ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే తెలుగులో లైగర్ తో ఎంట్రీ ఇవ్వడం చూశాం. సినిమా డిజాస్టరే కానీ హీరోయిన్ గా అమ్మడి ఎక్స్ ప్రెషన్లు, నటన మీద చాలా కామెంట్సే వచ్చాయి. పీల దేహంతో అరువు తెచ్చినట్టున్న హావభావాలతో కనీస స్థాయిలో మెప్పించలేకపోయింది. ఏడేళ్ల క్రితం 2019 లో ఎంట్రీ ఇచ్చిన అనన్య ఇప్పటిదాకా కెరీర్ బెస్ట్ అని చెప్పుకోవడానికి ఏమి లేదు. బ్లాక్ బస్టర్ ఒక్కటీ పడలేదు. ఒకటి రెండు యావరేజ్ అయినా తనను గుర్తుపెట్టుకున్న వాళ్ళు తక్కువ. అందుకే నెపోటిజం మీద ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు ముందు వచ్చే పేర్లలో అనన్యది తప్పకుండా ఉంటుంది.
ఇన్ని సంవత్సరాల తర్వాత అనన్య పాండేకు చెప్పుకోదగ్గ పాత్ర కేసరి ఛాప్టర్ 2లో దొరికింది. అక్షయ్ కుమార్, ఆర్ మాధవన్ ప్రధాన పాత్రల్లో స్వాతంత్ర సంగ్రామంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జలియన్ వాలా బాగ్ ఊచకోత బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు కరణ్ సింగ్ త్యాగి దీన్ని తెరకెక్కించారు. రివ్యూస్ చాలా పాజిటివ్ గా వచ్చాయి. పబ్లిక్ టాక్ పెరుగుతోంది. గంటకు కనీసం పది వేల టికెట్లు బుక్ మై షోలో అమ్ముడుపోతున్న సినిమా ప్రస్తుతానికి ఇది ఒక్కటే. ఇందులో అనన్య పాండే దిల్ రీత్ గిల్ గా చాలా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. గంపెడు సీనియర్ ఆర్టిస్టుల మధ్య ఇంత నటించడం గొప్పేనని చెప్పాలి.
తన మీద పడిన ముద్రని తొలగించుకోవడానికి అనన్య పాండేకు కేసరి 2 ఉపయోగపడేలా ఉంది. అవకాశాల కోసం వేచి చూస్తున్న టైంలో ఇది బ్రేక్ ఇవ్వడం ఖాయమని విశ్లేషకుల అంచనా. అక్షయ్ కుమార్ భార్యగా రెజీనా కెసెండ్రా లాంటి అనుభవజ్ఞులు చాలానే ఉన్నప్పటికీ అనన్య పాండే తనదైన ముద్ర వేయగలిగింది. సంవత్సరాల తరబడి సక్సెస్ కోసం మొహం వాచిపోయి ఉన్న అక్షయ్ కుమార్ కు కేసరి 2 రూపంలో హిట్టు పడేలా ఉంది. మరీ రికార్డులు బద్దలు కొట్టే స్థాయిలో కాకపోతే సూపర్ హిట్ అయితే ఖాయం. అంతకన్నా పెద్ద ఫలితం దక్కుతుందా లేదానేది ఇంకో వారం పది రోజుల్లో తేలనుంది.
This post was last modified on April 19, 2025 5:38 pm
బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం(రేపు)తో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో చివరి రెండో రోజైన గురువారం రాజకీయ వేడి లోక్సభను కుదిపేసింది.…
రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…