటి తెలిపారు. తన జీవితంలోనూ జాతకం ప్రకారం చెప్పిన విషయాలు కొన్ని జరిగాయని, కొన్ని జరగలేదని.. జాతకాలపై నమ్మకాలనేవి ఎవరికి వాళ్లకి వ్యక్తిగత విషయాలని.. ఏ విషయమైనా పరిమితిలో ఉండాలని ఈ సినిమాలో చెప్పే ప్రయత్నం చేశానని ఇంద్రగంటి తెలిపారు. ‘సారంగపాణి జాతకం’ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on April 20, 2025 3:14 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…